తేలిన లెక్క.. అతివలే నిర్ణేతలు
వరంగల్(ఎస్సీ), మహబూబాబాద్(ఎస్టీ) లోక్సభ స్థానాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల లెక్క తేలింది.. ఫిబ్రవరి 8న తుది జాబితా ప్రకటించినా.. అర్హులైన వారు ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.
వరంగల్(ఎస్సీ), మహబూబాబాద్(ఎస్టీ) లోక్సభ స్థానాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల లెక్క తేలింది.. ఫిబ్రవరి 8న తుది జాబితా ప్రకటించినా.. అర్హులైన వారు ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ మేరకు శనివారం అనుబంధ జాబితా ప్రకటించారు. వీరంతా మే 13న జరిగే ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల్లోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 33,56,832 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు-16,43,257, మహిళలు-17,13,072, ఇతర ఓటర్లు 503 మంది ఉన్నారు.
ఈనాడు, మహబూబాబాద్-న్యూస్టుడే, వరంగల్ కలెక్టరేట్
ఆమె ఓటే శాసనం
వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లోని ఓటర్లలో నారీమణులదే పైచేయిగా ఉంది. 14 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ మగవారి కంటే ఆడవారే ఎక్కువగా ఉన్నారు. వరంగల్ పరిధిలో 8,95,421 పురుష ఓటర్లు ఉండగా 9,28,648 మహిళా ఓటర్లున్నారు. అంటే 33,227 మంది అతివలు ఎక్కువ.. మహబూబాబాద్ పరిధిలో 7,47,836 పురుష ఓటర్లు ఉండగా 7,84,424 మహిళా ఓటర్లున్నారు. వీరిలో 36,588 నారీమణులు అధికంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆమె ఓటే శాసనం కానుంది.
పెరిగిన ఓటర్లు
ఫిబ్రవరి 8న ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం వరంగల్ లోక్సభ స్థానంలో 18,16,609 మంది ఓటర్లు ఉండగా, అనుబంధ జాబితా ప్రకారం 18,24,466 మంది ఉన్నారు. అంటే 7,857 మంది ఓటర్లు పెరిగారు. మహబూబాబాద్ పరిధిలో 15,26,137 ఓటర్లుండగా అనుబంధ జాబితా ప్రకారం 15,32,366 మంది ఉన్నారు. 6229 మంది ఓటర్లు పెరిగారు. వీరిలోనూ వనితలే ఎక్కువగా ఉన్నారు.
- 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో థర్డ్జెండర్ ఓటర్లు 503 ఉండగా అత్యధికంగా వరంగల్ తూర్పులో 339 మంది ఉన్నారు. అత్యల్పంగా స్టేషన్ఘన్పూర్, పరకాలలో ఇద్దరు చొప్పున ఉన్నారు.
- 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 3,709 పోలింగ్ కేంద్రాలున్నాయి. వరంగల్ పరిధిలో 1893 ఉండగా వాటికి ఏడు అనుబంధ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇక్కడ సంఖ్య 1900లకు చేరింది. మహబూబాబాద్ పరిధిలో 1783 ఉండగా వాటికి 26 అనుబంధ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వాటి సంఖ్య 1809 అయింది.
- రెండు పార్లమెంటు స్థానాల పరిధిలో అత్యధికంగా వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గంలో 2,83,446 మంది ఓటర్లు ఉన్నారు. అతి తక్కువగా భద్రాచలం శాసనసభ నియోజకవర్గంలో 1,52,683 మంది ఉన్నారు. మిగిలిన ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 2 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ ప్రచారంలో అపశ్రుతి.. కారు బోల్తాపడి పార్టీ నాయకురాలి దుర్మరణం
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారం చేసేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతల వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదం -
అవినీతిపరుల అడ్డా కాంగ్రెస్
[ 10-05-2024]
దోపిడీలో కాంగ్రెస్ నెంబర్వన్గా మారిందని.. అవినీతి, కుటుంబ పాలనలో కూరుకుపోయిన ఆ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో వాతలు పెట్టాల్సిన అవసరం ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ధ్వజమెత్తారు. -
ఐటీడీఏలు ఎదగాలి.. గిరిజనం మురవాలి
[ 10-05-2024]
ఐటీడీఏ.. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ. కొన్నేళ్లుగా గాడితప్పింది. వీటి ఫలాలు గిరి పుత్రులకు పూర్తి స్థాయిలో అందడం లేదు. ఇప్పుడు పూర్వవైభవం చూడాలని గిరిపుత్రులు ఆశిస్తున్నారు. -
విదేశాల్లో ఓటుకు పట్టం.. వేయకుంటే ఊరుకోదు చట్టం!
[ 10-05-2024]
దేశం ప్రగతి దిశగా సాగాలంటే సమర్థులనే పాలకులుగా ఎన్నుకోవాలి. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే సుపరిపాలన అందించే ప్రభుత్వం ఏర్పాటవుతుంది. -
పైపైన పూడికతీత..ఇలాగైతే ముంచుతుంది నాలా!
[ 10-05-2024]
నగరంలో నాలాల పూడికతీత పనులు పైపైన జరుగుతున్నాయి. పర్యవేక్షించేవారు లేకపోవడంతో అడుగు భాగంలో పేరుకుపోయిన మట్టి(సిల్ట్), ఇతర వ్యర్థాలు ముట్టుకోవడం లేదు. -
కాంగ్రెస్, భాజపా దొందూ దొందే..
[ 10-05-2024]
ఇన్నాళ్లు దేశాన్ని పాలించిన జాతీయ పార్టీలు పేదలకు చేసిందేమీ లేదని, ప్రజా వ్యతిరేకతలో కాంగ్రెస్, భాజపా దొందూ దొందేనని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆరోపించారు. -
ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రజలు అశీర్వదించి గెలిపిస్తే ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డా.కడియం కావ్య అన్నారు. -
భారాస హయాంలో ముస్లింలకు అత్యంత ప్రాధాన్యం
[ 10-05-2024]
పరకాల, గీసుకొండ, న్యూస్టుడే: రాష్ట్రంలో ముస్లింలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ భారాస అని మాజీ హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. -
మరో అయిదు బడుల్లో పీఎంశ్రీ శ్రీకారం
[ 10-05-2024]
విద్యార్థుల సంఖ్య, పాఠశాలల్లో మౌలిక వసతులను గమనంలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈయేడాది జిల్లాలో మరో అయిదు పాఠశాలలను పీఎంశ్రీ (ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్) పథకానికి ఎంపిక చేసింది. -
‘ఏ పార్టీలో ఉన్నా.. క్రమశిక్షణకు కట్టుబడి ఉంటా’
[ 10-05-2024]
నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయాలు, క్రమశిక్షణకు కట్టుబడి కార్యకర్తలను కాపాడుకుంటానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. -
దేశ సంపద అంబానీ, అదానీల చెంత..
[ 10-05-2024]
దేశ సంపదను కేంద్రంలోని భాజపా అంబానీ, అదానీలకు దోచిపెట్టి, పన్నులను ప్రజలపై మోపుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. -
మహిళలకు తోడూనీడ.. సఖి
[ 10-05-2024]
బాధిత బాలికలకు, మహిళలకు ఆశ్రయం కల్పిస్తూ అండగా ఉంటుంది ఈ సంస్థ. -
రాహుల్గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం
[ 10-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. -
‘దేవుళ్లపై ఒట్లు వేస్తే ఓట్లు రాలవు’
[ 10-05-2024]
ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళితే అక్కడ స్థానిక దేవుళ్ల మీద ఒట్టేసి ఓట్లు అభ్యర్థిస్తున్నారని, కానీ ఈసారి ఓట్లు రాలవని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ అన్నారు. -
కేయూ వీసీ పదవి ఎవరిని వరించునో..!
[ 10-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రస్తుత ఉప కులపతి, సామాజిక శాస్త్రం సీనియర్ ఆచార్యులు తాటికొండ రమేశ్ మూడేళ్ల పదవీకాలం ఈ నెల 21తో ముగియనుంది. -
శ్రీభద్రకాళి కల్యాణ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 10-05-2024]
ఓరుగల్లు నగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీభద్రకాళి దేవస్థానంలో భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరిగింది. -
సిరా చుక్క పెట్టే వేలు లేకపోతే..?
[ 10-05-2024]
ఈ నెల 13న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే చాలు ఓటు వేశావా? -
హవాలా కేసులో ఇద్దరి అరెస్టు
[ 10-05-2024]
వరంగల్ నగరంలో జరిగిన ఆర్థిక మోసం(హవాలా) కేసులో మట్టెవాడ ఠాణా పోలీసులు గురువారం ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం