స్వాతంత్య్రం తెచ్చింది.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్
దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో గెలిపించాలని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
ఖిలావరంగల్లో మాట్లాడుతున్న మంత్రి సురేఖ చిత్రంలో ఎంపీ అభ్యర్థి కావ్య
ఖిలావరంగల్, న్యూస్టుడే: దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో గెలిపించాలని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి ఖిలావరంగల్ పడమరకోట చమన్ కూడలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నిరుపేదలు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. రాష్ట్ట్ర్రంలో ఆరు సంక్షేమ పథకాల అమలు మహిళల పాలిట వరంగా మారాయన్నారు. భారాస, భాజపాలకు ఓటు వేస్తే రజాకార్ల రాజ్యం వస్తుందని విమర్శించారు. గత పదేళ్లలో ఆ రెండు పార్టీలు దోచుకున్నది ఈ ఎన్నికల్లో పంచుతున్నారని.. డబ్బులిస్తే తీసుకొని చేతి గుర్తుకు ఓటు వేయాలని మంత్రి కోరారు. ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఏనుమాముల గుమాస్తాల సంఘం అధ్యక్షుడు ఇనుముల మల్లేశం, అండర్ రైల్వేగేట్ ఐకాస కన్వీనర్ నాగవెళ్లి సాంబయ్యతో పాటు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బైరబోయిన ఉమ దామోదర్, శ్రీనివాస్, శ్యాం, ప్రకాశ్ పాల్గొన్నారు.
కొత్తవాడ: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వస్తుందని మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. కొత్తవాడలోని ఓ వేడుకల మందిరంలో ప్రాథమిక చేనేత సహకార సంఘాలు, మ్యాక్స్ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం పద్మశాలి ఆశీర్వాద సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యతో కలిసి మంత్రి హాజరై మాట్లాడారు. కులాంతర, ప్రేమ వివాహాలతో రెండు విధాలుగా ఓట్లను అభ్యర్థించవచ్చని ఆమె చమత్కరించారు. కాంగ్రెస్కు మద్దతిస్తున్నట్లు పద్మశాలీలు తీర్మానం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వణికిన నగరం!
[ 18-05-2024]
నగరంలో గురువారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షంతో పౌరులు వణికిపోయారు. -
ఉప పోరు.. ప్రచార హోరు
[ 18-05-2024]
మొన్నటి వరకు లోక్సభ ఎన్నికలతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఫలితాలు ఇంకా వెలువడకముందే ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందడి మొదలైంది. -
పనులు చేశారా.. పంచుకున్నారా..!
[ 18-05-2024]
బదిలీపై వెళ్లిన ఉన్నతాధికారి పాత తేదీలతో 200 మెజర్మెంటు బుక్కు(ఎంబీ)లపై సంతకాలు చేయించడానికి గల కారణాలేమిటి? అభివృద్ధి పనులు చేశారా? చేయకుండానే ఎంబీ రికార్డు చేశారా? -
జోరు వానతో ఆగమాగం
[ 18-05-2024]
ఆకస్మిక అకాల వర్షాలతో జనగామ పట్టణం జలమయమవుతోంది. నిండు వేసవిలో కురిసిన పెద్ద వానకే పరిస్థితి ఇలా ఉంటే, రానున్న వర్షాకాలంలో ఎలా ఉంటుందోనని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీకి పెరిగిన ఆదాయం!
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జనగామ ఆర్టీసీ డిపోకు ఆదాయం పెరిగింది. -
పాఠశాలల అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు
[ 18-05-2024]
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా గుర్తించిన పాఠశాలల్లోని అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యం తగదని సంబంధిత గుత్తేదారులు, అధికారులకు కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. -
స్ట్రాంగ్ రూం వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన
[ 18-05-2024]
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతా ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం నగర కమిషనర్ అంబర్ కిషోర్ఝా ఆకస్మికంగా తనిఖీచేశారు. -
దూసుకొస్తున్న లారీ.. ప్రాణాలు హరీ!
[ 18-05-2024]
గోదావరిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. మహదేవపూర్, కాళేశ్వరం ప్రాంతాల నుంచి నిత్యం వందలాది ఇసుక లారీలు వివిధ ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. -
అన్నదాత ఆగమాగం
[ 18-05-2024]
ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని మండే ఎండలను తట్టుకొని యాసంగి సాగు చేసిన అన్నదాతల ఆశలు నేలవాలిపోయాయి. -
అప్పుడే పల్లెలపై పడ్డారు..!
[ 18-05-2024]
వర్షకాలం సీజన్ ప్రారంభమే కాలేదు.. ఉమ్మడి జిల్లాలో నకిలీ, నాసిరకం విత్తనాల విక్రయాలకు అక్రమార్కులు తెర లేపారు. -
కొత్త ఆసుపత్రిలోకి ఉన్నవి మార్చొచ్చా!
[ 18-05-2024]
వరంగల్ కేంద్ర కారాగార స్థలంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోకి ప్రస్తుతం ఉన్న ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్, టీబీ, ప్రాంతీయ నేత్రవైద్యశాల ఆసుపత్రులను మార్చడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తో అధికారులతో సమీక్షించారు. -
గెలిపిస్తే నిరుద్యోగుల గళమవుతా..
[ 18-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భారాస తరఫున పోటీచేస్తున్న తనను గెలిపిస్తే రాష్ట్రంలో నిరుద్యోగల పక్షాన గళమవుతానని అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
[ 18-05-2024]
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు, లారీలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. -
హత్య కేసు ఛేదించిన పోలీసులు
[ 18-05-2024]
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరిగిన ఓ వివాహిత హత్య కేసును శుక్రవారం పోలీసులు ఛేదించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!