మీ గెండెల్లో ధైర్యం నింపడానికి వచ్చా
కొల్లేరు సమస్య పరిష్కారానికి కేంద్ర సాయంతో కృషి చేస్తామని జనసేన అధినేత పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. శుక్రవారం కైకలూరులో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.
ఎమ్మెల్యే దిగొచ్చాడా.. బెదిరిస్తే భయపడొద్దు
కైకలూరు సభలో జనసేనాని పవన్ కల్యాణ్
కొల్లేరు సమస్య పరిష్కారానికి హామీ
మండవల్లి, కైకలూరు, న్యూస్టుడే
కొల్లేరు సమస్య పరిష్కారానికి కేంద్ర సాయంతో కృషి చేస్తామని జనసేన అధినేత పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. శుక్రవారం కైకలూరులో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. కొల్లేరు కాంటూరు సమస్య చాలా సున్నితమైందని పరిష్కారానికి కేంద్ర సహకారం కావాలన్నారు. ‘అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి ఒక్కసారైనా కొల్లేరు వైపు వచ్చి చూశారా? మాట్లాడారా? పర్యాటక ప్రగతిని ముందుకు తీసుకెళ్లలేదు. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే దీనిపై చాలా ఆదాయం వస్తుంది. స్థానిక యువత ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. కానీ వాటితో మంత్రికి పని లేదు. ఎర్రచందనం కొట్టుకుంటూ బిజీగా ఉన్నప్పుడు కొల్లేరు కోసం ఆలోచించే సమయం వాళ్లకు ఎక్కడ ఉంటుంది?’ అంటూ పవన్ ప్రశ్నించారు. కొల్లేరు పూర్వవైభవానికి రెగ్యులేటర్ను నిర్మించేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ‘జనసేన పోటీలో లేని చోట స్వతంత్ర అభ్యర్థికి గాజుగ్లాసు గుర్తు కేటాయించేలా జగన్ కుట్ర చేశారు. జాగ్రత్తగా ఓటు వేయాలి’ అని సూచించారు. అసెంబ్లీ అభ్యర్థి కామినేని మృధు స్వభావి అని.. మాట ఇస్తే నిలబడతారని తెలిపారు.
కైకలూరు వాళ్ల సొంతమా..
‘స్థానిక ఎమ్మెల్యే, ఆయన కొడుకుకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే ఏమైనా దిగొచ్చాడా? ఆయన కొడుకు దిగొచ్చాడా? కైకలూరు వాళ్ల సొంతమా? ఏపీ జగన్ సొంతమా? భయం వీడండి. మీ గుండెల్లో ధైర్యం నింపడానికే నేనొచ్చా’ అంటూ కైకలూరు గడ్డపై పవన్ గర్జించారు. ‘ప్రజలకు ఇబ్బంది కలిగించే వైకాపా ఎమ్మెల్యే ఎవరైనా సరే.. అవినీతి కోటలు బద్దలు కొడతాం’ అని ఉద్ఘాటించారు. ఎమ్మెల్యే కొడుకు బెదిరించి 50 ఎకరాల చేపల చెరువులు తీసుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. రౌడీమూకలను వేసుకుని తిరుగుతున్నంత మాత్రాన బెదరాల్సిన అవసరం లేదన్నారు.
అభివృద్ధి కేంద్రంగా కైకలూరు
‘కైకలూరును స్మార్టు మున్సిపాలిటీగా మార్చుతాం’ అని పవన్ హామీ ఇచ్చారు. కలిదిండి మండలంలో అగ్నిమాపక కేంద్రం, ముదినేపల్లి మండలంలో ధాన్యం నిల్వ గోదాములు, డిగ్రీ కళాశాల, కైకలూరులో ఈఎస్ఐ ఆసుపత్రి, పార్కు, డయాలసిస్ కేంద్రంతోపాటు 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామన్నారు.
ఆక్వా రంగాన్ని ఆదుకుంటాం
ఆక్వా రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన అనంతరం ఆక్వా రైతులకు రూ.1.50 విద్యుత్తు, రాయితీలు, రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
వంతెనలు నిర్మిస్తాం
పేరూరులో పోల్రాజ్ కెనాల్పై చిన్నపాటి వంతెన కూలి మూడేళ్లయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. వంతెనల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. ఏలూరు గ్రామీణం, కైకలూరును కలిపే వంతెన నిర్మాణానికి కేంద్ర సహకారంతో నిధులు సాధిస్తాం’ అని పవన్ ప్రకటించారు. కలిదిండి, పడమటిపాలెం, పరసావానిపాలెం, ఎస్ఆర్పీఅగ్రహారం, వెంకటాపురం గ్రామాల్లో ఆకుకూరలు పండించే రైతులకు రైతు బజార్ను ఏర్పాటు చేసి అండగా ఉంటాం’ అని భరోసా ఇచ్చారు. ఈ సభలో కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కామినేని, పుట్టా మహేశ్ యాదవ్, జనసేన నేత, క్రికెటర్ అంబటి రాయుడు తదితరులు ప్రసంగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటు తీసుకున్నోళ్లు బటన్ నొక్కలేదే!
[ 18-05-2024]
ఓటర్ల జాబితా చేతిలో ఉంది... వందశాతం ఓటుకు నోటు పంపిణీ చేశాం... ఇక గెలుపు మనదే అనుకున్నారు నాయకులందరూ. -
నాలుగు చినుకులు రాలితే నరకమే
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
పురం.. వానొస్తే కంపరం!
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
పల్లెదారులు.. పరమ ఛిద్రం
[ 18-05-2024]
రహదారులు ప్రగతికి చిహ్నాలు. కానీ అధికార యంత్రాంగం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. -
మేలు కంటే నష్టమే ఎక్కువ
[ 18-05-2024]
రిజిస్ట్రేషన్, ఈసీల ఛార్జీలు, సేవా రుసుములను ఇష్టానుసారంగా పెంచేసి ప్రజల నడ్డి విరిశారు. -
అకాల వర్షాలతో రైతులకు ఇబ్బందులు : నిమ్మల
[ 18-05-2024]
సంచులు లేక ధాన్యం రాశులు అకాల వర్షాలకు తడుస్తున్నాయని, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. -
కూలీల కష్టం మాయం
[ 18-05-2024]
జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులో ఉపాధి పనులు చేస్తున్న కూలీల చిత్రానికి బదులు ఆన్లైన్లో గేదెల చిత్రం ఇటీవల అప్లోడ్ చేశారు. ఈ శాఖలో ఉన్న నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనుల అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. -
పుస్తకాలు లేకుండా చదువులా?
[ 18-05-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు సమస్యలే చదువుతున్నారు. -
జలమే.. గరళం..!
[ 18-05-2024]
ఆ గిరిజన గ్రామాల్లో జలమే గరళమవుతోంది. దప్పిక తీర్చే నీరే అక్కడి ప్రజల ప్రాణాలు హరిస్తోంది. -
నేత్రపర్వంగా శాంతి కల్యాణం
[ 18-05-2024]
భీమవరం డీఎన్నార్ కళాశాల ప్రాంగణంలోని గన్నాబత్తుల క్రీడా మైదానంలో అతిరాత్ర మహాయాగం మూడో రోజైన శుక్రవారం వైభవంగా కొనసాగింది. -
సామాజిక సందేశం.. ఆకట్టుకునే కథాంశం!
[ 18-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటిక పోటీలు ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్నాయి. -
విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి
[ 18-05-2024]
పెదపాడు మండలం కొనికిలో చేపల చెరువు వద్ద పనిచేసే యువకుడు విద్యుదాఘాతంతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు పెదపాడు ఎస్సై కె.శుభశేఖర్ తెలిపారు. -
అతిసార బాధితులకు కొనసాగుతున్న చికిత్స
[ 18-05-2024]
మండలంలోని కురుములతోగు, కొత్తూరుదేశయ్యగుంపు గ్రామాలకు చెందిన తొమ్మిది మంది గిరిజనులకు భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
దొరికినా నేరం కాదట!
-
కనిపించని పోలింగ్ దస్త్రాలు?
-
ఎన్నికల పారితోషికం.. ఎందుకింత వ్యత్యాసం
-
పాపాలను పాతరేస్తారా.. తోడేళ్లకు తోడవుతారా?
-
కోనసీమలో అభ్యర్థుల ఆధిక్యంపై ఆసక్తి.. ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగ్లు
-
పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం .. ఐదుగురి మృతి