logo

భారాసపై అవినీతి మరకలతోనే పార్టీ వీడాను..

వరంగల్‌ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, నా కుమార్తె కడియం కావ్యను మీ బిడ్డగా నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపించాలని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు.

Published : 09 May 2024 02:05 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కడియం

లింగాలఘనపురం, న్యూస్‌టుడే: వరంగల్‌ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, నా కుమార్తె కడియం కావ్యను మీ బిడ్డగా నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపించాలని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సింగపురం ఇందిరతో కలసి కళ్లెం, లింగాలఘనపురం, నెల్లుట్లలో బుధవారం నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరంలో అవినీతి, కల్వకుంట్ల కుటుంబం హైదరాబాద్‌ చుట్టూ భూముల్ని ఆక్రమించుకోవడం, కవిత లిక్కర్‌ కుంభకోణం వంటి సంఘటనలతో భారాసలో ఉండలేకపోయానన్నారు. కావ్య గెలిస్తే మూణ్నెళ్లలో ఇందిరకు గొప్ప పదవి, నియోజకవర్గ అభివృద్ధికి రూ.కోట్ల నిధులు వస్తాయన్నారు. ప్రధాని మోదీకి క్రిస్టియన్లు, దళితులు, ముస్లింలు, మహిళలంటే గిట్టరని, అదానీ, అంబానీలే నచ్చుతారని ఎద్దేవా చేశారు. ఇందిర మాట్లాడుతూ... స్వాతంత్య్రం తెచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టేనన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు నర్సింహులు, జడ్పీటీసీ సభ్యుడు వంశీధర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు భిక్షపతి, క్రిష్ణవేణి, మాధవి, రజిత, పీఏసీఎస్‌ ఛైర్మన్‌లు ఉపేందర్‌, శ్రీశైలం, ఉపాధ్యక్షుడు విజయ్‌భాస్కర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని