వెలుగల ప్రస్థానంలో చీకట్లు!
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. అలాంటిది ఉమ్మడి వరంగల్లో సింగరేణి తప్ప పెద్దగా పరిశ్రమలు లేకపోవడంతో ఇక్కడి యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు అంతంతమాత్రమే లభిస్తున్నాయి.
నిర్మాణ దశలోనే పరిశ్రమలు
ఈనాడు, వరంగల్
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. అలాంటిది ఉమ్మడి వరంగల్లో సింగరేణి తప్ప పెద్దగా పరిశ్రమలు లేకపోవడంతో ఇక్కడి యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు అంతంతమాత్రమే లభిస్తున్నాయి. ఇక్క పేరుకు అనేక యూనిట్లు కనిపిస్తున్నా అవి పూర్తి కావడంలో తీవ్ర జాప్యం వల్ల పారిశ్రామిక వెలుగులు సాకారం కావడం లేదు.
- భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 150 ఎకరాల చొప్పున ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు.’
- జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో తోళ్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఎప్పటి నుంచో డిమాండు ఉంది.
- వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థతోపాటు నగరం చుట్టు ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నందున అంకుర సంస్థలు ఏర్పాటుచేసుకునేందుకు ఐటీ నిపుణులకు తగిన సదుపాయాలు కల్పించాలి.
‘ఎస్పీవీ’ ఏర్పాటైతేనే మిత్రలాభం
వరంగల్ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల్లో నిర్మాణంలో ఉన్న కాకతీయ మెగా జౌళి పార్కులో అన్ని వస్త్ర పరిశ్రమలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా పదివేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుపై యువత ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పటికి మూడు భారీ పరిశ్రమలు మాత్రమే ఇందులో తమ యూనిట్లను నెలకొల్పుతున్నాయి. గణేశా ఎకోపెట్, కైటెక్స్తోపాటు దక్షిణ కొరియా వారు నిర్మిస్తున్న యంగ్వన్లు వచ్చాయి. కేంద్ర ప్రభుతం ‘పీఎం మిత్ర’ పథకం కింద రూ. 200 కోట్లు మంజూరు చేసింది. జౌళి పార్కును గ్రీన్ ఫీల్డ్ (కొత్తగా నిర్మించే పరిశ్రమ) కింద గుర్తించి రూ.500 కోట్లు కేటాయించాలనే డిమాండు ఉంది. మొదట మంజూరు చేసిన నిధులు రావాలంటే ప్రభుత్వం ఒక ఏజెన్సీ ద్వారా ప్రత్యేక ప్రయోజన వాహకం (స్పెషల్ పర్పస్ వెహికిల్ - ఎస్పీవీ) ఏర్పాటుచేసి కేంద్ర ప్రభుత్వానికి వివరాలు వెల్లడిస్తే నిధులను బదిలీ చేస్తుంది. ఈ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇది కూడా వేగంగా పూర్తి చేస్తే త్వరలో ఓరుగల్లులో వస్త్ర పరిశ్రమలు కళకళలాడుతాయి.
రెండేళ్లుగా వంగర ఆహారశుద్ధి కేంద్రం పనులు
హనుమకొండ జిల్లా వంగరలో గత ప్రభుత్వం 200 ఎకరాల భూసేకరణ చేపట్టి, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వేగంగా పనులు పూర్తి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. స్థానిక రైతులు తమ భూములను పరిశ్రమల ఏర్పాటుకు ఇచ్చారు. రెండేళ్లుగా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో స్థానిక రైతుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) పనులు చేపడుతోంది. రహదారుల నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయి. సేకరించిన భూమిలో 100 ఎకరాల వరకు గుట్టలు ఉండడంతో చదునుగా ఉన్న 124 ఎకరాల భూమిని ఇందుకు వినియోగిస్తున్నారు. రైస్మిల్లులు, మిర్చి ఇతర సుగంధ ద్రవ్యాల యూనిట్లు, నూనె మిల్లులు స్థాపించేందుకు అనువైన ప్రాంతం కావడంతో ఆయా రంగాల పరిశ్రమలకు కేటాయించేందుకు 60 భారీ యూనిట్లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 8 మంది పారిశ్రామిక వేత్తలకు భూములను కేటాయించారు.
ఇవీ సమస్యలు: విద్యుత్తు స్తంభాలు వేసి ఉపకేంద్రం నిర్మించాల్సి ఉంది. నీటి సరఫరా జరగాలి. ఇందులో కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసే ఎంఎస్ఎంఈ యూనిట్లు కూడా 40 వరకు నెలకొల్పేందుకు వసతులు కల్పిస్తున్నారు. ఈ పనుల్లో వేగం పెంచి జూన్కల్లా పూర్తి చేస్తే వంగర ఆహార శుద్ధి పరిశ్రమలకు నిలయంగా మారుతుంది.
ప్రధాన మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన పీవీ నరసింహారావు స్వస్థలం వంగర. దేశంలో ఉపాధి, ఉద్యోగాల కల్పనకు ఆయన ఎంతో కృషి చేశారు. ఇక్కడ ఆహార శుద్ధి పరిశ్రమను అందుబాటులోకి తెస్తే ఆయన సేవలకు తగిన గౌరవం ఇచ్చినట్లు అవుతుంది.
పనులు కొనసాగుతున్నాయి
-సంతోష్, జోనల్ మేనేజర్, టీఎస్ఐఐసీ, వరంగల్
వంగరలో ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు రహదారి నిర్మాణం పనులు నడుస్తున్నాయి. మెగా జౌళి పార్కులో ఎస్పీవీ ఏర్పాటుకు జౌళి శాఖ ఉన్నతాధికారులు కేంద్రం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎన్నికల తర్వాత ప్రారంభోత్సవాలకు అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రేటర్ చుట్టూ రాజకీయం..!
[ 27-04-2024]
ఓవైపు వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచార హోరు.. మరోవైపు శుక్రవారం రాత్రి ఖిలావరంగల్ కోటలో కాంగ్రెస్, భారాస కార్పొరేటర్లు రహస్య సమావేశం. -
ఆమోదం 73 మంది.. తిరస్కరణ 15 మంది..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల పరిశీలన పూర్తయింది. వరంగల్ (ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాలకు జాతీయ, ప్రాంతీయ, గుర్తింపు పొందిన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 88 మంది 145 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు
[ 27-04-2024]
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని బల్దియా పాలకులు చెబుతున్నారు. ఏడాదికోసారి కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు, ప్రమాదాల నుంచి రక్షణ కోసం ఇచ్చే రేడియం స్టిక్కర్ ఉన్న ఆప్రాన్లు ఇవ్వడం లేదు. -
నకిలీ వైద్య కేంద్రాల్లో వైద్యమండలి తనిఖీలు
[ 27-04-2024]
హనుమకొండ జిల్లాలోని నకిలీ వైద్య కేంద్రాల్లో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి రాష్ట్ర వైద్యమండలి సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ ఛైర్మన్ డాక్టర్ వి.నరేష్కుమార్ తెలిపారు. -
భానుడు భగభగ.. ప్రయాణికులు విలవిల
[ 27-04-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. దాదాపు 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చిన పలువురు ఎండ ధాటికి విలవిలలాడారు. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్చంద్ సంబంధిత అధికారులకు సూచించారు. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే అభివృద్ధి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనసును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగలాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తి గాంచిన భద్రాచలం రాములోరి ఆలయం. -
చాడా.. తొలి పోటీలోనే తిరుగులేని విజయం
[ 27-04-2024]
హనుమకొండకు చెందిన చాడా సురేష్రెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. బీఏ డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1990 దశకంలో ప్రముఖ గుత్తేదారుగా గుర్తింపు కలిగి ఉన్నారు. -
నాడు తండ్రులు.. నేడు వారసులు
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తండ్రుల రాజకీయ వారసత్వ తీర్థం పుచ్చుకొని ఎన్నికల క్షేత్రంలో పోరాడేందుకు యువ వారసులు సిద్ధమయ్యారు. -
ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలపై అధికారుల ఉదాసీనత
[ 27-04-2024]
జనగామ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు, గ్రామాల్లో క్లినిక్లు నిర్వహిస్తున్న వైద్యులు, ఆర్ఎంపీల ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో తనిఖీలు చేపట్టడానికి ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. -
కరవు కోరలు.. పశుగ్రాసానికి తంటాలు!
[ 27-04-2024]
వర్షాలు సరిగా లేక పంటలు వేసినా చాలా వరకు చేతికందలేదు.. దీంతో రైతన్నలు పశుగ్రాసానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మోరంచవాగుకు ఇరువైపులా పంటలు సాగు చేసుకున్న వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది -
కక్షిదారులకు ఈ-న్యాయ సేవలు
[ 27-04-2024]
వివిధ న్యాయస్థానాల్లో కక్షిదారులకు వారి కేసులకు సంబంధించిన సమాచారం, ధ్రువపత్రాలు, న్యాయసహాయం తదితర సేవలు మరింత సులభతరం కానున్నాయి. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
పోలు చిట్టీలొచ్చాయ్..!
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల్లో శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు పోల్ చిట్టీలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
అనుమతి లేకుండా ల్యాబ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు
[ 27-04-2024]
అనుమతి, అర్హతలు లేకుండా డయాగ్నస్టిక్ సెంటర్లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి కళావతిబాయి హెచ్చరించారు. -
వంతెనల నిర్మాణాల్లో తేలిపోతున్న నాణ్యత లోపాలు..
[ 27-04-2024]
దశాబ్దాల పాటు మన్నికగా ఉండాల్సిన వంతెనలు ఉన్నఫలంగా కూలిపోతున్నాయి. ప్రజల రవాణా కష్టాలను మెరుగు పర్చేందుకు నిర్మిస్తున్న వారధుల జీవితకాలం కొద్ది రోజుల్లోనే ముగుస్తోంది. -
రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం
[ 27-04-2024]
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ .. ఆ పార్టీ అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని’ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.