గణపవరం విలీనం లాంఛనమే!
ఏలూరు జిల్లాలోని గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం చేయడం ఇక లాంఛనం కానుంది.
ఉంగుటూరు, న్యూస్టుడే: ఏలూరు జిల్లాలోని గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం చేయడం ఇక లాంఛనం కానుంది. ఏలూరు రెవెన్యూ డివిజన్లోని ఈ మండలాన్ని భీమవరం రెవెన్యూ, తాడేపల్లిగూడెం పోలీస్ సబ్ డివిజన్లోకి మార్చడానికి బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. దీంతో విలీనంపై దాదాపు స్పష్టత వచ్చినట్లేనని ఓ రెవెన్యూ అధికారి తెలిపారు. మండల ప్రజల ఆకాంక్షల మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలోకి కలపాలని గత ఏడాది మే 16న గణపవరంలో నిర్వహించిన రైతు భరోసా చెక్కుల పంపిణీ సభకు హాజరైన సీఎం జగన్ను ఎమ్మెల్యే వాసుబాబు కోరారు. దీంతో ఆ మేరకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో విలీనంపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు తెలపాలని గత ఏడాది నవంబరు 10న ప్రభుత్వం పేర్కొంది.
నాటకీయ పరిమాణాలు.. అభ్యంతరాలు తెలియజేయడానికి ఇచ్చిన 30 రోజులు గడువు వారంలో ముగుస్తుందనగా పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గణపవరం మండలాన్ని ఓ వర్గం భీమవరం రెవెన్యూ డివిజన్లో కలపాలని, మరో వర్గం ఏలూరులోనే కొనసాగించాలంటూ పట్టుబట్టాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి కలెక్టర్లకు, స్థానిక తహశీల్దారుకు అభ్యంతరాలు ఇచ్చారు. ఓ వర్గానికి ఎమ్మెల్యే వాసుబాబు మద్దతు పలుకుతున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం హామీకే కట్టుబడి ఉన్నానని వెల్లడించారు.
తగ్గనున్న దూరాభారం.. ప్రస్తుతం ఏలూరు జిల్లాకు గణపవరం శివారున ఉంది. మండల కేంద్రం నుంచి ఏలూరు 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివారు గ్రామమైన ఎస్.కొండేపాడు 80 కి.మీ.దూరంలో ఉండటంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. భీమవరం మండల కేంద్రం గణపవరం నుంచి 17 కి.మీ, ఎస్.కొండేపాడు 15 కి.మీ. దూరం ఉండటంతో దూరాభారం తగ్గనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హెచ్చు పందేల జోరు.. రౌండ్ల వారీ మెజార్టీపైనా దృష్టి..
[ 19-05-2024]
ఇతర దేశాల నుంచీ.. కువైట్, ఖతార్, సౌదీ ఆరేబియా తదితర దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లినవారు కూడా ఇక్కడి ఫలితాలపై పందేలకు సై అంటున్నారు. -
పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానం!
[ 19-05-2024]
భౌతికంగా తమ కుమారుడు మృతిచెందినా అవయవదానంతో మరొకరిలో చిరంజీవిగా జీవించే ఉంటాడని భావించిన ఆ తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానానికి అంగీకరించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. -
కన్నీళ్లకే కన్నీళ్లొచ్చే!
[ 19-05-2024]
ముదినేపల్లి మండలం చిగురుకోట శివారు నరసన్నపాలెంలో ఎస్సీ శ్మశాన వాటికకు వెళ్లడానికి దారి లేదు. రొయ్యల చెరువుగట్లపై నుంచి మృతదేహాన్ని తీసుకు వెళ్లాల్సి వస్తోంది. -
పాలకొల్లు వైకాపాలో లుకలుకలు
[ 19-05-2024]
పాలకొల్లులో ప్రతిపక్షం గెలవడానికి వారికంటే వైకాపా నాయకులే ఎక్కువ సహకరించారని ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు సంచలన వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం లేపుతోంది. -
చేలల్లోనే 20 శాతం పంట
[ 19-05-2024]
మూడు రోజుల నుంచి కురుస్తున్న జడివానలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆకాశం మేఘావృతమై అకస్మాత్తుగా జల్లులు పడుతుండటంతో రబీ పంట మాసూళ్లకు అవరోధాలు ఎదురవుతున్నాయి. -
కమనీయం.. శ్రీనివాసుని తిరుకల్యాణం
[ 19-05-2024]
కలియుగ ప్రత్యక్ష దైవం ద్వారకాతిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరు కల్యాణ మహోత్సవాలు శనివారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వామి, అమ్మవార్లను నూతన వధూవరులుగా ముస్తాబు చేశారు. -
జయ జయ వాసవీ మాత!
[ 19-05-2024]
జై..వాసవీ..జైజై వాసవీమాత నామస్మరణతో పెనుగొండ మారుమోగింది. వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా శనివారం కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ తదితర రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. -
ఆ నలుగురు నలిగిపోతున్నారు!
[ 19-05-2024]
శ్మశానవాటిక సమస్య లేని గ్రామం లేదు. అంతిమ సంస్కారం ముగిసే వరకు నిలబడటానికి నిలువ నీడ ఉండదు. దప్పికతీర్చే వసతి కనిపించదు. -
లక్షల్లో జీతాలా.. ఫలితాలు అంతంతమాత్రమా
[ 19-05-2024]
లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు... ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి... ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
ముంపుతో ముడి.. మావి ప్రాణాలు కావా?
[ 19-05-2024]
‘కురుములతోగు, కొత్తూరు కోసయ్యగుంపు గ్రామాలకు చెందిన 15 మంది అతిసారం బారిన పడ్డారు. సకాలంలో చికిత్స అందక ఇద్దరు తనువు చాలించారు.
తాజా వార్తలు (Latest News)
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్