చేలకు నీరు.. చేరని తీరు
జిల్లాలోని ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో శివారు భూములకు సాగునీరు అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మొగల్తూరు మండలంలో సుమారు 150 ఎకరాలకు నీటిఎద్దడి ఉందని కర్షకులు చెబుతున్నారు.
అడ్డంకులతో శివార్లలో అవస్థలు!
బీటలు తీస్తున్న పంట భూములు
మోటార్ సాయంతో నీటి మళ్లింపు
మొగల్తూరు, ఆచంట, పెనుమంట్ర, న్యూస్టుడే: జిల్లాలోని ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో శివారు భూములకు సాగునీరు అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మొగల్తూరు మండలంలో సుమారు 150 ఎకరాలకు నీటిఎద్దడి ఉందని కర్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రధాన కాలువలో గుర్రపు డెక్క పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకంగా మారింది. జిన్నూరు కాలువ పరిధిలోని శేరేపాలెం, కొత్తపాలెం నరసాపురం కాలువ ఆయకట్టు పరిధిలో మొగల్తూరు, కొత్తకాయలతిప్ప, రామన్నపాలెం గ్రామాల్లోని పలు ప్రాంతాలకు సమస్యగా ఉంది. పక్వానికి వస్తున్న పంటను వదల్లేక కొన్నిచోట్ల రైతులు సొంత ఖర్చులతో మోటార్ల ద్వారా నీటిని తోడుకుంటున్నారు. అయిదేళ్లుగా కాలువలు, డ్రెయిన్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సారీ నీటి ఎద్దడి మరింత ఎక్కువగా ఉంటుందని ముందస్తుగా అంచనా వేసినా ఆ దిశగా యంత్రాంగం అప్రమత్తం కాలేదనే ఆరోపణలు ఉన్నాయి. కాలువల్లో కనీసం గుర్రపుడెక్క తొలగించకపోవడంతో ఉన్న కాస్త నీరు ముందుకు సాగక పొలాలకు చేరడం లేదు.
సాగు భారం.. ఆచంట మండలం ఎ.వేమవరంలోని పలు ప్రాంతాల్లో భూములకు నీరందక పొలాలు బీటలు తీశాయి. ఇక్కడ దాదాపు 70 ఎకరాలకు పైగా నీటి ఎద్దడి ఉంటుందని అంచనా. నక్కల కాలువ పక్కన ఉన్న వందలాది ఎకరాలు మరో నెల దాటితే కాని పక్వానికి వచ్చే అవకాశం లేదు. సార్వాలో ఇక్కడ ముంపు సమస్యతో తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు నీరందక ఎకరాకు అదనంగా రూ.అయిదు వేలు ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు. వల్లూరు గ్రామ పరిధిలో 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగు నీటి సమస్య ఉంది. ఆచంట, కొడమంచిలి, పెనుమంచిలి, కరుగోరుమిల్లి గ్రామాల్లోని శివారు ప్రాంతాల రైతులు ఆయిల్ ఇంజిన్ల ద్వారా నీటిని తోడి పంటను కాపాడుకుంటున్నారు. దీంతో అదనంగా వెచ్చించాల్సి రావడంతో సాగు వ్యయం భారం అవుతోందని వాపోతున్నారు.
మూడేళ్లుగా నష్టాలే.. నేను మూడున్నర ఎకరాలు సాగు చేస్తున్నా. సక్రమంగా నీరందక ఇబ్బందులు పడుతున్నాం. నీటి కోసం అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. మూడేళ్ల నుంచి ఏటా రూ.50 వేల నుంచి రూ.80 వేలు నష్టపోతున్నా.
తూము నాగభూషణం, రైతు, వేమవరం
వ్యవసాయం చేయలేం.. సార్వాలో ముంపు, దాళ్వాలో నీరందక అదనపు పెట్టుబడి తప్పడం లేదు. పూర్తిస్థాయిలో నీరు ఇస్తామని చెప్పడంతో సాగు చేశా. తీరా నీరందక నానా కష్టాలు పడుతున్నాం. ఎకరానికి రూ.5 వేలు ఆయిల్ ఖర్చు అవుతోంది.
వరదా వెంకటేశ్వరరావు, రైతు, వేమవరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ రాసిన మరణ శాసనం
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక నాటు సారా తయారీ, విక్రయాలు, వినియోగం అన్నీ పెరిగాయి. నూతన మద్యం విధానం పేరుతో రూ.60 ఉన్న క్వార్టర్ సీసాను రూ.120-150కి అమాంతం పెంచేశారు. -
మాటలు ఎక్కడో.. పనులు ఇక్కడే
[ 27-04-2024]
‘ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తాం.. తొమ్మిది రకాల అభివృద్ధి పనులు చేపట్టి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం’ అని సీఎం జగన్, వైకాపా నాయకుడు ఊకదంపుడు ఉపాన్యాసాలిచ్చారు. -
పార్లమెంట్ 4, అసెంబ్లీకి 26 తిరస్కరణ
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఏలూరు పార్లమెంట్కు 17 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయగా వివిధ కారణాలతో 4 తిరస్కరణకు గురయ్యాయి. -
‘భూగర్భం’లో.. కలిసిపోయిన హామీలు..!
[ 27-04-2024]
నరసాపురంలో ప్రస్తుత జనాభా సుమారు 70వేలకు చేరిందని అంచనా. 31 వార్డుల్లో 109 కి.మీ మేర డ్రెయిన్ వ్యవస్థ ఉంది. మేజర్ డ్రెయిన్ల అవుట్లెట్ పొన్నపల్లి వద్ద గోదావరిలోకి ఉంది. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సాధారణ పరిశీలకులు దీప, ఎల్ నిర్మలారాజ్, పోలీసు పరిశీలకులు శైలేష్కుమార్సిన్హా పేర్కొన్నారు. -
జగన్ పాలనలో అంతా దోపిడీ
[ 27-04-2024]
‘అయిదేళ్ల వైకాపా పాలనలో చింతలపూడి ఎత్తిపోతల కోసం సీఎం జగన్మోహన్రెడ్డి తట్టెడు మట్టి కూడా వేయలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. -
నామినేషన్ రోజునే గెలుపు ఖరారు: నిమ్మల
[ 27-04-2024]
తను నామినేషన్ వేసిన ఈ నెల 19న నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చినప్పుడే పాలకొల్లులో తన గెలుపు ఖరారయ్యిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు. -
నాడు జీవనాడి సవ్వడి.. నేడు జీవనం చతికిలపడి!
[ 27-04-2024]
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను 2014-19లో తెదేపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనులు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అటు అధికారులు, ఇటు గుత్తేదారులను పరుగులు పెట్టించేవారు. -
రెండు గంటల ఛార్జింగ్.. 25కి.మీ. ప్రయాణం
[ 27-04-2024]
తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) విద్యార్థులు ఎలక్ట్రికల్ బైక్కు రూపకల్పన చేశారు. -
కుమారుడి జీతం నుంచి తల్లికి జీవన భృతి
[ 27-04-2024]
జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను బాధ్యతగా, ప్రేమగా చూసుకోవాలని బాధ్యత పిల్లలదేనని ఆర్డీవో శ్రీనివాసులరాజు అన్నారు. -
ఇంత దగానా జగన్!
[ 27-04-2024]
‘అధికారంలోకి వచ్చిన వెంటనే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా. ఉద్యోగ భద్రత కల్పించి జీవనోపాధిని మెరుగుపరుస్తా..’ అంటూ గత ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక దానిని నెరవేర్చలేదు. -
రాక్షస పాలనకు త్వరలో తెర
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనకు త్వరలోనే తెరపడనుందని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
కూటమి వస్తేనే యువతకు ఉపాధి
[ 27-04-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రాగానే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. -
నేడు పాలిసెట్
[ 27-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి శనివారం పరీక్ష (పాలిసెట్) నిర్వహించనున్నారు. ఏలూరు, పరిసర ప్రాంతాల్లో పరీక్ష నిర్వహణకు 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్కుమార్, పరిశీలకులు దీప అభ్యర్థులు, వివిధ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్ల సమక్షంలో నామపత్రాలను పరిశీలించారు. -
నేటి నుంచి ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
ఇంటింటికీ ఓటరు సమాచార చీటీల పంపిణీని శనివారం నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల అరెస్టు
[ 27-04-2024]
చీటింగ్ కేసులో నిందితుడి వద్ద రూ.50 వేలు తీసుకుంటూ ఓ కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. -
తపాలా బ్యాలెట్ దరఖాస్తుకు గడువు పెంపు
[ 27-04-2024]
తపాలా బ్యాలెట్ కోసం ఫారం-12 సమర్పించేందుకు మే 1 వరకు గడువును పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే