జగన్ సిద్ధం.. జనానికి నరకం
ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి శుక్రవారం నరసాపురంలో నిర్వహించిన సిద్ధం సభ.. జనానికి నరకం చూపింది.
ఎండలో అల్లాడిన మహిళలు, వృద్ధులు
పట్టణంలో ట్రాఫిక్ ఇక్కట్లు.. పలు దుకాణాల మూసివేత
ఎండలో దుకాణాల ముందు మహిళల ఇక్కట్లు
ఈనాడు, భీమవరం: ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి శుక్రవారం నరసాపురంలో నిర్వహించిన సిద్ధం సభ.. జనానికి నరకం చూపింది. ఉదయం 10 గంటలకు రావాల్సిన జగన్ 2 గంటలకు పైగా ఆలస్యంగా రావడంతో ఎండలో మహిళలు, వృద్ధులు అవస్థలు పడ్డారు. ఆటోలు పెట్టి మనిషికి రూ.200 ఇచ్చి తరలించినా జగన్ రాకముందే సగం మంది, ప్రసంగం ముగియక ముందే మూడొంతులు వెళ్లిపోయారు.
బస్సులు లేక వెలవెలబోతున్న బస్టాండు
అంతా ఇష్టారాజ్యంగా.. సభ ఏర్పాట్ల విషయంలో నిర్వాహకులు అడ్డగోలుగా వ్యవహరించారు. జగన్ ప్రచార వాహనం నిలిపే ప్రాంతంలో ఉన్న డివైడర్ను సుమారు 10 మీటర్ల మేర అడ్డగోలుగా కొట్టేశారు. డివైడర్పై ఉన్న విద్యుత్తు స్తంభాన్ని శుక్రవారం తెల్లవారుజామున గుట్టుగా తొలగించారు. సభా ప్రాంగణం పక్కన ఉన్న డ్రెయిన్ను ధ్వంసం చేశారు. ఉదయం 7 గంటల నుంచే సభ జరిగే మార్గంలో దుకాణాలను బలవంతంగా మూయించారు. బారికేడ్లు పెట్టి వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. నియమావళి ఉన్నా పట్టణంలో సిద్ధం పేరుతో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
నరసాపురంలో ట్రాఫిక్ ఇక్కట్లు
మండుటెండలో ఉక్కిరిబిక్కిరి
ఉదయం 8 గంటల నుంచే జనాన్ని తరలించారు. పది గంటల్లోపు సభా ప్రాంగణానికి రావాల్సిన జగన్ 2.15 గంటలు ఆలస్యంగా రావడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఎండ మండిపోవడంతో నిలబడలేక వందలాది మంది వెనుదిరిగారు. సభ అయ్యే వరకూ తీసుకొచ్చిన ఆటోలు కదలవని నిర్వాహకులు చెప్పడంతో పట్టణంలోని దుకాణాల నీడలో తలదాచుకున్నారు. బందోబస్తు విధులకు వచ్చిన పోలీసులు వైకాపా కార్యకర్తల్లా మారి వచ్చిన వారికి మజ్జిగ, మంచి నీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. సభ కారణంగా నరసాపురం బస్టాండ్ సమీపంలో భారీగా ట్రాఫిక్ నిలిచింది. దీంతో సాధారణ ప్రయాణికులు, వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. పూర్తిస్థాయిలో బస్సులు లేక ప్రయాణికులు బస్టాండ్లోనే గంటల తరబడి నిరీక్షించారు.
రోడ్డుకు అడ్డుగా బారికేడ్లు పెట్టడంతో రాకపోకలకు ఇబ్బందులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటు తీసుకున్నోళ్లు బటన్ నొక్కలేదే!
[ 18-05-2024]
ఓటర్ల జాబితా చేతిలో ఉంది... వందశాతం ఓటుకు నోటు పంపిణీ చేశాం... ఇక గెలుపు మనదే అనుకున్నారు నాయకులందరూ. -
నాలుగు చినుకులు రాలితే నరకమే
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
పురం.. వానొస్తే కంపరం!
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
పల్లెదారులు.. పరమ ఛిద్రం
[ 18-05-2024]
రహదారులు ప్రగతికి చిహ్నాలు. కానీ అధికార యంత్రాంగం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. -
మేలు కంటే నష్టమే ఎక్కువ
[ 18-05-2024]
రిజిస్ట్రేషన్, ఈసీల ఛార్జీలు, సేవా రుసుములను ఇష్టానుసారంగా పెంచేసి ప్రజల నడ్డి విరిశారు. -
అకాల వర్షాలతో రైతులకు ఇబ్బందులు : నిమ్మల
[ 18-05-2024]
సంచులు లేక ధాన్యం రాశులు అకాల వర్షాలకు తడుస్తున్నాయని, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. -
కూలీల కష్టం మాయం
[ 18-05-2024]
జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులో ఉపాధి పనులు చేస్తున్న కూలీల చిత్రానికి బదులు ఆన్లైన్లో గేదెల చిత్రం ఇటీవల అప్లోడ్ చేశారు. ఈ శాఖలో ఉన్న నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనుల అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. -
పుస్తకాలు లేకుండా చదువులా?
[ 18-05-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు సమస్యలే చదువుతున్నారు. -
జలమే.. గరళం..!
[ 18-05-2024]
ఆ గిరిజన గ్రామాల్లో జలమే గరళమవుతోంది. దప్పిక తీర్చే నీరే అక్కడి ప్రజల ప్రాణాలు హరిస్తోంది. -
నేత్రపర్వంగా శాంతి కల్యాణం
[ 18-05-2024]
భీమవరం డీఎన్నార్ కళాశాల ప్రాంగణంలోని గన్నాబత్తుల క్రీడా మైదానంలో అతిరాత్ర మహాయాగం మూడో రోజైన శుక్రవారం వైభవంగా కొనసాగింది. -
సామాజిక సందేశం.. ఆకట్టుకునే కథాంశం!
[ 18-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటిక పోటీలు ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్నాయి. -
విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి
[ 18-05-2024]
పెదపాడు మండలం కొనికిలో చేపల చెరువు వద్ద పనిచేసే యువకుడు విద్యుదాఘాతంతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు పెదపాడు ఎస్సై కె.శుభశేఖర్ తెలిపారు. -
అతిసార బాధితులకు కొనసాగుతున్న చికిత్స
[ 18-05-2024]
మండలంలోని కురుములతోగు, కొత్తూరుదేశయ్యగుంపు గ్రామాలకు చెందిన తొమ్మిది మంది గిరిజనులకు భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.