ప్రత్యర్థితో కలిసి ప్రియురాలి హత్య
భూ వివాదంలో సాయం చేస్తానని నమ్మబలికి.. వివాహితతో సహజీవనం చేసిన ఓ వ్యక్తి డబ్బు కోసం ప్రత్యర్థితో చేతులు కలిపి ఆమె ప్రాణాలు తీయడంతో పాటు మృతదేహాన్ని దహనం చేసిన ఉదంతమిది.
నిందితులను చూపుతున్న పోలీసులు
చింతలపూడి, న్యూస్టుడే: భూ వివాదంలో సాయం చేస్తానని నమ్మబలికి.. వివాహితతో సహజీవనం చేసిన ఓ వ్యక్తి డబ్బు కోసం ప్రత్యర్థితో చేతులు కలిపి ఆమె ప్రాణాలు తీయడంతో పాటు మృతదేహాన్ని దహనం చేసిన ఉదంతమిది. ఈ కేసుకు సంబంధించి ఏలూరు ఎస్పీ రాహుల్దేవ్ శర్మ చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. చింతలపూడి నగర పంచాయతీలోని ఎస్బీఐ నగర్కు చెందిన మహిళ(37) భర్త 2015లో చనిపోయారు. అప్పటి నుంచి తన ఇద్దరు ఆడపిల్లలతో కలిసి ఆమె స్థానిక అత్త వారింట్లో ఉంటోంది. తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో ఉన్న సుమారు అరెకరం భూమి విషయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరాకు చెందిన నంబూరి శ్రీనివాసరావుతో మహిళకు కొంత కాలం నుంచి వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంపై ఆమె 2016లో కోర్ట్టులో దావా వేసింది. ఈ క్రమంలో మూడేళ్ల కిందట చింతలపూడి మండలం ఎండపల్లికి చెందిన బర్రె రాంబాబుతో పరిచయం ఏర్పడింది. భూమి విషయంలో సహాయ, సహకారాలు అందిస్తానని చెప్పడంతో ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే భూవివాదం ఎంతకీ తేలకపోవడంతో నంబూరి శ్రీనివాసరావు, బర్రె రాంబాబు ఒక్కటయ్యారు. ఆ మహిళను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ముందుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా గత నెల 19న మహిళను రాంబాబు బాడుగ కారులో ఎక్కించుకొని కాకినాడ సర్పవరం జంక్షన్లోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అదే రోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో రాడ్తో తలపై బలంగా కొట్టడంతో ఆమె చనిపోయింది. గత నెల 21వ తేదీ తెల్లవారుజామున మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకొని ముందుగా అనుకున్న ప్రకారం తెలంగాణ రాష్ట్రం దమ్మపేట మండలం ఆర్లపెంట గ్రామ శివారులోని డంపింగ్ యార్డు వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఆ సమయంలో ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. అదే రోజు మహిళ సోదరుడిని తీసుకొని చింతలపూడి పోలీస్స్టేషన్కు వెళ్లి కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీసులు అనుమానిస్తున్నారనే భయంతో హైదరాబాద్ పారిపోయాడు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ సత్యనారాయణ, సీఐ మల్లేశ్వరరావు, ఎస్సై హరికృష్ణ కేసు దర్యాప్తులో వేగం పెంచారు. ఎస్సై తన సిబ్బందితో కలిసి హైదరాబాద్ వెళ్లి గాలించి నిందితుడిని అరెస్టు చేసి తీసుకొచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన బర్రె రాంబాబు, నంబూరి శ్రీనివాసరావులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్పీ వెల్లడించారు. కేసును ఛేదించిన చింతలపూడి పోలీసులను ఎస్పీ అభినందించారు.
బంధువులు, కుటుంబ సభ్యుల ఆందోళన
గత నెల 19న తన కుమార్తె అదృశ్యమైనా పోలీసులు ఇప్పటి వరకు మృతదేహాన్ని అప్పగించలేదని మృతురాలి తల్లితో పాటు బంధువులు, కుటుంబ సభ్యులు చింతలపూడిలో బుధవారం ఆందోళన చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి స్థానిక ఫైర్స్టేషన్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి ప్రదర్శనగా గురుభట్లగూడెం వద్దకు చేరుకొని సుమారు రెండు గంటల పాటు రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
* రెండు రోజుల్లో తిరిగివస్తాను. నువ్వు, చెల్లి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్లిన తల్లి ఇక రాదన్న నిజం నమ్మలేక ఇద్దరు కుమార్తెలు కన్నీటి పర్యంతమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ రాసిన మరణ శాసనం
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక నాటు సారా తయారీ, విక్రయాలు, వినియోగం అన్నీ పెరిగాయి. నూతన మద్యం విధానం పేరుతో రూ.60 ఉన్న క్వార్టర్ సీసాను రూ.120-150కి అమాంతం పెంచేశారు. -
మాటలు ఎక్కడో.. పనులు ఇక్కడే
[ 27-04-2024]
‘ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తాం.. తొమ్మిది రకాల అభివృద్ధి పనులు చేపట్టి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం’ అని సీఎం జగన్, వైకాపా నాయకుడు ఊకదంపుడు ఉపాన్యాసాలిచ్చారు. -
పార్లమెంట్ 4, అసెంబ్లీకి 26 తిరస్కరణ
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఏలూరు పార్లమెంట్కు 17 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయగా వివిధ కారణాలతో 4 తిరస్కరణకు గురయ్యాయి. -
‘భూగర్భం’లో.. కలిసిపోయిన హామీలు..!
[ 27-04-2024]
నరసాపురంలో ప్రస్తుత జనాభా సుమారు 70వేలకు చేరిందని అంచనా. 31 వార్డుల్లో 109 కి.మీ మేర డ్రెయిన్ వ్యవస్థ ఉంది. మేజర్ డ్రెయిన్ల అవుట్లెట్ పొన్నపల్లి వద్ద గోదావరిలోకి ఉంది. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సాధారణ పరిశీలకులు దీప, ఎల్ నిర్మలారాజ్, పోలీసు పరిశీలకులు శైలేష్కుమార్సిన్హా పేర్కొన్నారు. -
జగన్ పాలనలో అంతా దోపిడీ
[ 27-04-2024]
‘అయిదేళ్ల వైకాపా పాలనలో చింతలపూడి ఎత్తిపోతల కోసం సీఎం జగన్మోహన్రెడ్డి తట్టెడు మట్టి కూడా వేయలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. -
నామినేషన్ రోజునే గెలుపు ఖరారు: నిమ్మల
[ 27-04-2024]
తను నామినేషన్ వేసిన ఈ నెల 19న నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చినప్పుడే పాలకొల్లులో తన గెలుపు ఖరారయ్యిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు. -
నాడు జీవనాడి సవ్వడి.. నేడు జీవనం చతికిలపడి!
[ 27-04-2024]
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను 2014-19లో తెదేపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనులు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అటు అధికారులు, ఇటు గుత్తేదారులను పరుగులు పెట్టించేవారు. -
రెండు గంటల ఛార్జింగ్.. 25కి.మీ. ప్రయాణం
[ 27-04-2024]
తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) విద్యార్థులు ఎలక్ట్రికల్ బైక్కు రూపకల్పన చేశారు. -
కుమారుడి జీతం నుంచి తల్లికి జీవన భృతి
[ 27-04-2024]
జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను బాధ్యతగా, ప్రేమగా చూసుకోవాలని బాధ్యత పిల్లలదేనని ఆర్డీవో శ్రీనివాసులరాజు అన్నారు. -
ఇంత దగానా జగన్!
[ 27-04-2024]
‘అధికారంలోకి వచ్చిన వెంటనే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా. ఉద్యోగ భద్రత కల్పించి జీవనోపాధిని మెరుగుపరుస్తా..’ అంటూ గత ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక దానిని నెరవేర్చలేదు. -
రాక్షస పాలనకు త్వరలో తెర
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనకు త్వరలోనే తెరపడనుందని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
కూటమి వస్తేనే యువతకు ఉపాధి
[ 27-04-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రాగానే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. -
నేడు పాలిసెట్
[ 27-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి శనివారం పరీక్ష (పాలిసెట్) నిర్వహించనున్నారు. ఏలూరు, పరిసర ప్రాంతాల్లో పరీక్ష నిర్వహణకు 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్కుమార్, పరిశీలకులు దీప అభ్యర్థులు, వివిధ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్ల సమక్షంలో నామపత్రాలను పరిశీలించారు. -
నేటి నుంచి ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
ఇంటింటికీ ఓటరు సమాచార చీటీల పంపిణీని శనివారం నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల అరెస్టు
[ 27-04-2024]
చీటింగ్ కేసులో నిందితుడి వద్ద రూ.50 వేలు తీసుకుంటూ ఓ కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. -
తపాలా బ్యాలెట్ దరఖాస్తుకు గడువు పెంపు
[ 27-04-2024]
తపాలా బ్యాలెట్ కోసం ఫారం-12 సమర్పించేందుకు మే 1 వరకు గడువును పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?