విద్యాసంస్థల స్థాపనలో చెరగని ముద్ర ‘ఇటికాల’
ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు, విద్యా సంస్థలు ఉండాలని గుర్తించి అందుకు అనుగుణంగా కృషి చేసి వరంగల్ను విద్యాకేంద్రంగా మలిచారు ఇటికాల మధుసూదనరావు.
నెహ్రూతో ఇటికాల మధుసూదనరావు
ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు, విద్యా సంస్థలు ఉండాలని గుర్తించి అందుకు అనుగుణంగా కృషి చేసి వరంగల్ను విద్యాకేంద్రంగా మలిచారు ఇటికాల మధుసూదనరావు. వరంగల్ ఎన్ఐటీ(ఆర్ఈసీ), కాకతీయ మెడికల్ కళాశాల ఆయన కృషి వల్లే వచ్చాయి. ఆర్య సమాజ్ను వరంగల్లో విస్తృతం చేసి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు, సాయుధ ప్రతిఘటన ఉద్యమకారుడిగా పేరు సంపాదించుకున్నారు. అనేక సంస్థలు, కమిటీలలో చురుగ్గా పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామంలోని ఇటికాల బుచ్చయ్య, గోవిందమ్మ దంపతులకు జన్మించిన ఈయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నర్సింహారావు మధుసూదనరావు మెమోరియల్ పేరుతో విద్యా సంస్థను నడిపారు.
న్యూస్టుడే, కాజీపేట
సాయుధ ప్రతిఘటన ఉద్యమకారుడు
1918 ఏప్రిల్ 5న జన్మించిన ఇటికాల 1963లో అనసూయదేవితో వివాహం జరిగింది. ఆర్య సమాజ్లో వీరదళంలో కమాండర్గా పాల్గొంటూ, ఉర్దూకు బదులు హిందీని అధికార భాషగా ప్రోత్సహించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో నిర్భయంగా వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయ్యారు. 1947లో రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటన ఉద్యమంలో చురుకుగా పాల్గొని పలుసార్లు జైలు జీవితం గడిపారు. పాఠశాలల్లో గ్రంథాలయాలు, విద్యా వనరుల కేంద్రాలను నెలకొల్పి, విజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడానికి కృషి చేశారు.
ః మధుసూదన్రావు రాజకీయంగా కూడా ఎదిగారు. 1957, 1962లో మానుకోట (ఇప్పటి మహబూబాబాద్) నుంచి రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు.
తిరుపతి నుంచి వరంగల్కు ఆర్ఈసీ
భారత ప్రధాని నెహ్రూతో ఉన్న సంబంధాలతో వరంగల్ను విద్యాకేంద్రంగా అభివృద్ధి చేయగలిగారు. అప్పట్లో రీజినల్ ఇంజినీరింగ్ కళాశాలలను తిరుపతిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇటికాల నెహ్రూకు వరంగల్ వెనుకబాటు గురించి తెలియజేయడంతో అక్టోబరు 10, 1959న నెహ్రూతో దానికి శంకుస్థాపన జరిగింది. మొదట్లో బాలసముద్రంలో కొన్ని రేకుల షెడ్లలో ఆర్ఈసీ కొన్ని కోర్సులతో నడిచింది. క్రమంగా భవనాల నిర్మాణం జరగడం.. దేశంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని 2002లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)గా అవతరించింది. కాకతీయ మెడికల్ కళాశాల మొదట్లో ప్రైవేటు వారు నడిపించే వారు. దీనిని ప్రభుత్వ రంగంలోకి తీసుకు వచ్చారు. పోచంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో కూడా ఈయన పాత్ర చెప్పుకోదగింది.
వరంగల్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా(1948), జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక సభ్యుడిగా చేశారు.
వరంగల్ హిందీ మహా విద్యాలయం మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడిగా, వరంగల్ జిల్లా ఆదివాసి సేవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా(1950), జిల్లా వెనకబడిన తరగతుల సంఘం, హరిజన సంఘం వ్యవస్థాపకుడిగా, తెలంగాణ ఆదివాసీ సేవా సంఘం సలహా సభ్యుడిగా, లేబర్ సలహా సంఘం బోర్డు సభ్యుడిగా, వరంగల్ భారతీయ కళామందిర్ అధ్యక్షుడిగా, వరంగల్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడిగా చేశారు.
విగ్రహం ఏర్పాటుకు డిమాండ్
ఇటికాల మధుసూదనరావు విగ్రహం ఎన్ఐటీలో ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ ఉంది. కళాశాల ఉద్యోగులు, ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆయన వర్ధంతి, జయంతిని కళాశాల ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిర్వహిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ రోడ్ షో నేడు
[ 28-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం వరంగల్ నగరంలో బస్సు యాత్రలో పాల్గొనేందుకు సర్వం సిద్ధమైంది. -
తేలిన లెక్క.. అతివలే నిర్ణేతలు
[ 28-04-2024]
వరంగల్(ఎస్సీ), మహబూబాబాద్(ఎస్టీ) లోక్సభ స్థానాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల లెక్క తేలింది.. ఫిబ్రవరి 8న తుది జాబితా ప్రకటించినా.. అర్హులైన వారు ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. -
మీరెక్కడుంటే.. మేమక్కడుంటాం..!
[ 28-04-2024]
నామపత్రాల దాఖలు పర్వం పూర్తికావడంతో లోక్సభ ఎన్నికల జోరు పెరిగింది.. అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
పోలింగ్ శాతం పెంపునకు కృషి
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్శాతం పెంచడానికి మెప్మా సిబ్బంది కృషి చేయాలని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారిణి భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. -
బోర్డు తిప్పేసిన నకిలీ వైద్యుడు
[ 28-04-2024]
జిల్లా వైద్యఆరోగ్యశాఖ, తెలంగాణ వైద్యమండలి సభ్యులు హనుమకొండలో ఓ నకిలీ వైద్యుడిని గుర్తించారు. -
ప్రజాస్వామ్యం ఓటుతోనే సాధ్యం
[ 28-04-2024]
ప్రజాస్వామ్యమనేది ఓటు ద్వారానే సాధ్యమని, ఓటు హక్కును మన ప్రాథమిక బాధ్యతగా భావించి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. -
‘వెంట ఉన్నవాళ్లే ఓట్లేయలేదు’
[ 28-04-2024]
ఓటర్లకు తన పట్ల వ్యతిరేకత లేదని, వెంట తిరిగిన వాళ్లే ఓట్లేయలేదని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పేర్కొన్నారు. -
అమ్ముడుపోని తునికాకు యూనిట్లు
[ 28-04-2024]
ఈ ఏడాదిలో తునికాకు కూలీల ఉపాధికి పెద్ద మొత్తంలో గండి పడనుంది. జిల్లా వ్యాప్తంగా 16 తునికాకు యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
[ 28-04-2024]
జిల్లాలో విస్తృత తనిఖీలు చేపట్టి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం
[ 28-04-2024]
ఎన్నికల విధుల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వరంగల్ లోక్సభ నియోజకవర్గ సాధారణ పరిశీలకురాలు బండారి స్వాగత్ రనవీర్ చంద్ సూచించారు. -
సంక్షేమ పాలన చూసి కాంగ్రెస్కు ఓటేయండి
[ 28-04-2024]
కులం, మతం పేరిట కాదు, కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమ ప్రజాపాలన చూసి ఓట్లు వేయాలని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
పంచదార పంపిణీ చేయాల్సిందే!
[ 28-04-2024]
చౌక ధరల దుకాణాల్లో ఇక నుంచి పంచదార తప్పనిసరిగా పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ డీలర్లను ఆదేశించింది.