నీకు కప్పం తప్ప ఇల్లు కట్టలేకపోయాం!
ఇనుముతో సమానంగా ఇసుక ధరలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి వర్గాలు భవన నిర్మాణానికి వెనకడుగు వేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 12 ఇసుక రీచ్లు ఉన్నాయి.
వైకాపా ప్రభుత్వంలో సాకారం కాని సొంతిళ్లు
పెరిగిన ధరలతో పునాదుల్లోనే నిలిచిన పనులు
ఇసుక కొరత కారణంగా నిలిచిన భవన నిర్మాణం
ఇనుముతో సమానంగా ఇసుక ధరలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి వర్గాలు భవన నిర్మాణానికి వెనకడుగు వేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 12 ఇసుక రీచ్లు ఉన్నాయి. ప్రకృతి సిద్ధంగా లభించే ఇసుకను ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సిందిపోయి రవాణా పేరుతో ప్రజలు భరించలేని విధంగా వైకాపా ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. 3 యూనిట్లు రూ.6 వేల నుంచి రూ.9 వేలకు లభించేది. ప్రస్తుతం రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. ఇసుక రీచ్లవద్దే సీనరేజీ, బాట ఛార్జీల పేరిట ఒక్కొక్క లారీకి అదనంగా రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. ఇసుక ధరకు సమానంగా రవాణా ఛార్జీలు భరించాల్సిరావడం సామాన్యులకు భారంగా మారింది.
- ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పాలకొల్లుకు చెందిన పాలపర్తి సాయిబాబా. వృత్తి తాపీమేస్త్రి. తనకున్న 60గజాల స్థలంలో సొంతింటి కలను సాకారం చేసుకుందామని గత ఏడాది ఇంటి నిర్మాణంలోకి దిగారు. ఒక మేస్త్రిగా తన ఇల్లు పూర్తిచేయడానికి సుమారు రూ.12 లక్షల వ్యయ ప్రతిపాదనతో పనులు ప్రారంభించారు. అంతకంతకూ పెరుగుతున్న భవన నిర్మాణ మెటీరియల్, కూలీల ఖర్చులతో అంచనా మరో రూ.4 లక్షలకు పెరిగిపోయింది. రెక్కాడితేగాని డొక్కాడని ఆ కుటుంబం డబ్బు సర్దుబాటు చేయలేక ప్రస్తుతానికి పనులు విరమించారు. ఎన్నో ఇళ్లు కట్టిన తాపీమేస్త్రికే సొంతిల్లు పూర్తిచేయాలంటే కత్తిమీద సామవుతుందని సాయిబాబా వాపోయారు.
మా వల్ల కాదు బాబోయ్..
నాలుగేళ్ల కిందట వంద చదరపు గజాల స్థలంలో హంగులు లేని పక్కా ఇంటిని నిర్మించేందుకు సుమారు రూ.4.50 లక్షల వరకు ఖర్చయ్యేది. ఇసుక ధరలు, ఇతర నిర్మాణ సామగ్రి ధరల పెంపు ప్రభావంతో ఇప్పుడు రూ.7 లక్షల వరకు ఆ ఖర్చు చేరింది. టన్ను రూ.40 వేలుండే ఇనుము రూ.70 వేలు దాటిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రతిపనికీ నాయకుల నుంచి అధికారుల వరకు మామూళ్ల రూపంలో కప్పం కట్టలేక కుదేలైన కుటుంబాలు అనేకం ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
ఆకాశాన్నంటడంతో ఆగిపోయాం
ఒకదాని తర్వాత ఒకటిగా ఆకాశాన్నంటిన ధరల్లో నదుల్లో ఉండే ఇసుకను తీసుకెళ్లి కొండమీద కూర్చోబెట్టిన జగన్ ప్రభుత్వంలో సొంతిల్లు అయ్యేపనికాదని మా ఇంటి నిర్మాణాన్ని సగంలో నిలిపివేశాం. నాలుగేళ్ల కిందట మేము ఇంటి నిర్మాణం ప్రారంభించినపుడు. ఇసుక 6 యూనిట్లు రూ.12 వేలకు లభించేది. ఇప్పుడు రూ.30 వేలకు పైబడింది. ఇసుక ధర తగ్గితే తప్ప ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకునే పరిస్థితి ఎవరికీ లేదు.
-కె.విజయ, ఏలూరు
రెట్టింపు ధరకు కొనుగోలు చేశాం
‘ఆరేళ్ల కిందట ఇంటి నిర్మాణం ప్రారంభించా. అప్పట్లో ఇసుక ఉచితంగా దొరికేది. రవాణా ఛార్జీలు మూడు యూనిట్లకు రూ.5 వేల నుంచి రూ.6 వేలు ఖర్చయ్యేది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నూతన విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఇసుక దొరకక ఇబ్బందులు పడ్డాం. కొంతకాలం నిర్మాణం నిలిచిపోయింది. తర్వాత రెట్టింపు ధరకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో నిర్మాణ వ్యయం పెరిగింది
- కొల్లాటి కనక సుబ్బారావు, ముత్యాలపల్లి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాల మీదకొచ్చినా స్పందించరా?
[ 17-05-2024]
ఏజెన్సీలో అతిసారం విజృంభిస్తోంది. కలుషిత నీరు గిరిపుత్రుల ప్రాణాలు తోడేస్తోంది. కుక్కునూరు మండలంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. గుక్కెడు తాగునీటికి నోచుకోక చెలమల్లోని మురికి నీరు తాగుతున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవటమే ఈ మరణాలకు కారణమైంది. -
ఆగని అరాచకపర్వం
[ 17-05-2024]
పోలింగ్ నాడు వైకాపా మూకలు చేసిన విధ్వంసకాండ..వారు గత అయిదేళ్లుగా చేస్తున్న అరాచకాలకు పరాకాష్ఠగా నిలిచింది. పచ్చని పశ్చిమలో నెత్తుటి ఛాయలు చూపించింది. ఓటమి భయం ఆవరించటంతో తెదేపా కార్యకర్తలు, నాయకులపై దాడులకు తెగబడటమే లక్ష్యంగా పని చేశారు. -
కలిసి రాని కొబ్బరి!
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలో 55 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉంది. పెదవేగి, యలమంచిలి మండలాలు కొబ్బరిసాగులో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఉద్యానంలో పెద్దపంటగా భావించే కొబ్బరిలో తెగుళ్ల బెడద తీవ్రస్థాయికి చేరింది. -
తేమ పేరుతో కోత
[ 17-05-2024]
ఆరుగాలం శ్రమించి పంట పండించిన అన్నదాతలు అమ్ముకోవాలంటే అష్టకష్టాలు తప్పడం లేదు. ఏదో రీతిన దోచుకోవడానికి దళారులే కాదు మిల్లర్లూ సిద్ధమయ్యారు. -
ఈఏపీ సెట్ ప్రారంభం
[ 17-05-2024]
ఈఏపీ సెట్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఉదయం జరిగిన అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షకు మొత్తం 175 మంది హాజరు -
పది సప్లిమెంటరీకి సన్నద్ధతేదీ ?
[ 17-05-2024]
ఉంగుటూరు మండలం కైకరం జడ్పీ ఉన్నత పాఠశాలలో 118 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాయగా 66 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు వచ్చాక వీరికి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. -
అర్ధరాత్రి ఇసుక దందా
[ 17-05-2024]
అనుమతులు ఉన్నాయంటూ ఒకలా, లేకుంటే మరోలా జిల్లాలో ఇసుక దందా సాగుతోంది. ఆచంట మండలం కరుగోరుమిల్లిలో ఇటీవల ఇసుక ర్యాంపు ఏర్పాటు చేశారు. -
నెత్తురోడిన రహదారులు
[ 17-05-2024]
ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని రహదారులు గురువారం రక్తమోడాయి. వివిధ ప్రాంతాల్లో జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ముగ్గురు తీవ్రగాయాలతో ఆసుపత్రుల్లో చేరారు. -
కొప్పులవారిగూడెం ఘటనపై పోలీసుల అత్యుత్సాహం
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో(ఈ నెల 13న) పెదవేగి మండలం కొప్పులవారి గూడెంలో జరిగిన ఘటనపై పెదవేగి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఎన్డీయే దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. -
లారీ ఢీకొని తల్లి మృతి.. ప్రాణాపాయ స్థితిలో కుమార్తె
[ 17-05-2024]
లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో తల్లి ఘటనా స్థలంలోనే మృతిచెందగా కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన దుర్ఘటన గురువారం ఉదయం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ