logo

మానుకోట ఎమ్మెల్యే వాహనం తనిఖీ

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్‌ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్‌ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌, కరీంనగర్‌ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు.

Published : 29 Mar 2024 06:22 IST

నెల్లికుదురు, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్‌ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్‌ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌, కరీంనగర్‌ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. ఏఎస్సై వెంకన్న, ఎంపీవో చంద్రమౌళి, అధికారులున్నారు.  


డోర్నకల్‌లో ఎంపీ కవిత వాహనం..

డోర్నకల్‌, న్యూస్‌టుడే: డోర్నకల్‌లోని చెక్‌పోస్టు వద్ద సిబ్బంది గురువారం ఎంపీ కవిత వాహనం తనిఖీ చేశారు. ఆమె ఖమ్మం నుంచి మహబూబాబాద్‌కు డోర్నకల్‌ మీదుగా వెళుతున్నారు. వెంట ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని