ఓటేశారు.. స్ఫూర్తి రగిలించారు..!
అభివృద్ధిలో మన కన్నా దిగువన ఉన్న దేశాల్లో ఓటు హక్కు వినియోగం ఎక్కువ. మన దగ్గర ఓటు హక్కుపై చైతన్య పరిచేందుకు విభిన్న రూపాల్లో కార్యాచరణ చేపడుతున్నా నిర్లిప్తత వీడట్లేదు. సుపరిపాలన కావాలంటే రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి.
డోర్నకల్, మానుకోటలో మొదలైన హోం ఓటింగ్
డోర్నకల్, న్యూస్టుడే: అభివృద్ధిలో మన కన్నా దిగువన ఉన్న దేశాల్లో ఓటు హక్కు వినియోగం ఎక్కువ. మన దగ్గర ఓటు హక్కుపై చైతన్య పరిచేందుకు విభిన్న రూపాల్లో కార్యాచరణ చేపడుతున్నా నిర్లిప్తత వీడట్లేదు. సుపరిపాలన కావాలంటే రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. హోం ఓటింగ్కు 85 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగుల ఆదరణ లభించింది. ఈ ప్రక్రియకి మహబూబాబాద్ లోక్సభ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు నియోజకవర్గాల్లో ఈ నెల 3న శ్రీకారం చుట్టారు. డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో హోం ఓటింగ్ ఆదివారం మొదలైంది. కుటుంబ సభ్యుల సహకారంతో వృద్ధులు, దివ్యాంగులు ఉత్సాహంగా ఓటేశారు. వీరిని కదిలిస్తే... యువతరం నిర్లిప్తత వీడితేనే పోలింగ్ శాతం పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. 13న ఓటు వేస్తే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఓటు.. మీ బాధ్యత అని గుర్తు చేస్తున్న వృద్ధులు, దివ్యాంగుల మనోగతంతో ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం
దరఖాస్తుదారుల ఇంటికి అధికారులు
డోర్నకల్లో హోం ఓటింగ్కు వచ్చిన సిబ్బంది
పీవో, ఏపీవో, మైక్రో అబ్జర్వర్, పోలీసు, రూట్ అధికారి, బీఎల్వోలతో కూడిన అధికారుల బృందం గడప గడపకు వచ్చి హోం ఓటింగ్ చేయించారు. డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో 85 ఏళ్లుపై బడిన వారు 374, దివ్యాంగులు 383 మంది ఉన్నారు. డోర్నకల్లో 26 రూట్లు, మహబూబాబాద్లో 23 రూట్లలో అధికారులు పర్యటించి నిబంధనల మేరకు ఓటింగ్ జరిపారు. ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా పకడ్బందీగా ఈ ప్రక్రియ పూర్తి చేశారు. హోం ఓటింగ్కు ఆధార్ కార్డు, పోల్ చీటీలను ప్రామాణికంగా తీసుకున్నారు. రహస్యంగా ఓటు వేయించి డబ్బాలో పోస్టు చేయించారు. దీనిని కెమెరాలో బంధించారు.
బామ్మ ఓటు.. బంగారు బాట
92 ఏళ్లలో అదే ఉత్సాహం
డోర్నకల్లోని కుందోజు వారి వీధికి చెందిన ఈ బామ్మ పేరు కమలమ్మ. వయస్సు 92 ఏళ్లు. కంటి చూపు మందగించడంతో తన మనమడి సాయంతో ఇంటి వద్ద ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత శాసనసభ ఎన్నికల్లోనూ ఈ బామ్మ ఇంటి నుంచే ఓటు వేశారు. ఈ బామ్మ ఓటు... నేటి తరానికి బంగారు బాట వంటిది. మనం విధిగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వినియోగించుకుందామా... మరి.
కర్తవ్యంగా భావించి ముందుకు కదలండి
వీరబ్రహ్మచారి, డోర్నకల్,
పైలేరియాకు తోడు పక్షవాతం బారిన పడ్డా. గతంలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి క్రమం తప్పకుండా ప్రతి ఎన్నికలోనూ ఓటు వేశా. ఇప్పుడు ఓటు ఇంటికి వచ్చింది. ఇంటికి ఓటు రాకున్నా... పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకుందామని మా అబ్బాయితో చెప్పా. ఇంటి దగ్గర ఓటు వేసిన నేను 13న కుటుంబ సభ్యులను ఓటు వేసి రమ్మని పోలింగ్ కేంద్రానికి పంపిస్తా. ఓటు మన జన్మహక్కు... విస్మరిస్తే ప్రశ్నించే హక్కు కోల్పోతాం.
మన చేతిలోనే బ్రహ్మాస్త్రం
- రేణిగుంట్ల బుచ్చయ్య, డోర్నకల్
నా చేతిలో సత్తువ, చలనం లేదు. అయినప్పటికీ ఇంటికి వచ్చిన ఓటును ఉపయోగించుకున్నా. ధనికుడికైనా, పేదోడికైనా ఓటు హక్కు ఒక్కటే సమానం. ఓటు విలువను గుర్తించడానికి ఇదొక్క ఉదహారణ. ఒక విధంగా చెప్పాలంటే... ఇది మన చేతిలోని బ్రహ్మాస్త్రం. బాధ్యతగా భావించి తప్పక ఓటు వేయండి. ఓటును విస్మరిస్తే అభివృద్ధికే కాదు వ్యక్తిగతంగా మనకూ నష్టమే సుమా. అదేదో ఇంటికి వచ్చే సరికి నా పని సులువైంది. వృద్ధులు, దివ్యాంగులుగా మేం ఓట్లు వేశాం. రేపటి మీ బాధ్యతను మరవకండి.
రేపటి మీ భవితకు ఊపిరి
- షేక్ అమీనాబీ, 95 ఏళ్లు, డోర్నకల్
నా వయస్సు 95 ఏళ్లు. 20 ఏళ్ల ప్రాయంలోనే మొదటి సారి ఓటు వేశా. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఓటు వేశా. వయసు పైబడిన కూడా గత ఎన్నికల్లో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నా. ఈ సారి ఓటు ఇంటి దగ్గరికి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన ఏకు చిరంజీవి
[ 18-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని అంబేద్కర్ రాజిపేట కాలనీకి చెందిన ఏకు చిరంజీవి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. -
వణికిన నగరం!
[ 18-05-2024]
నగరంలో గురువారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షంతో పౌరులు వణికిపోయారు. -
ఉప పోరు.. ప్రచార హోరు
[ 18-05-2024]
మొన్నటి వరకు లోక్సభ ఎన్నికలతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఫలితాలు ఇంకా వెలువడకముందే ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందడి మొదలైంది. -
పనులు చేశారా.. పంచుకున్నారా..!
[ 18-05-2024]
బదిలీపై వెళ్లిన ఉన్నతాధికారి పాత తేదీలతో 200 మెజర్మెంటు బుక్కు(ఎంబీ)లపై సంతకాలు చేయించడానికి గల కారణాలేమిటి? అభివృద్ధి పనులు చేశారా? చేయకుండానే ఎంబీ రికార్డు చేశారా? -
జోరు వానతో ఆగమాగం
[ 18-05-2024]
ఆకస్మిక అకాల వర్షాలతో జనగామ పట్టణం జలమయమవుతోంది. నిండు వేసవిలో కురిసిన పెద్ద వానకే పరిస్థితి ఇలా ఉంటే, రానున్న వర్షాకాలంలో ఎలా ఉంటుందోనని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీకి పెరిగిన ఆదాయం!
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జనగామ ఆర్టీసీ డిపోకు ఆదాయం పెరిగింది. -
పాఠశాలల అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు
[ 18-05-2024]
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా గుర్తించిన పాఠశాలల్లోని అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యం తగదని సంబంధిత గుత్తేదారులు, అధికారులకు కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. -
స్ట్రాంగ్ రూం వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన
[ 18-05-2024]
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతా ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం నగర కమిషనర్ అంబర్ కిషోర్ఝా ఆకస్మికంగా తనిఖీచేశారు. -
దూసుకొస్తున్న లారీ.. ప్రాణాలు హరీ!
[ 18-05-2024]
గోదావరిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. మహదేవపూర్, కాళేశ్వరం ప్రాంతాల నుంచి నిత్యం వందలాది ఇసుక లారీలు వివిధ ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. -
అన్నదాత ఆగమాగం
[ 18-05-2024]
ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని మండే ఎండలను తట్టుకొని యాసంగి సాగు చేసిన అన్నదాతల ఆశలు నేలవాలిపోయాయి. -
అప్పుడే పల్లెలపై పడ్డారు..!
[ 18-05-2024]
వర్షకాలం సీజన్ ప్రారంభమే కాలేదు.. ఉమ్మడి జిల్లాలో నకిలీ, నాసిరకం విత్తనాల విక్రయాలకు అక్రమార్కులు తెర లేపారు. -
కొత్త ఆసుపత్రిలోకి ఉన్నవి మార్చొచ్చా!
[ 18-05-2024]
వరంగల్ కేంద్ర కారాగార స్థలంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోకి ప్రస్తుతం ఉన్న ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్, టీబీ, ప్రాంతీయ నేత్రవైద్యశాల ఆసుపత్రులను మార్చడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తో అధికారులతో సమీక్షించారు. -
గెలిపిస్తే నిరుద్యోగుల గళమవుతా..
[ 18-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భారాస తరఫున పోటీచేస్తున్న తనను గెలిపిస్తే రాష్ట్రంలో నిరుద్యోగల పక్షాన గళమవుతానని అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
[ 18-05-2024]
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు, లారీలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. -
హత్య కేసు ఛేదించిన పోలీసులు
[ 18-05-2024]
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరిగిన ఓ వివాహిత హత్య కేసును శుక్రవారం పోలీసులు ఛేదించారు.
తాజా వార్తలు (Latest News)
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్