కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది.
జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
భారాస, భాజపా లక్ష్యంగా విమర్శలు
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ నామపత్రం దాఖలు చేసిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం స్థానిక ఎన్టీఆర్ మైదానంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. పదేళ్లు రాష్ట్రం, కేంద్రంలో అధికారంలో ఉన్న భారాస, భాజపాలు ప్రజలకు చేసిన అన్యాయాలను, అమలు చేయని హామీల గురించి వివరిస్తూ కేసీఆర్, మోదీలపై విమర్శల వర్షం కురిపించారు.
ఈనాడు, మహబూబాబాద్
ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఎడమవైపు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, కుడివైపు అభ్యర్థి పోరిక బలరాంనాయక్. వేదికపై ఆసీనులైనవారిలో ఎడమ నుంచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్యసలహాదారు వేం నరేందర్రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్చౌదరి, డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్చంద్రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, మాజీ ఎమ్మెల్యే జగన్నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరెం కనకయ్య, కాంగ్రెస్ నాయకులు నూకల నరేష్రెడ్డి, గోపాల్రెడ్డి, వెన్నం శ్రీకాంత్రెడ్డి తదితరులు
ముఖ్యమంత్రి పర్యటన సాగిందిలా
మధ్యాహ్నం 3:45కు హెలికాప్టర్ ద్వారా రాక
సాయంత్రం 5:16కు సభావేదికపైకి వచ్చారు
5:52 నుంచి 6:17 వరకు ప్రసంగించారు
6:24కు హెలికాప్టర్లో హైదరాబాద్కు బయల్దేరారు
25 నిమిషాల పాటు ప్రసంగం
సీఎం రేవంత్రెడ్డి సాయంత్రం 5.52 గంటలకు ప్రసంగం ప్రారంభించి 6.17కి ముగించారు. 25 నిమిషాల పాటు మాట్లాడారు. మానుకోట కాంగ్రెస్ కంచుకోట అని గుర్తుచేశారు. ఆగస్టులో రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేస్తామని, వడ్లకు రూ.500 బోనస్ సైతం ఇస్తామనడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డికి నాగలి బహూకరిస్తున్న నేతలు
బస్సులో విశ్రాంతి
షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4 గంటలకు సభ నిర్వహించాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మధ్యాహ్నం 3.45కే హెలికాప్టర్ ద్వారా మహబూబాబాద్కు చేరుకున్నారు. అప్పటికీ సభ ప్రాంగణానికి పార్టీ శ్రేణులు, అభిమానులు రాకపోవడంతో సీఎం బస్సులోనే గంటన్నర పాటు విశ్రాంతి తీసుకున్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులు వచ్చిన తర్వాత 5.16కి సభా వేదికపైకి చేరుకున్నారు.
రెండో సారి ఎంపీని చేద్దాం
బలరాం నాయక్ను పరిచయం చేస్తూ..
అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత తండ్రి రెడ్యానాయక్ను డోర్నకల్లో ఓడించి ఇంటికి పంపించాం.. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఆయన కుమార్తె కవితను కూడా ఇంటికి పంపిద్దామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.. 2009లో బలరాంనాయక్ను తొలిసారిగా ఎంపీగా గెలిపిస్తే... సోనియాగాంధీ ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు రెండోసారి ఎంపీగా గెలిపించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలుస్తుందని అందులో అత్యధిక మెజారిటీ ఖమ్మం, మహబూబాబాద్ సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
సభకు హాజరైన జనం
పేదల అభ్యున్నతే లక్ష్యంగా
డాక్టర్ రాంచంద్రునాయక్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే
రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది. కేంద్రంలోనూ కాంగ్రెస్ ఉండాలి. అప్పుడే బలహీనవర్గాల అభివృద్ధి సాధ్యం.
భాజపా చేసిందేమీ లేదు
యశస్వినిరెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు. రాముడి పేరుతో ఓట్లు రాబట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేవంత్ మహారాష్ట్ర.. కేసీఆర్ గుజరాత్!
[ 02-05-2024]
నేతలు ఎన్నికల ప్రచారంలో చేసే ఉపన్యాసాలను పరిశీలిస్తే అంశం ఒకటే అయినా వారు వెల్లడించే విషయాలు భిన్నంగా ఉంటాయి. ఏప్రిల్ 24న హనుమకొండ మడికొండలో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, గత ఆదివారం వరంగల్ రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ ఒకే అంశంపై చేసిన విమర్శలు విభిన్నంగా ఉన్నాయి. -
గులాబీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ రోడ్షో
[ 02-05-2024]
మానుకోటలో జై తెలంగాణ నినాదాలు మరోసారి మిన్నంటాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంతంలో అడుగుపెట్టగానే ఆనాడు పోరాటానికి స్ఫూర్తినిచ్చిన జై తెలంగాణ నినాదాలు దారి పొడవునా మార్మోగాయి. -
మన అభ్యర్థులంతా బంగారు కొండలే..!
[ 02-05-2024]
భారతీయులందరికీ బంగారం అంటే ఎంతో మక్కువ. అందుకే పండగలు, పెళ్లిళ్లు, ఏ ప్రత్యేక సందర్భంలోనైనా పసిడి కొనుగోలు చేసేందుకు అమితంగా ఇష్టపడతారు. తమ ధగధగల నగలను ఎదుటి వారికి చూపేందుకు ఇష్టపడతారు. ఇందుకు లోక్సభ బరిలో ఉన్న మన అభ్యర్థులు అతీతమేం కాదు. -
‘బాలరాముడి పేరుతో భాజపా రాజకీయం’
[ 02-05-2024]
అయోధ్యలో రామాలయం పేరుతో ప్రధాని మోదీ, భాజపా నేతలు రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. వరంగల్ జిల్లా ఓసిటీ(ఓరుగల్లు సిటీ)లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడారు. -
దేశం గర్వించేలా మోదీ పాలన
[ 02-05-2024]
కాంగ్రెస్ పార్టీ హామీలు ప్రజలకు కన్నీళ్లు మిగిల్చాయని భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పర్వతగిరి, ఏనుగల్లు గ్రామాల్లో కార్నర్ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. -
ప్రత్యేక కార్యాచరణ.. పటిష్ఠ పర్యవేక్షణ
[ 02-05-2024]
జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి, జిల్లా విద్యాశాఖ ప్రణాళికబద్ధంగా నిరంతరం పర్యవేక్షణ, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలాంటి పటిష్ఠ చర్యలతో ఈ విద్యాసంవత్సరం (2023-24)లో జిల్లా పదోతరగతి ఉత్తీర్ణతలో రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచిందని చెప్పవచ్చు. -
ఎండు గంజాయి పట్టివేత
[ 02-05-2024]
ఓ వ్యక్తి వద్ద ఎండు గంజాయి పట్టుకున్న ఘటన డోర్నకల్లో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు బుధవారం వెలువరించారు. -
‘మత ఘర్షణలు సృష్టించేందుకు భాజపా, భారాస ప్రయత్నం’
[ 02-05-2024]
కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు భాజపా, భారాస లోపాయికారి ఒప్పందం చేసుకొని మత ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఏఐసీసీ ఓబీసీ విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి, మూడు నియోజకవర్గాల లోక్సభ ఎన్నికల నిర్వహణ మానిటరీ కమిటీ కో-ఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి ఆరోపించారు. -
బాలలతో పని చేయించడం నేరం
[ 02-05-2024]
14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని సీనియర్ సివిల్ న్యాయమూర్తి సి.సురేష్ అన్నారు. మే డేను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో బుధవారం నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో న్యాయమూర్తి మాట్లాడారు. -
పంచాయతీలకు గూడు కరవు..!
[ 02-05-2024]
జిల్లా పరిధిలో మంజూరైన భవనాల్లో ములుగు, వెంకటాపూర్ మండలాల్లోనే ఏడు పనులు పూర్తి కాగా, 34 భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి. బిల్లులు సకాలంలో అందకపోవడంతో గుత్తేదారులు అర్థాంతరంగా వదిలేశారు. ఉన్నతాధికారులు చొరవ చూపితేనే పనులు పూర్తి కానున్నాయి. -
సైబర్ మోసాల నియంత్రణకు కృషి
[ 02-05-2024]
జిల్లాలో సైబర్ సెక్యూరిటీ కేసులను చేదించే దిశగా పోలీసు అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. సైబర్ క్రైం నియంత్రణలో భాగంగా బుధవారం ములుగులో నూతనంగా ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ కార్యాలయాన్ని (ములుగు జిల్లా కోఆర్డినేషన్ సెంటర్) ఆయన ప్రారంభించి మాట్లాడారు. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం హనుమకొండలోని చైతన్య డీమ్డ్ వర్సిటీలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఏపీవోలకు రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. -
కార్మిక పక్షపాతి కేసీఆర్
[ 02-05-2024]
మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ కార్మిక పక్షపాతి అని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. -
భానుడి భగభగలు..
[ 02-05-2024]
జిల్లాలో ఏప్రిల్ మాసం మొదటి నుంచే వేసవి ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక మే నెల ప్రారంభం కావడంతో బుధవారం నుంచే భానుడు మండుతున్నాడు. -
ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం
[ 02-05-2024]
ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడే వేడుకలను జనగామ జిల్లా కేంద్రంలో పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
సత్తాచాటిన గురుకుల విద్యార్థులు
[ 02-05-2024]
జిల్లాలోని కేజీబీవీలు, ఆదర్శ, గురుకుల విద్యాలయాల విద్యార్థులు పదో తరగతిలో ప్రతిభ చాటారు. జయశంకర్ జిల్లాలో మొత్తం 28 వరకు గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. -
పైసలిస్తేనే దస్త్రం కదిలేది!
[ 02-05-2024]
గ్రేటర్ వరంగల్ టౌన్ప్లానింగ్ విభాగం తీరు మారడం లేదు. భవన నిర్మాణ అనుమతుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. పైసలిస్తే సరి.. లేదంటే కొర్రీలు పెడుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. -
విజ్ఞానం.. వినోదం.. ఆధ్యాత్మికం
[ 02-05-2024]
పదోతరగతి పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి.. విద్యార్థులకు ఉపశమనం లభించింది. తిరిగి విద్యాసంస్థలు ప్రారంభం అయ్యే వరకు ఈ వేసవి సెలవులను విద్యార్థులను సద్వినియోగం చేసుకోవాలి. -
71,245 మంది అభ్యర్థుల డిపాజిట్ గల్లంతు
[ 02-05-2024]
ఎన్నికల్లో పోటీచేసిన పలువురు అభ్యర్థులు ఫలితాలు వెలువడిన తర్వాత డిపాజిట్లు కోల్పోయారనే మాటలు తరచూ వింటుంటాం. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్ణయించిన రుసుమును సంబంధిత ఆర్వో వద్ద దరావతు (డిపాజిట్) చేయాల్సి ఉంటుంది. -
రెండు నియోజకవర్గాలకు రహదారే సరిహద్దు
[ 02-05-2024]
ఈ చిత్రంలో ఉన్నది ఒకే గ్రామంగా కనిపిస్తున్నప్పటికీ ఇవి జంట గ్రామాలు. మధ్యలో సరిహద్దుగా ఉన్న సీసీ రోడ్డు.. రెండు పంచాయతీలు, రెండు జిల్లాలు, రెండు శాసనసభ నియోజకవర్గాలు, రెండు లోక్సభ నియోజకవర్గాలను వేరు చేస్తోంది. -
ఉద్యోగాల పేరుతో టోకరా కేసు.. మరో నిందితుడి అరెస్టు
[ 02-05-2024]
రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్-1 ఉద్యోగాలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో హనుమకొండ సుబేదారి పోలీసులు మరో నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా