లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
జిల్లాలో విస్తృత తనిఖీలు చేపట్టి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
మాట్లాడుతున్న కలెక్టర్ భవేశ్ మిశ్రా, చిత్రంలో జూనియర్ సివిల్ జడ్జి రామచంద్రరావు
భూపాలపల్లి కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లాలో విస్తృత తనిఖీలు చేపట్టి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జూనియర్ సివిల్ కోర్టు జడ్జి రామచంద్రారావుతో కలిసి జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. వైద్యాధికారులకు లింగనిర్థారణ నిషేధిత చట్టాలపై అవగాహన కలిగేలా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని గైనకాలజిస్టు, రేడియాలజిస్టులను కలెక్టరు ఆదేశించారు. డీఎంహెచ్వో అనుమతి లేకుండా ఆసుపత్రుల్లో స్కానింగ్ యంత్రాల కొనుగోలు, వినియోగం చేయరాదన్నారు. జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ఫిర్యాదులకు టోల్ఫ్రీ నెంబర్ ప్రారంభించాలని, ప్రైవేటు ఆసుపత్రుల్లో లింగనిర్థారణ చేయరాదనే బోర్డులతోపాటు అనుమానాస్పద ఆసుపత్రులపై నిత్యం తనిఖీలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ మధుసూదన్, డీఎస్పీ సంపత్రావు, డీపీఆర్వో శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ కొమురయ్య, ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీదేవి, హెల్త్ ఎడ్యుకేటర్ కె శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి
భూపాలపల్లి కలెక్టరేట్: లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం కలెక్టరేట్లో పోలింగ్ కేంద్రాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య, తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మట్లాడుతూ లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అల్పాహారం, భోజనం, వసతి, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు తదితర అన్ని ఏర్పాట్లను ఎంపీడీవోలు చేయాలన్నారు. ప్రతి కేంద్రంలో ర్యాంపు, వీల్ ఛైర్, చల్లని తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, బాలింతలు, గర్భిణులు సత్వరం ఓటుహక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో అత్యవసర వైద్య సేవల కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్, ఆర్టీవో మంగిలాల్, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీఆర్డీవో నరేశ్, డీపీఆర్వో శ్రీనివాస్, డీపీవో నారాయణరావు, డీఎంహెచ్వో డాక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊయల కట్టిన స్టూల్ మీదపడి చిన్నారి మృతి
[ 09-05-2024]
పొట్టకూటి కోసం వందల కిలోమీటర్లు వలస వచ్చిన ఆ కూలీ కుటుంబంలో విషాదం అలుముకుంది. -
ఓరుగల్లులో కాషాయోత్సాహం
[ 09-05-2024]
మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు హోరెత్తాయి. ‘మరోమారు మోదీ సర్కారు’ అంటూ యువత కేరింతలు కొట్టింది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం వింటూ కమలం శ్రేణులు కొత్త ఉత్సాహంతో జేజేలు పలికాయి. -
ఎన్నికలకు పోలీసుల రక్షణ ఛత్రం
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. -
‘ప్రత్యేక త చాటాలి.. ఓటు మురవాలి
[ 09-05-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడానికి భారత ఎన్నికల సంఘం పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. పలు ప్రయోగాలు అమలు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తోంది. -
చెయ్యెత్తి నినదించూ.. ఓటెత్తి జైకొట్టు
[ 09-05-2024]
‘ఏ ఒక్క ఓటరు ఓటు వేయకుండా మిగిలిపోరాదు’ ఇది ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం, ఆశయం. -
నిబంధనల మేరకే ఈవీఎంల కమిషనింగ్
[ 09-05-2024]
ఎన్నికల నిబంధనల మేరకు ఈవీఎంల కమిషనింగ్ నిర్వహించినట్లు కేంద్ర ఎన్నికల ప్రత్యేక అధికారి నవీన్ విద్ది తెలిపారు. -
‘కడియం శ్రీహరి రాజకీయ ఊసరవెల్లి’
[ 09-05-2024]
భారాస పదేళ్ల పాలనలో ఎన్నో పదవులు అనుభవించి, స్వలాభం కోసం పార్టీ మారి ద్రోహం చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజకీయ ఊసరవెల్లి అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. -
భారాసపై అవినీతి మరకలతోనే పార్టీ వీడాను..
[ 09-05-2024]
వరంగల్ లోక్సభ స్థానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, నా కుమార్తె కడియం కావ్యను మీ బిడ్డగా నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపించాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. -
ఆదరించండి.. అభివృద్ధి బాధ్యత నాదే
[ 09-05-2024]
పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కోరారు. -
నాలుగో రోజు.. 431 మంది పోస్టల్ ఓటు వినియోగం
[ 09-05-2024]
నాలుగో రోజు బుధవారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా 431 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.. -
ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కండి
[ 09-05-2024]
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈ నెల 13న జరిగే లోక్సభ ఎన్నికల నిర్వహణకు అన్నివిధాలుగా సన్నద్ధమవ్వాలని రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. -
ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించండి
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఇండియా కూటమి బలపర్చిన పోరిక బలరాంనాయక్ను గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు. -
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
[ 09-05-2024]
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల పల్లెలకు చెందిన ఇద్దరు యువకులు ఐఎఫ్ఎస్ సాధించారు. -
అంతర్గత కలహాలపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికలకు పోలింగ్ తేదీ సమీపిస్తున్న సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పరస్పర విమర్శలు చేసుకోవడాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్గా తీసుకుంది. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గడువు పెంపు
[ 09-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయడానికి గడువు ఈ నెల 10 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పన్నూ హత్యకు కుట్ర కేసు.. అమెరికా ఆరోపణల వేళ భారత్కు రష్యా మద్దతు
-
చిరు టు మహేశ్.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ రోజెంతో ప్రత్యేకం..!
-
నష్టాల్లోనే స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,271
-
10 ఓవర్లలోపే విజయం.. నమ్మలేకపోతున్నా: కెప్టెన్ కమిన్స్
-
డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం
-
21వ శతాబ్దపు ఆర్థిక శక్తిగా భారత్.. మోదీ, అంబానీ, అదానీ కీలక పాత్ర: సీఎన్ఎన్