అమ్ముడుపోని తునికాకు యూనిట్లు
ఈ ఏడాదిలో తునికాకు కూలీల ఉపాధికి పెద్ద మొత్తంలో గండి పడనుంది. జిల్లా వ్యాప్తంగా 16 తునికాకు యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి.
ఉపాధి కోల్పోనున్న కూలీలు
చిగురిస్తున్న తునికాకు
భూపాలపల్లి, న్యూస్టుడే: ఈ ఏడాదిలో తునికాకు కూలీల ఉపాధికి పెద్ద మొత్తంలో గండి పడనుంది. జిల్లా వ్యాప్తంగా 16 తునికాకు యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. మిగతా 19 యూనిట్లలో ఆకు సేకరణ నిలిచిపోవడంతో ఆయా అటవీ గ్రామాలకు చెందిన వేలాది మంది కూలీలకు వేసవిలో ఉపాధి లేకుండా పోయింది. వేసవిలో వ్యవసాయ పనులు అంతగా లేెకపోవడంతో అటవీ గ్రామాలకు చెందిన వేలాది మంది కూలీలు తునికాకు సేకరణతో ఉపాధి పొందుతారు. తునికాకు సేకరణ మే మొదటి వారంలో ప్రారంభించనున్నారు. టెండర్లు పొందిన గుత్తేదారులు ఆకు సేకరణ చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ మేరకు జిల్లాలోని చాలా వరకు అటవీ గ్రామాల్లో అనేక మంది కూలీలు ఆకు సేకరణపైనే ఆధారపడతారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలోనే అడవి బాటపడతారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల్లోపే ఆకును సేకరించుకొని మళ్లీ ఇంటికి చేరుకుంటారు. ఇళ్లలోనే కుటుంబ సభ్యులందరూ కలిసి కట్టలు కట్టి, వాటిని విక్రయించి ఆదాయం సమకూర్చుకుంటారు. ఏటా కూలీలు, కొందరు వ్యవసాయ రైతులు తునికాకు సేకరణపైనే ఆసక్తి చూపుతారు.
జిల్లాలోని రెండు అటవీ డివిజన్లలో మొత్తం 35 వరకు తునికాకు యూనిట్లు ఉన్నాయి. యూనిట్ల వారీగా ఆన్లైన్లోనే టెండర్లు నిర్వహించారు. ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు నాలుగుసార్లు చేపట్టిన తునికాకు యూనిట్ల టెండర్లలో జిల్లావ్యాప్తంగా కేవలం 16 యూనిట్ల వరకే అమ్ముడుపోయాయి. మిగతా 19 యూనిట్లలో ఆకు సేకరణ కోసం గుత్తేదారులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ యూనిట్లలో ఆకు సేకరణ దాదాపు నిలిచిపోయినట్లే.. అమ్ముడుపోయిన యూనిట్లలోనే గుత్తేదారులు ఆకు సేకరిస్తారు. అయితే ముందుగా నాణ్యతగా తునికాకు రావడానికి కొందరు గుత్తేదారులు కొమ్మకొట్టడం(ప్రూనింగ్) చేయిస్తారు. కానీ, ఈ పని కూడా కొన్నేళ్లుగా చాలా వరకు యూనిట్లలో గుత్తేదారులు చేపట్టలేకపోతున్నారు.
ఆకు సేకరణ లక్ష్యం..
జిల్లాలోని మహదేవపూర్, భూపాలపల్లి అటవీ డివిజన్లలో మొత్తం 35 తునికాకు యూనిట్లలో ఈ ఏడాదిలో 38,400 స్టాండర్డ్ బ్యాగుల(ఎస్బీ) లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. ఇందులో భూపాలపల్లి అటవీ డివిజన్లో 19 యూనిట్లకు 19,800 ఎస్బీల లక్ష్యం కాగా, ఈ డివిజన్లో మొత్తం కల్లాలు 119 వరకు ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ డివిజన్ పరిధిలో కేవలం 5 యూనిట్లు అమ్ముడుపోగా మిగతా 14 అమ్ముడుపోలేదు. అదేవిధంగా మహదేవపూర్ డివిజన్లో 16 యూనిట్లలో 20,100 ఎస్బీల లక్ష్యం.. ఈ డివిజన్లో మొత్తం 112 కల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ డివిజన్లో 11 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఇంకా 5 యూనిట్లలో ఆకు సేకరణ కోసం గుత్తేదారులు ముందుకు రాలేదు. దీంతో అమ్ముడుపోని యూనిట్లలో ఆకు సేకరణ నిలిచిపోనుంది. ఒక్క ఎస్బీలో వెయ్యి తునికాకు కట్టలుంటాయి. ఈ లెక్క ప్రకారమే కూలీలకు డబ్బులు చెల్లిస్తారు. 50 ఆకుల తునికాకు కట్టకు రూ.రూ.1.40 పైసల చొప్పున గుత్తేదారులు చెల్లిస్తారు. ఒక ఎస్బీపై వచ్చే కూలీకి రూ.1,450 వరకు అందుతాయి. అయితే జిల్లావ్యాప్తంగా కూలీలు నష్టపోకుండా రెండు అటవీ డివిజన్లలో అమ్ముడుపోని తునికాకు యూనిట్లలో ప్రభుత్వమే ఆకు సేకరణ చేపట్టాలని పలు అటవీ గ్రామాల కూలీలు, సీపీఎం నాయకులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవినీతిపరుల అడ్డా కాంగ్రెస్
[ 10-05-2024]
దోపిడీలో కాంగ్రెస్ నెంబర్వన్గా మారిందని.. అవినీతి, కుటుంబ పాలనలో కూరుకుపోయిన ఆ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో వాతలు పెట్టాల్సిన అవసరం ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ధ్వజమెత్తారు. -
ఐటీడీఏలు ఎదగాలి.. గిరిజనం మురవాలి
[ 10-05-2024]
ఐటీడీఏ.. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ. కొన్నేళ్లుగా గాడితప్పింది. వీటి ఫలాలు గిరి పుత్రులకు పూర్తి స్థాయిలో అందడం లేదు. ఇప్పుడు పూర్వవైభవం చూడాలని గిరిపుత్రులు ఆశిస్తున్నారు. -
విదేశాల్లో ఓటుకు పట్టం.. వేయకుంటే ఊరుకోదు చట్టం!
[ 10-05-2024]
దేశం ప్రగతి దిశగా సాగాలంటే సమర్థులనే పాలకులుగా ఎన్నుకోవాలి. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే సుపరిపాలన అందించే ప్రభుత్వం ఏర్పాటవుతుంది. -
పైపైన పూడికతీత..ఇలాగైతే ముంచుతుంది నాలా!
[ 10-05-2024]
నగరంలో నాలాల పూడికతీత పనులు పైపైన జరుగుతున్నాయి. పర్యవేక్షించేవారు లేకపోవడంతో అడుగు భాగంలో పేరుకుపోయిన మట్టి(సిల్ట్), ఇతర వ్యర్థాలు ముట్టుకోవడం లేదు. -
కాంగ్రెస్, భాజపా దొందూ దొందే..
[ 10-05-2024]
ఇన్నాళ్లు దేశాన్ని పాలించిన జాతీయ పార్టీలు పేదలకు చేసిందేమీ లేదని, ప్రజా వ్యతిరేకతలో కాంగ్రెస్, భాజపా దొందూ దొందేనని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆరోపించారు. -
ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రజలు అశీర్వదించి గెలిపిస్తే ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డా.కడియం కావ్య అన్నారు. -
భారాస హయాంలో ముస్లింలకు అత్యంత ప్రాధాన్యం
[ 10-05-2024]
పరకాల, గీసుకొండ, న్యూస్టుడే: రాష్ట్రంలో ముస్లింలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ భారాస అని మాజీ హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. -
మరో అయిదు బడుల్లో పీఎంశ్రీ శ్రీకారం
[ 10-05-2024]
విద్యార్థుల సంఖ్య, పాఠశాలల్లో మౌలిక వసతులను గమనంలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈయేడాది జిల్లాలో మరో అయిదు పాఠశాలలను పీఎంశ్రీ (ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్) పథకానికి ఎంపిక చేసింది. -
‘ఏ పార్టీలో ఉన్నా.. క్రమశిక్షణకు కట్టుబడి ఉంటా’
[ 10-05-2024]
నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయాలు, క్రమశిక్షణకు కట్టుబడి కార్యకర్తలను కాపాడుకుంటానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. -
దేశ సంపద అంబానీ, అదానీల చెంత..
[ 10-05-2024]
దేశ సంపదను కేంద్రంలోని భాజపా అంబానీ, అదానీలకు దోచిపెట్టి, పన్నులను ప్రజలపై మోపుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. -
మహిళలకు తోడూనీడ.. సఖి
[ 10-05-2024]
బాధిత బాలికలకు, మహిళలకు ఆశ్రయం కల్పిస్తూ అండగా ఉంటుంది ఈ సంస్థ. -
రాహుల్గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం
[ 10-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. -
‘దేవుళ్లపై ఒట్లు వేస్తే ఓట్లు రాలవు’
[ 10-05-2024]
ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళితే అక్కడ స్థానిక దేవుళ్ల మీద ఒట్టేసి ఓట్లు అభ్యర్థిస్తున్నారని, కానీ ఈసారి ఓట్లు రాలవని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ అన్నారు. -
కేయూ వీసీ పదవి ఎవరిని వరించునో..!
[ 10-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రస్తుత ఉప కులపతి, సామాజిక శాస్త్రం సీనియర్ ఆచార్యులు తాటికొండ రమేశ్ మూడేళ్ల పదవీకాలం ఈ నెల 21తో ముగియనుంది. -
శ్రీభద్రకాళి కల్యాణ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 10-05-2024]
ఓరుగల్లు నగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీభద్రకాళి దేవస్థానంలో భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరిగింది. -
సిరా చుక్క పెట్టే వేలు లేకపోతే..?
[ 10-05-2024]
ఈ నెల 13న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే చాలు ఓటు వేశావా? -
కాంగ్రెస్ ప్రచారంలో అపశ్రుతి
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారం చేసేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతల వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదం -
హవాలా కేసులో ఇద్దరి అరెస్టు
[ 10-05-2024]
వరంగల్ నగరంలో జరిగిన ఆర్థిక మోసం(హవాలా) కేసులో మట్టెవాడ ఠాణా పోలీసులు గురువారం ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
-
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్