ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్
జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, బొబ్బిలి, రాజాం, ఎస్.కోట నియోజకవర్గ కేంద్రాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
విజయనగరంలోని జేఎన్టీయూ కేంద్రంలో ఓటేసేందుకు వరుసకట్టిన ఉద్యోగులు
విజయనగరం ఉడాకాలనీ, న్యూస్టుడే: జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, బొబ్బిలి, రాజాం, ఎస్.కోట నియోజకవర్గ కేంద్రాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయనగరంలోని జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో పెట్టిన రెండు ఫెసిలిటేషన్ కేంద్రాలను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిణి నాగలక్ష్మి సందర్శించారు. క్యూలైన్లు, పోలింగ్ బూత్లు, హెల్ప్ డెస్క్, ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. కొంతమంది తమ ఓట్లు జాబితాలో లేవని చెప్పడంతో.. వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు. నియామక పత్రాలు, గుర్తింపు కార్డులతో హక్కు పొందవచ్చన్నారు. జేసీ కార్తీక్, సహాయ కలెక్టర్ వెంకట త్రివినాగ్, పోస్టల్ బ్యాలెట్ జిల్లా నోడల్ అధికారి సందీప్కుమార్, డీఆర్డీఏ పీడీ కల్యాణ్ చక్రవర్తి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సుధారాణి, జడ్పీ ఉప సీఈవో రాజ్కుమార్ పాల్గొన్నారు.
తొలిరోజు 5,659 ఓట్లు
విజయనగరం ఉడాకాలనీ, న్యూస్టుడే: జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో ఆదివారం అన్ని నియోజకవర్గాలకు సంబంధించి 4,989 ఓట్లు పోలయ్యాయి. ఇతర జిల్లాలకు చెందిన 670 మంది ఓట్లు వేశారు. మొత్తంగా జిల్లాలో 5,659 ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా విజయనగరం నియోజకవర్గంలో పోలవగా, అత్యల్పంగా చీపురుపల్లి నియోజకవర్గంలో పోలింగ్ జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇసుకపై.. డేగకన్ను
[ 19-05-2024]
ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో గనుల శాఖ అధికారులు తనిఖీలకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు చూసీచూడనట్లు వ్యవహరించిన వారంతా గత రెండు రోజులుగా రేవులను పరిశీలించే పనిలో పడ్డారు. -
జీర్ణావస్థలో జీసీసీ
[ 19-05-2024]
గిరిజనులకు అండగా నిలిచి.. వారు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన జీసీసీ (గిరిజన సహకార సంస్థ)ని ప్రభుత్వం ఖూనీ చేసింది. -
భూసార పరీక్షల ఫలితాలేవీ..?
[ 19-05-2024]
ఏ పంట పండించినా దిగుబడి బాగుండాలంటే భూమి సారవంతంగా ఉండాలి. దీని కోసం భూమిలో లోపాలు తెలుసుకొని, అవసరమైన చర్యలు చేపట్టాలి. దీంతో దిగుబడి పెరిగి వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. -
కూటమికి 160 పైగా సీట్లు ఖాయం
[ 19-05-2024]
రాష్ట్రంలో కూటమికి 160కి పైగా సీట్లు రావడం ఖాయమని చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. శనివారం చీపురుపల్లిలోని నటరాజ్ రెసిడెన్సీలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
ఉన్నవి 24 రోజులే.. నాడు-నేడు మాటేమిటి?
[ 19-05-2024]
రెండో విడత నాడు నేడు పనులు నిధుల కొరతతో 2023 అక్టోబరు నుంచి నిలిచిపోయాయి. ఏప్రిల్లో డబ్బులు విడుదలైనా సిమెంట్, ఇసుక వంటివి అందుబాటులో లేకపోవడంతో ముందుకు సాగలేదు. -
వైకాపా కదలికలపై నిఘా అవసరం
[ 19-05-2024]
స్థానిక తహసీల్దారు కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ గది తెరిచిన ఘటనపై శనివారం బంగ్లాలో పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతిరాజు పార్టీ ముఖ్య నాయకులతో చర్చించారు. -
ఈ ఖరీఫ్లో కన్నీరే!
[ 19-05-2024]
కళ్లెదుటే నీళ్లున్నాయి.. చేతుల్లో డబ్బులున్నాయి.. కానీ ఫలితం లేదు.. పొలం తడవదు.. పంట పండదు.. జలాశయాల ఆధునికీకరణకు జైకా నిధులిచ్చినా.. పనులు చేయడంలో ప్రభుత్వం నిర్లిప్తత చూపించింది. ఫలితంగా మూడేళ్లు అవుతున్నా పనుల్లో ఆశించిన పురోగతి లేదు. -
అనంతపురం ఎస్పీగా గౌతమీశాలి
[ 19-05-2024]
విశాఖపట్నం 16 బెటాలియన్ కమాండెంట్గా పనిచేస్తున్న గౌతమీశాలిని ఎన్నికల సంఘం అనంతపురం ఎస్పీగా నియమించింది. -
ఈఏపీసెట్లో మెరుపులు
[ 19-05-2024]
తెలంగాణ ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ఉమ్మడి జిల్లాల విద్యార్థులు మెరిశారు. వ్యవసాయం, ఫార్మసీ విభాగంలో బలిజిపేట మండలం చిలకలపల్లికి చెందిన నాగుదాసరి రాధాకృష్ణ రెండో ర్యాంకు, ఇంజినీరింగ్ విభాగంలో విజయనగరానికి చెందిన దనుకొండ శ్రీనిధి పదో ర్యాంకు పొందారు. -
స్ట్రాంగ్ రూం తెరుస్తున్నట్లు సమాచారం ఇవ్వలేదు
[ 19-05-2024]
విజయనగరం తహసీల్దారు కార్యాలయంలో ఈ నెల 16న పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్రూం తెరిచినప్పుడు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని విజయనగరం అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పాండ్రంకి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలేవంటే?
-
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
-
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
-
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్ రంజన్
-
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం
-
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!