డోర్నకల్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు
డోర్నకల్ కాంగ్రెస్ టికెట్పై నెలకొన్న ఉత్కంఠతకు తెర పడింది. పార్టీ అధిష్ఠానం సోమవారం రాత్రి 10.30 గంటలకు విడుదల చేసిన మూడో జాబితాలో డోర్నకల్ నుంచి డా.జాటోత్ రామచంద్రునాయక్ పేరును ఖరారు చేసింది.
న్యూస్టుడే, డోర్నకల్
పేరు: డా.జాటోత్ రామచంద్రునాయక్
స్వస్థలం: బొమ్మకల్ గ్రామం, పెద్దవంగర మండలం, మహబూబాబాద్ జిల్లా
వృత్తి: వైద్యుడు
ప్రస్తుత పదవి: డోర్నకల్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి * గత చరిత్ర: 2014లో తెదేపా తరఫున, 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఉత్కంఠకు తెర..!: డోర్నకల్ కాంగ్రెస్ టికెట్పై నెలకొన్న ఉత్కంఠతకు తెర పడింది. పార్టీ అధిష్ఠానం సోమవారం రాత్రి 10.30 గంటలకు విడుదల చేసిన మూడో జాబితాలో డోర్నకల్ నుంచి డా.జాటోత్ రామచంద్రునాయక్ పేరును ఖరారు చేసింది. ఉమ్మడి జిల్లాలో 11 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఒక్క డోర్నకల్ నియోజకవర్గాన్ని మాత్రం పెండింగ్లో ఉంచింది. టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొనడంతో నామినేషన్ల ఘట్టం ప్రారంభమై మూడు రోజులు గడిచాక అభ్యర్థిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో 2014 శాసనసభ ఎన్నికలప్పుడు తెదేపాలో చేరిన ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చింది. ఓటమి చెందాక పార్టీ వీడిన ఆయన 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా తలపడి పరాజయం చెందారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డా.జాటోత్ రామచంద్రునాయక్కు కాంగ్రెస్ టికెట్ లభించడంతో ఆయన డోర్నకల్లో వరుసగా మూడోసారి ప్రస్తుత ఎమ్మెల్యే, భారాస అభ్యర్థి రెడ్యానాయక్తో పోటీ పడనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ రోడ్ షో నేడు
[ 28-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం వరంగల్ నగరంలో బస్సు యాత్రలో పాల్గొనేందుకు సర్వం సిద్ధమైంది. -
తేలిన లెక్క.. అతివలే నిర్ణేతలు
[ 28-04-2024]
వరంగల్(ఎస్సీ), మహబూబాబాద్(ఎస్టీ) లోక్సభ స్థానాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల లెక్క తేలింది.. ఫిబ్రవరి 8న తుది జాబితా ప్రకటించినా.. అర్హులైన వారు ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. -
మీరెక్కడుంటే.. మేమక్కడుంటాం..!
[ 28-04-2024]
నామపత్రాల దాఖలు పర్వం పూర్తికావడంతో లోక్సభ ఎన్నికల జోరు పెరిగింది.. అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
పోలింగ్ శాతం పెంపునకు కృషి
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్శాతం పెంచడానికి మెప్మా సిబ్బంది కృషి చేయాలని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారిణి భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. -
బోర్డు తిప్పేసిన నకిలీ వైద్యుడు
[ 28-04-2024]
జిల్లా వైద్యఆరోగ్యశాఖ, తెలంగాణ వైద్యమండలి సభ్యులు హనుమకొండలో ఓ నకిలీ వైద్యుడిని గుర్తించారు. -
ప్రజాస్వామ్యం ఓటుతోనే సాధ్యం
[ 28-04-2024]
ప్రజాస్వామ్యమనేది ఓటు ద్వారానే సాధ్యమని, ఓటు హక్కును మన ప్రాథమిక బాధ్యతగా భావించి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. -
‘వెంట ఉన్నవాళ్లే ఓట్లేయలేదు’
[ 28-04-2024]
ఓటర్లకు తన పట్ల వ్యతిరేకత లేదని, వెంట తిరిగిన వాళ్లే ఓట్లేయలేదని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పేర్కొన్నారు. -
అమ్ముడుపోని తునికాకు యూనిట్లు
[ 28-04-2024]
ఈ ఏడాదిలో తునికాకు కూలీల ఉపాధికి పెద్ద మొత్తంలో గండి పడనుంది. జిల్లా వ్యాప్తంగా 16 తునికాకు యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
[ 28-04-2024]
జిల్లాలో విస్తృత తనిఖీలు చేపట్టి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం
[ 28-04-2024]
ఎన్నికల విధుల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వరంగల్ లోక్సభ నియోజకవర్గ సాధారణ పరిశీలకురాలు బండారి స్వాగత్ రనవీర్ చంద్ సూచించారు. -
సంక్షేమ పాలన చూసి కాంగ్రెస్కు ఓటేయండి
[ 28-04-2024]
కులం, మతం పేరిట కాదు, కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమ ప్రజాపాలన చూసి ఓట్లు వేయాలని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
పంచదార పంపిణీ చేయాల్సిందే!
[ 28-04-2024]
చౌక ధరల దుకాణాల్లో ఇక నుంచి పంచదార తప్పనిసరిగా పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ డీలర్లను ఆదేశించింది.