ఎస్సై వేధింపులకు యువకుడి ఆత్మహత్యాయత్నం!
ఎస్సై తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఓ యువకుడు సామాజిక మాధ్యమాల్లో సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లిలో జరిగింది.
సెల్ఫీ వీడియోలో మాట్లాడుతున్న సాంబరాజు
ఐనవోలు, న్యూస్టుడే: ఎస్సై తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఓ యువకుడు సామాజిక మాధ్యమాల్లో సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లిలో జరిగింది. బాధితుడు, గ్రామస్థుల కథనం ప్రకారం.. కక్కిరాలపల్లి శివారు ప్రాంతంలోని వడ్డెరగూడెం బోడ గుట్ట సమీపంలో కాశ, వడ్డెర కులస్థులు కొన్నేళ్లుగా నివాసముంటున్నారు. ఈ నెల 7న ఐనవోలు ఎస్సై జి.వెంకన్న గూడేనికి వెళ్లగా పేలుడు పదార్థాలను గుర్తించి ముగ్గురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ముగ్గురిలో ఒకడైన గోస సాంబరాజును పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని ఎస్సై వేధించాడు. దీనికి తోడు అతడి కంప్రెషర్ ట్రాక్టర్కు ఫైనాన్స్ చెల్లించలేదని అధికారులు లాక్కెళ్లారు. ఎస్సై వేధిస్తుండటం, పైనాన్స్ అధికారులు ట్రాక్టర్ను తీసుకెళ్లడంతో మనస్తాపం చెందిన సాంబరాజు సెల్ఫీ వీడియో చిత్రీకరించి గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపులో పోస్టు చేసి పురుగుల మందు తాగాడు. అటుగా వెళ్లిన రవీందర్ అతణ్ని చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి భార్య రాజేంద్ర 100కు డయల్ చేసి ఫిర్యాదు చేశారు.
నిబంధనల ప్రకారమే వ్యవహరించా : - గుగులోతు వెంకన్న, ఎస్సై, ఐనవోలు
అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు ఉపయోగిస్తూ బండరాళ్లను బ్లాస్ట్ చేస్తున్నట్లు సమాచారం రాగా తనిఖీ చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాం. నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశా. ఫోన్ చేసి వేధించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలపై అధికారుల ఉదాసీనత
[ 27-04-2024]
జనగామ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు, గ్రామాల్లో క్లినిక్లు నిర్వహిస్తున్న వైద్యులు, ఆర్ఎంపీల ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో తనిఖీలు చేపట్టడానికి ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. -
కరవు కోరలు.. పశుగ్రాసానికి తంటాలు!
[ 27-04-2024]
వర్షాలు సరిగా లేక పంటలు వేసినా చాలా వరకు చేతికందలేదు.. దీంతో రైతన్నలు పశుగ్రాసానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మోరంచవాగుకు ఇరువైపులా పంటలు సాగు చేసుకున్న వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది -
కక్షిదారులకు ఈ-న్యాయ సేవలు
[ 27-04-2024]
వివిధ న్యాయస్థానాల్లో కక్షిదారులకు వారి కేసులకు సంబంధించిన సమాచారం, ధ్రువపత్రాలు, న్యాయసహాయం తదితర సేవలు మరింత సులభతరం కానున్నాయి. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
పోలు చిట్టీలొచ్చాయ్..!
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల్లో శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు పోల్ చిట్టీలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
అనుమతి లేకుండా ల్యాబ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు
[ 27-04-2024]
అనుమతి, అర్హతలు లేకుండా డయాగ్నస్టిక్ సెంటర్లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి కళావతిబాయి హెచ్చరించారు. -
వంతెనల నిర్మాణాల్లో తేలిపోతున్న నాణ్యత లోపాలు..
[ 27-04-2024]
దశాబ్దాల పాటు మన్నికగా ఉండాల్సిన వంతెనలు ఉన్నఫలంగా కూలిపోతున్నాయి. ప్రజల రవాణా కష్టాలను మెరుగు పర్చేందుకు నిర్మిస్తున్న వారధుల జీవితకాలం కొద్ది రోజుల్లోనే ముగుస్తోంది. -
రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం
[ 27-04-2024]
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ .. ఆ పార్టీ అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని’ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్