మీ ఓటు పదిలమేనా?
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఓట్ల పండగలో పాల్గొనేందుకు మీ ఓటు పదిలంగా ఉందో లేదో తెలుసుకున్నారా? వెంటనే తనిఖీ చేసుకోండి. ఈ ఎన్నికల్లో ఓటు వేసే వారికోసం ప్రభుత్వం వచ్చే నెల 15 వరకూ నమోదు గడువు ఇచ్చింది.
లేకుంటే దరఖాస్తు చేసుకోండి
ఏప్రిల్ 15 వరకూ గడువు
కుక్కునూరు, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఓట్ల పండగలో పాల్గొనేందుకు మీ ఓటు పదిలంగా ఉందో లేదో తెలుసుకున్నారా? వెంటనే తనిఖీ చేసుకోండి. ఈ ఎన్నికల్లో ఓటు వేసే వారికోసం ప్రభుత్వం వచ్చే నెల 15 వరకూ నమోదు గడువు ఇచ్చింది. ఇప్పుడు కొత్త ఓటు నమోదుకు ఫారం-6లు స్వీకరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఓటర్లు జాబితాలు ప్రచురణ అయిపోయినందున, ఇప్పటి నుంచి ఏప్రిల్ 15 వరకూ వచ్చే కొత్త ఓటర్లను అనుబంధ(సప్లిమెంటరీ)జాబితాలో చేరుస్తామని వివరిస్తున్నారు. ్త్ర తుది జాబితా నాటికి ఏలూరు జిల్లాలో 16,24,416 మంది ఓటర్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 14,61,338 మంది ఓటర్లు నమోదయ్యారు. ఇందులో రెండు జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఏలూరు జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాల్లో మహిళా ఓటర్లు సంఖ్య 8,30,390 కాగా, పురుష ఓటర్లు 7,93,897 మంది. పురుషుల కంటే మహిళల ఓట్లు 36,498 అధికంగా ఉన్నాయి. పశ్చిమలో మహిళా ఓటర్లు 7,44,308 మంది కాగా, పురుష ఓటర్లు 7,16,956గా ఉన్నారు. ఈ జిల్లాలో కూడా 27,352 మంది మహిళా ఓటర్లు అధికంగా నమోదయ్యారు.
ఓటర్లకు అవగాహన లేదు.. అధికారులూ పట్టించుకోరు..
ఓటరు జాబితాల పరిశీలనపై ఓటర్లు ఉదాశీనంగా వ్యవహరిస్తుంటారు. తమ ఓటు ఉందా? ఉంటే తమ పోలింగు బూత్లలోనే ఉందా? తమ కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఒకే చోట ఉన్నాయా అన్న అంశాలను పరిశీలించుకోవాలి. దీనిపై చాలా మందికి అవగాహన లేదు. తుది జాబితా విడుదల చేసిన తరువాత ఆయా పోలింగు కేంద్రాలు, ఆన్లైన్లో వాటిని అందుబాటులో ఉంచినప్పటికీ జాబితాలో తమ పేరు ఉన్నదీ లేనిదీ కూడా చూసుకోలేదు. సాధారణంగా ఓటు ఎక్కడ ఉందో బీఎల్వోలు ఓటరుకు వివరించాలి. ఏదైనా తప్పిదం ఉంటే వారి చేత ఫారం-8 దరఖాస్తు పెట్టించి నివాస ప్రాంతానికి సమీప కేంద్రంలోనికి మార్చేలా చూడాలి. ఒక కుటుంబానికి చెందిన ఓటర్లంతా ఒకే పీఎస్లో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
జాబితాలో పేరు లేకపోతే..
ఓటరుగా నమోదైనప్పటికీ ఎన్నికల రోజున జాబితాలో చాలా మంది తమ పేర్లు లేవని ఆందోళన చెందుతూ ఉంటారు. దాని బదులు ముందుగానే మన పేరు చూసుకోవటం మంచిది. ఒకవేళ పేరు కనిపించకపోతే వెంటనే కొత్త ఓటరు నమోదుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతను పరిశీలించి అధికారులు ఓటేసే హక్కును కల్పిస్తారు. దీంతో పాటు చిరునామా మార్చుకోవాలన్నా ఇంకా అవకాశం ఉంది. దానికి ఫారం-8 వినియోగించాలి. గ్రామ/వార్డు సచివాలయం, తహసీల్దార్ కార్యాలయంలోని బూత్ స్థాయి అధికారులకు దరఖాస్తులు అందజేయాలి. ఓటరు హెల్ప్లైన్ యాప్, హెచ్టిటిపి//సీˆఈవోఆంధ్రా.నిక్.ఇన్., హెచ్టీటీపీˆ//ఓటర్స్.ఈసీఐ.జీవోవి.ఇన్ వెబ్సైట్ల ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ రాసిన మరణ శాసనం
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక నాటు సారా తయారీ, విక్రయాలు, వినియోగం అన్నీ పెరిగాయి. నూతన మద్యం విధానం పేరుతో రూ.60 ఉన్న క్వార్టర్ సీసాను రూ.120-150కి అమాంతం పెంచేశారు. -
మాటలు ఎక్కడో.. పనులు ఇక్కడే
[ 27-04-2024]
‘ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తాం.. తొమ్మిది రకాల అభివృద్ధి పనులు చేపట్టి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం’ అని సీఎం జగన్, వైకాపా నాయకుడు ఊకదంపుడు ఉపాన్యాసాలిచ్చారు. -
పార్లమెంట్ 4, అసెంబ్లీకి 26 తిరస్కరణ
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఏలూరు పార్లమెంట్కు 17 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయగా వివిధ కారణాలతో 4 తిరస్కరణకు గురయ్యాయి. -
‘భూగర్భం’లో.. కలిసిపోయిన హామీలు..!
[ 27-04-2024]
నరసాపురంలో ప్రస్తుత జనాభా సుమారు 70వేలకు చేరిందని అంచనా. 31 వార్డుల్లో 109 కి.మీ మేర డ్రెయిన్ వ్యవస్థ ఉంది. మేజర్ డ్రెయిన్ల అవుట్లెట్ పొన్నపల్లి వద్ద గోదావరిలోకి ఉంది. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సాధారణ పరిశీలకులు దీప, ఎల్ నిర్మలారాజ్, పోలీసు పరిశీలకులు శైలేష్కుమార్సిన్హా పేర్కొన్నారు. -
జగన్ పాలనలో అంతా దోపిడీ
[ 27-04-2024]
‘అయిదేళ్ల వైకాపా పాలనలో చింతలపూడి ఎత్తిపోతల కోసం సీఎం జగన్మోహన్రెడ్డి తట్టెడు మట్టి కూడా వేయలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. -
నామినేషన్ రోజునే గెలుపు ఖరారు: నిమ్మల
[ 27-04-2024]
తను నామినేషన్ వేసిన ఈ నెల 19న నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చినప్పుడే పాలకొల్లులో తన గెలుపు ఖరారయ్యిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు. -
నాడు జీవనాడి సవ్వడి.. నేడు జీవనం చతికిలపడి!
[ 27-04-2024]
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను 2014-19లో తెదేపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనులు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అటు అధికారులు, ఇటు గుత్తేదారులను పరుగులు పెట్టించేవారు. -
రెండు గంటల ఛార్జింగ్.. 25కి.మీ. ప్రయాణం
[ 27-04-2024]
తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) విద్యార్థులు ఎలక్ట్రికల్ బైక్కు రూపకల్పన చేశారు. -
కుమారుడి జీతం నుంచి తల్లికి జీవన భృతి
[ 27-04-2024]
జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను బాధ్యతగా, ప్రేమగా చూసుకోవాలని బాధ్యత పిల్లలదేనని ఆర్డీవో శ్రీనివాసులరాజు అన్నారు. -
ఇంత దగానా జగన్!
[ 27-04-2024]
‘అధికారంలోకి వచ్చిన వెంటనే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా. ఉద్యోగ భద్రత కల్పించి జీవనోపాధిని మెరుగుపరుస్తా..’ అంటూ గత ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక దానిని నెరవేర్చలేదు. -
రాక్షస పాలనకు త్వరలో తెర
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనకు త్వరలోనే తెరపడనుందని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
కూటమి వస్తేనే యువతకు ఉపాధి
[ 27-04-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రాగానే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. -
నేడు పాలిసెట్
[ 27-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి శనివారం పరీక్ష (పాలిసెట్) నిర్వహించనున్నారు. ఏలూరు, పరిసర ప్రాంతాల్లో పరీక్ష నిర్వహణకు 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్కుమార్, పరిశీలకులు దీప అభ్యర్థులు, వివిధ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్ల సమక్షంలో నామపత్రాలను పరిశీలించారు. -
నేటి నుంచి ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
ఇంటింటికీ ఓటరు సమాచార చీటీల పంపిణీని శనివారం నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల అరెస్టు
[ 27-04-2024]
చీటింగ్ కేసులో నిందితుడి వద్ద రూ.50 వేలు తీసుకుంటూ ఓ కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. -
తపాలా బ్యాలెట్ దరఖాస్తుకు గడువు పెంపు
[ 27-04-2024]
తపాలా బ్యాలెట్ కోసం ఫారం-12 సమర్పించేందుకు మే 1 వరకు గడువును పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!