రాత్రిపూటా నిప్పుల కుంపటే!
ములుగు జిల్లా భానుడి ప్రతాపానికి అట్టుడికిపోతోంది. రాత్రిపూట సాధారణంగా 25-30 డిగ్రీల మధ్య ఉండాల్సిన ఉష్ణోగ్రత 33.7-36.8 డిగ్రీలు నమోదవుతోంది
కనిష్ఠమే 33.7- 36.8 డిగ్రీలు
వెంకటాపురం, న్యూస్టుడే:ములుగు జిల్లా భానుడి ప్రతాపానికి అట్టుడికిపోతోంది. రాత్రిపూట సాధారణంగా 25-30 డిగ్రీల మధ్య ఉండాల్సిన ఉష్ణోగ్రత 33.7-36.8 డిగ్రీలు నమోదవుతోంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 45.3 డిగ్రీలు సెల్సియస్ నమోదవగా, వాతావరణశాఖ ఆదివారం జిల్లాలోని మూడు మండలాలను రెడ్ జోన్ కింద ప్రకటించింది భానుడు ధాటికి అత్యవసరమైనా బయటికి వెళ్లలేని పరిస్థితి. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. కుంటలు, చెరువులు, జలాశయాలు ఎండి పశుపక్ష్యాదులు దాహార్తితో తల్లడిల్లుతున్నాయి.
గిర్రుమంటున్న మీటర్లు
సూర్యుడు సుర్రుమని మండుతుండటంతో విద్యుత్తు మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. పల్లెలు, పట్టణాల్లోనూ విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగినట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు వినియోగాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకురాగా, ఉష్ణోగ్రతల తీవ్రతతో అత్యధిక శాతం వినియోగదారులు ఉచిత విద్యుత్తును అధిగమించి కరెంటును వినియోగించాల్సి వస్తోంది. ఏసీలు, కూలర్లు, ఇతర శీతల సదుపాయాలపై జనం దృష్టి సారించి ఉపశమనం పొందుతున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
బయటికి వెళితే తప్పనిసరిగా గొడుగు, టోపీ, చేతిరుమాలును ధరించాలి. కాటన్ వస్త్రాలకు ప్రాధాన్యమివ్వాలి. అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి వస్తే తాగునీరు వెంటతీసుకెళ్లాలి. తేలికపాటి ఆహారం తీసుకుంటే మంచిది. తరచూ నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు తాగాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. వడదెబ్బకు గురైతే ఓఆర్ఎస్ లేదా లీటరు నీటిలో చిటికెడు ఉప్పు, కొంత పంచదార కలిపి తాగించాలి. తక్షణమే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలి.
రెడ్ జోన్ నమోదు
జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా ప్రచంఢ భానుడు భగభగ మంటున్నాడు. ఏప్రిల్లోనే ఈ పరిస్థితి ఉంటే మే నెల ఎలా గడుసుందోననే భయాందోళనలతో ప్రజానీకం ఆందోళన చెందుతున్నారు. ఆదివారం వాతావరణశాఖ జారీ చేసిన ఉష్ణోగ్రతల్లో ములుగు జిల్లాలోని మూడు మండలాలు రెడ్ జోన్లోకి చేరడం గుబులు పుట్టిస్తోంది. వెంకటాపురం, వాజేడు, మంగపేట మండలాల్లో 45.1 నుంచి 45.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ఆరు మండలాల్లోనూ 41.1 నుంచి 44.9 డిగ్రీలకు చేరింది. దీంతో అప్రమత్తత తప్పనిసరని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హుషారుగా.. చుట్టొద్దామా...!
[ 17-05-2024]
ఉమ్మడి వరంగల్.. సాంస్కృతిక రాజధాని. ఇక్కడ ఎన్నో పర్యాటక ఆకర్షణలు యాత్రికులను ఆకట్టుకుంటాయి. అందుకే ఈసారి వేసవిలో ఎండలు మండుతున్నా పర్యాటకులు ఓరుగల్లుకు వరుస కడుతున్నారు. -
ఎన్నికల పుణ్యం.. బడి బాగుకు మార్గం
[ 17-05-2024]
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల వల్ల ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులొచ్చాయి. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటులో భాగంగా వాటిలో మౌలిక వసతులు కల్పించారు.. తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపుల నిర్మాణాలు, విద్యుత్తు కల్పన పనులు చేపట్టారు. -
ఓరుగల్లు.. జలమయం!
[ 17-05-2024]
భారీ వర్షంతో వరంగల్ నగరం తడిసి ముద్దయింది. గురువారం సాయంత్రం నుంచి అనేక ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో రహదారులపై వరద పోటెత్తింది. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సన్నాహాలు
[ 17-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు జనగామ జిల్లా ఎన్నికల అధికారులు సన్నద్ధమవుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేయగా గెలుపొందారు. -
యాదాద్రీశుడి సేవలో మాజీ మంత్రి హరీశ్రావు
[ 17-05-2024]
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట భారాస ఎమ్మెల్యే హరీశ్రావు గురువారం ఉదయం సందర్శించారు. -
వార్షిక లాభాల ప్రకటన ఎప్పుడో..?
[ 17-05-2024]
సింగరేణి సంస్థ గడిచిన ఏడాది సాధించిన లాభాల ప్రకటనపై ఆసక్తి నెలకొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,222 కోట్ల లాభాలను సాధించిన సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగా బొగ్గు ఉత్పత్తి చేసింది. -
ములుగు, భూపాలపల్లి జిల్లాలకు.. ‘ఎల్లో అలర్ట్’
[ 17-05-2024]
ఇటీవల కురిసిన వర్షాలకే రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల విరామం ఇచ్చిన వాన మళ్లీ గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో విస్తారంగా కురిసింది. -
‘రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం’
[ 17-05-2024]
ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం భారాస ఆధ్వర్యంలో కేసముద్రం మార్కెట్ కూడలిలో భారాస నేతలు రాస్తారోకో నిర్వహించారు. -
ముంపు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాల ఏర్పాటు
[ 17-05-2024]
గోదావరి వరదతో ముంపునకు గురయ్యే ప్రదేశాల్లో విద్యుత్తు స్తంభాల ఏర్పాటు పనులు గురువారం ప్రారంభమయ్యాయి. ‘ప్రమాదం పొంచి ఉంది.. -
రైతులను మోసం చేస్తే సహించం
[ 17-05-2024]
రైతులను మోసం చేస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో విత్తనాలు, ఎరువులు, -
విధుల్లో నిర్లక్ష్యం సరికాదు..
[ 17-05-2024]
ఈ నెల 20 నాటికి అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మతులన్నింటిని పూర్తి చేయాలని డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య పేర్కొన్నారు. -
రక్తపోటు గుండెకు చేటు..!
[ 17-05-2024]
ఏ చిన్న సమస్యతో వైద్యుడి దగ్గరకెళ్లినా.. అడిగే మొదటి ప్రశ్న మీకు బీపీ (రక్తపోటు) ఉందా? కొంచెం కోపంగా మాట్లాడినా అతనికి బీపీ ఉంది అంటారు.. ఇలా అన్ని అనర్థాలకు రక్తపోటు కారణమవుతుంది. -
9,99,501 మంది ఓటుకు దూరం..
[ 17-05-2024]
గత సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్, మహబూబాబాద్ స్థానాలకు కలిపి 9,99,501 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. అంటే 29.78 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకోలేదు. -
కమీషన్ల కక్కుర్తి..!
[ 17-05-2024]
గ్రేటర్ వరంగల్ అక్రమాలకు అడ్డాగా మారింది. కమీషన్లు, పర్సంటేజీల కోసం ఉన్నత పదవిలో ఉన్నవారు సైతం ఎంతకైనా తెగిస్తున్నారు. -
పోలీసుల అదుపులో నిందితులు?
[ 17-05-2024]
ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రం సమీప అడవిలో మంగళవారం హత్యకు గురైన అంగన్వాడీ టీచర్ సుజాత కేసులో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొన్నట్లు తెలిసింది.
తాజా వార్తలు (Latest News)
-
విమానయానం.. మూడు నెలల్లో 9.7 కోట్ల మంది!
-
ముగ్గురు బందీల మృతదేహాలు లభ్యం.. మృతుల్లో ఆ యువతి కూడా!
-
‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
-
నా కుమారున్ని మీకు అప్పగిస్తున్నాను: సోనియాగాంధీ
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య