అంతా గందరగోళం
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని.. అర్హులందరూ నిర్భయంగా, ఇబ్బంది లేకుండా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనువైన పరిస్థితులు కల్పించామని అధికారులు ఊదరగొడుతున్నారు.
తపాలా ఓటింగ్పై కొరవడిన స్పష్టత
ఉద్యోగుల ఆందోళన
ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు సర్దిచెబుతున్న ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వో ముక్కంటి
ఏలూరు అర్బన్, న్యూస్టుడే: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని.. అర్హులందరూ నిర్భయంగా, ఇబ్బంది లేకుండా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనువైన పరిస్థితులు కల్పించామని అధికారులు ఊదరగొడుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బంది ఈ నెల 4, 5 తేదీల్లో తపాలా బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఉండగా.. అధికారుల తీరుతో గందరగోళం నెలకొని వారు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
నిబంధనలకు తూట్లు: ఏలూరులోని ఫెసిలిటేషన్ కేంద్రం బయట ఎన్నికల ప్రచారం చేస్తున్న వైకాపా వర్గీయులు
- ఉద్యోగులు తపాలా ఓటుకు ఎక్కడ దరఖాస్తు చేశారో అక్కడికే వెళ్లి ఓటు వేయాలని, పనిచేసే చోటే ఓటు వేయాలని చెప్పడంతో సమస్య మొదలైంది. ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రానికి శనివారం పెద్ద సంఖ్యలో సిబ్బంది వచ్చారు. బ్యాలెట్ వినియోగించుకోవాలని చూస్తే వివరాలు ఇక్కడ లేవంటూ అధికారులు చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఎన్నికల సిబ్బందికి ఈ నెల 4, 5 తేదీల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వీటికి హాజరు కావాలా? లేక ఓటు వేయడానికి తాము పనిచేసే ప్రాంతాలకు వెళ్లాలా? అనే సందిగ్ధంలో పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే భావనతో ఉద్దేశపూర్వకంగా తపాలా బ్యాలెట్ విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు.
వేచి ఉన్న ఉద్యోగులు
- ఏలూరుతో పాటు జిల్లాలోని ఇతర ఫెసిలిటేషన్ కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అన్నిచోట్లా ఉద్యోగులు ఆందోళనలు చేశారు. తమకు కేటాయించిన ఫెసిలిటేషన్ కేంద్రాల్లోనే ఓటు వేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తమకు ఓటున్న ప్రాంతంలో కాకుండా పనిచేసే చోటుకు వెళ్లి ఓటు వేయాలని చెప్పడం సరికాదని అంటున్నారు. ఏలూరులోని ఫెసిలిటేషన్ కేంద్రానికి కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ వచ్చి మౌలిక వసతుల తీరును పరిశీలించారు. ఉద్యోగులు పని చేసే చోట తపాలా బ్యాలెట్ వేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తపాలా బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులందరికీ తప్పనిసరిగా అవకాశం కల్పిస్తామన్నారు.
ఏలూరు గ్రామీణ, కలెక్టరేట్, న్యూస్టుడే: ఏలూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5690 మంది ఉద్యోగులు తపాలా బ్యాలెట్ వినియోగించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాల మీదకొచ్చినా స్పందించరా?
[ 17-05-2024]
ఏజెన్సీలో అతిసారం విజృంభిస్తోంది. కలుషిత నీరు గిరిపుత్రుల ప్రాణాలు తోడేస్తోంది. కుక్కునూరు మండలంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. గుక్కెడు తాగునీటికి నోచుకోక చెలమల్లోని మురికి నీరు తాగుతున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవటమే ఈ మరణాలకు కారణమైంది. -
ఆగని అరాచకపర్వం
[ 17-05-2024]
పోలింగ్ నాడు వైకాపా మూకలు చేసిన విధ్వంసకాండ..వారు గత అయిదేళ్లుగా చేస్తున్న అరాచకాలకు పరాకాష్ఠగా నిలిచింది. పచ్చని పశ్చిమలో నెత్తుటి ఛాయలు చూపించింది. ఓటమి భయం ఆవరించటంతో తెదేపా కార్యకర్తలు, నాయకులపై దాడులకు తెగబడటమే లక్ష్యంగా పని చేశారు. -
కలిసి రాని కొబ్బరి!
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలో 55 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉంది. పెదవేగి, యలమంచిలి మండలాలు కొబ్బరిసాగులో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఉద్యానంలో పెద్దపంటగా భావించే కొబ్బరిలో తెగుళ్ల బెడద తీవ్రస్థాయికి చేరింది. -
తేమ పేరుతో కోత
[ 17-05-2024]
ఆరుగాలం శ్రమించి పంట పండించిన అన్నదాతలు అమ్ముకోవాలంటే అష్టకష్టాలు తప్పడం లేదు. ఏదో రీతిన దోచుకోవడానికి దళారులే కాదు మిల్లర్లూ సిద్ధమయ్యారు. -
ఈఏపీ సెట్ ప్రారంభం
[ 17-05-2024]
ఈఏపీ సెట్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఉదయం జరిగిన అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షకు మొత్తం 175 మంది హాజరు -
పది సప్లిమెంటరీకి సన్నద్ధతేదీ ?
[ 17-05-2024]
ఉంగుటూరు మండలం కైకరం జడ్పీ ఉన్నత పాఠశాలలో 118 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాయగా 66 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు వచ్చాక వీరికి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. -
అర్ధరాత్రి ఇసుక దందా
[ 17-05-2024]
అనుమతులు ఉన్నాయంటూ ఒకలా, లేకుంటే మరోలా జిల్లాలో ఇసుక దందా సాగుతోంది. ఆచంట మండలం కరుగోరుమిల్లిలో ఇటీవల ఇసుక ర్యాంపు ఏర్పాటు చేశారు. -
నెత్తురోడిన రహదారులు
[ 17-05-2024]
ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని రహదారులు గురువారం రక్తమోడాయి. వివిధ ప్రాంతాల్లో జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ముగ్గురు తీవ్రగాయాలతో ఆసుపత్రుల్లో చేరారు. -
కొప్పులవారిగూడెం ఘటనపై పోలీసుల అత్యుత్సాహం
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో(ఈ నెల 13న) పెదవేగి మండలం కొప్పులవారి గూడెంలో జరిగిన ఘటనపై పెదవేగి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఎన్డీయే దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. -
లారీ ఢీకొని తల్లి మృతి.. ప్రాణాపాయ స్థితిలో కుమార్తె
[ 17-05-2024]
లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో తల్లి ఘటనా స్థలంలోనే మృతిచెందగా కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన దుర్ఘటన గురువారం ఉదయం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
ముగ్గురు బందీల మృతదేహాలు లభ్యం.. మృతుల్లో ఆ యువతి కూడా!
-
‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
-
నా కుమారున్ని మీకు అప్పగిస్తున్నాను: సోనియాగాంధీ
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
-
మళ్లీ భాజపా గెలిస్తే.. ఆ నేతలు కటకటాల్లోకే..: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు