రోడ్డునూ రాసిచ్చేశారు!
పదిహేనేళ్ల కిందట బ్రాహ్మణచెర్వులో పేదలకు స్థలాలు కేటాయించారు.
ప్రజావసర స్థలాల్లో ప్లాట్లు
అనుచర గణానికి వైకాపా నాయకుల పందేరం
పెనుమంట్ర, న్యూస్టుడే: పదిహేనేళ్ల కిందట బ్రాహ్మణచెర్వులో పేదలకు స్థలాలు కేటాయించారు. అక్కడ రూ.50 వేలు విలువ చేయని స్థలం... కాలనీ ఏర్పడ్డాక రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలకు పైగా పలుకుతోంది. దీంతో ఆ కాలనీలో ‘ఖాళీ స్థలాలపై’ అధికార పార్టీ నేతల కన్నుపడింది. ప్రజావసరాలకు కేటాయించిన ఖాళీ స్థలాలను ప్లాట్లుగా విభజించి కొందరికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడి నివాసితులు భగ్గుమన్నారు. అయినా లెక్క చేయకుండా తాత్కాలిక పట్టాలను సిద్ధం చేయించారు.
ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో గెలుపు కోసం అధికార పార్టీ అన్ని శక్తులనూ ఒడ్డుతోంది. వాలంటీర్ వ్యవస్థ రాకతో చెల్లాచెదురైన నాయకులను తమ వైపు రప్పించుకునే ప్రయత్నాలకు గ్రామాల్లో తెర లేపారు. దీనిలో భాగంగా తమ అనుచరగణంతోపాటు కొందరు కీలక వ్యక్తులకు స్థలాలు ఎర వేసి తమ వైపు రప్పించుకునే యత్నాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే జగనన్న కాలనీల్లో స్థలాలు ఇచ్చేయడంతో వాటి పరిధిలో ఉన్న కామన్ స్థలాలపై వారి దృష్టి పడింది. ఆయా ప్రాంతాల్లోని పాత, కొత్త కాలనీల్లో స్థలాలు పొందిన వారి వివరాలతోపాటు ఖాళీ స్థలాల వివరాలు సేకరించారు. వీటిలో తమకు అనుకూలమైన కాలనీల్లో స్థలాల కోసం పట్టుపడుతున్నారు. జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో ఈ రకమైన ప్రక్రియ గుట్టుగా సాగిపోతుంది. ఎన్నికల బదిలీల్లో భాగంగా పొరుగు జిల్లాలకు వెళ్లిన పలువురు తహసీల్దార్లు ఇందులో ప్రజాప్రతినిధుల ఒత్తిడులకు తలొగ్గినట్లు తెలుస్తోంది. కొత్తగా వచ్చిన తహసీల్దార్లకు ఇదీ కొంత సమస్యగా మారింది.
ఆందోళనతో కామన్ స్థలమిచ్చే ప్రయత్నం!
పొలమూరు పంచాయతీ పరిధిలోని నాగళ్లమెరకలో 42 ప్లాట్లతో లేఅవుట్ తయారు చేశారు. స్థలాలన్నీ పూర్తిగా స్థానికులకు ఇచ్చే విధంగా సొమ్ములు సైతం వసూలు చేశారు. తొలుత స్థానికులకు 29 పట్టాలు ఇచ్చి.. మిగిలిన 13 మందికి నాలుగేళ్ల తర్వాత సొమ్ము వెనక్కి ఇచ్చేశారు. ఈ ఖాళీ 13 స్థలాలను గ్రామంలోని అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి అనుచరులకు కట్టబెట్టారు. దీనిపై బాధితులు రోడ్డెక్కారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయడం, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో స్థానిక పార్టీ పెద్దలు కంగుతిన్నారు. స్థలాలు ఏమీ లేవంటూనే కొందరికి కామన్ స్థలం ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. ఇక గ్రామంలో 189 ప్లాట్లతో వేసిన లేఅవుట్లో కామన్ స్థలం లేకుండా చేశారు. తొలుత వేసిన ప్లాన్ను మార్చి మరీ ప్లాట్ల సంఖ్యను పెంచి తమకు కావాల్సిన వారికి పంపకం చేసేశారు.
రహదారిని తొలగించి..
పెనుమంట్ర పంచాయతీ పరిధి బ్రాహ్మణచెర్వు పాత కాలనీలో నాయకుల తీరు అందరిని విస్మయ పరుస్తోంది. ఏకంగా కాలనీవాసుల కోసం నిర్మించిన రహదారిని సైతం తొలగించి ఏడుగురికి పట్టాలు తయారు చేసేశారు. ఇక్కడే ప్రజావసరాల కోసం ఉంచిన స్థలంలో మరో 12 మందికి పట్టాలు తయారు చేసి స్థలం కేటాయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటు తీసుకున్నోళ్లు బటన్ నొక్కలేదే!
[ 18-05-2024]
ఓటర్ల జాబితా చేతిలో ఉంది... వందశాతం ఓటుకు నోటు పంపిణీ చేశాం... ఇక గెలుపు మనదే అనుకున్నారు నాయకులందరూ. -
నాలుగు చినుకులు రాలితే నరకమే
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
పురం.. వానొస్తే కంపరం!
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
పల్లెదారులు.. పరమ ఛిద్రం
[ 18-05-2024]
రహదారులు ప్రగతికి చిహ్నాలు. కానీ అధికార యంత్రాంగం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. -
మేలు కంటే నష్టమే ఎక్కువ
[ 18-05-2024]
రిజిస్ట్రేషన్, ఈసీల ఛార్జీలు, సేవా రుసుములను ఇష్టానుసారంగా పెంచేసి ప్రజల నడ్డి విరిశారు. -
అకాల వర్షాలతో రైతులకు ఇబ్బందులు : నిమ్మల
[ 18-05-2024]
సంచులు లేక ధాన్యం రాశులు అకాల వర్షాలకు తడుస్తున్నాయని, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. -
కూలీల కష్టం మాయం
[ 18-05-2024]
జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులో ఉపాధి పనులు చేస్తున్న కూలీల చిత్రానికి బదులు ఆన్లైన్లో గేదెల చిత్రం ఇటీవల అప్లోడ్ చేశారు. ఈ శాఖలో ఉన్న నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనుల అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. -
పుస్తకాలు లేకుండా చదువులా?
[ 18-05-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు సమస్యలే చదువుతున్నారు. -
జలమే.. గరళం..!
[ 18-05-2024]
ఆ గిరిజన గ్రామాల్లో జలమే గరళమవుతోంది. దప్పిక తీర్చే నీరే అక్కడి ప్రజల ప్రాణాలు హరిస్తోంది. -
నేత్రపర్వంగా శాంతి కల్యాణం
[ 18-05-2024]
భీమవరం డీఎన్నార్ కళాశాల ప్రాంగణంలోని గన్నాబత్తుల క్రీడా మైదానంలో అతిరాత్ర మహాయాగం మూడో రోజైన శుక్రవారం వైభవంగా కొనసాగింది. -
సామాజిక సందేశం.. ఆకట్టుకునే కథాంశం!
[ 18-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటిక పోటీలు ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్నాయి. -
విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి
[ 18-05-2024]
పెదపాడు మండలం కొనికిలో చేపల చెరువు వద్ద పనిచేసే యువకుడు విద్యుదాఘాతంతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు పెదపాడు ఎస్సై కె.శుభశేఖర్ తెలిపారు. -
అతిసార బాధితులకు కొనసాగుతున్న చికిత్స
[ 18-05-2024]
మండలంలోని కురుములతోగు, కొత్తూరుదేశయ్యగుంపు గ్రామాలకు చెందిన తొమ్మిది మంది గిరిజనులకు భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు..!’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన