‘నిషా’దం వెనుక జగన్
మద్యపానం నిషేధం విషయంలో జగన్ తీరు చూసి జనాలు ‘చెప్పేది శ్రీరంగనీతులు’.. అనే సామెత గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు మద్యాన్నే లేకుండా చేస్తానని నటనా చాతుర్యాన్ని ప్రదర్శించిన జగన్.. పీఠం ఎక్కాక మాట మార్చి..
ప్రజల ప్రాణాలతో వైకాపా సర్కారు చెలగాటం
ఆదాయం పెంచుకోవడమేపరమావధి
పేదల కుటుంబాల్లో మద్యం కల్లోలం
ఉమ్మడి జిల్లాలో మత్తులో దారుణాలు
ఈనాడు, భీమవరం, ఆచంట, ఏలూరు టూటౌన్, టి.నరసాపురం, న్యూస్టుడే
‘మందు దుకాణం లేని గ్రామం ఉందా అని అడుగుతున్నా.. ఫోన్ కొడితే ఇంటికి నీటి డబ్బా తీసుకు వస్తారో లేదో కాని మందు సీసా మాత్రం తీసుకొచ్చే పరిస్థితి ఉంది. మన ప్రభుత్వం వచ్చాక మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాం’
2018 జూన్ 15న ప్రతిపక్షనేతగా జగన్ చెప్పిన మాటలివి.
మద్యపానం నిషేధం విషయంలో జగన్ తీరు చూసి జనాలు ‘చెప్పేది శ్రీరంగనీతులు’.. అనే సామెత గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు మద్యాన్నే లేకుండా చేస్తానని నటనా చాతుర్యాన్ని ప్రదర్శించిన జగన్.. పీఠం ఎక్కాక మాట మార్చి.. మద్యాన్ని ఏరులై పారించి ఆడబిడ్డల పుస్తెలు తెంచేస్తున్నారు. నాసిరకం మందు తాగించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేస్తున్నారు. వైకాపా నాయకులతో విచ్చలవిడిగా బెల్టు షాపులు పెట్టించి రేయింబవళ్లు మద్యం అమ్మకాలు చేయిస్తున్నారు. మందుబాబులు మత్తులో చేసే దారుణాలతో కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి.
మద్యం చేస్తున్న మారణ హోమం
జీలుగుమిల్లిలో మద్యానికి డబ్బులు ఇవ్వటం లేదని ఓ యువకుడు తల్లి, చెల్లిపై దాడి చేశాడు. గతేడాది అర్ధరాత్రి ఏలూరులో ఓ బార్లో మద్యం తాగిన ఇద్దరు స్నేహితులు గొడవపడి ఓ వ్యక్తి మరొకరిపై మద్యం సీసాతో దాడి చేసి హత్య చేశాడు. ఏలూరు అమీనాపేటలో ఇద్దరు స్నేహితులు మద్యం మత్తులో గొడవపడి. ఒకరు మరొకరిని కర్రతో తల పై కొట్టి చంపాడు. పెంటపాడు మండలం ఆకుతీగ పాడుకు చెందిన అన్నదమ్ములకు వివాదం తలెత్తి అన్న..తమ్ముడిని చాకుతో పొడిచి చంపాడు. మద్యం మత్తులో వాహన ప్రమాదాలకు కారణమై మృతి చెందిన ఘటనలు తరచూ జరుగుతున్నాయి.
ప్రాణాలు తోడేస్తావా
మద్యం తాగి అనారోగ్యంపాలై ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు
ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాసిరకం మద్యం తాగి మందుబాబులు జీర్ణకోశ వ్యాధులతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా ఆసుపత్రి పాలైన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏలూరు ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య నెలకు 40కి చేరింది. గతంతో పోల్చితే మూడింతలు పెరిగింది. ప్రస్తుతం ఒక జీర్ణకోశ సంబంధ ప్రైవేటు ఆసుపత్రిలో ఓపీ 700కు ఉంటే అందులో 300 మంది వరకు మద్యంతో అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తున్నారు. వీరంతా నాసిరకం మద్యం తాగటమే కారణమని వైద్యులు చెబుతున్నారు.
గుట్టుగా.. గొలుసు కట్టుగా
కొవ్వలిలో పాఠశాల ఎదురుగా ఉన్న దుకాణంలో మద్యం విక్రయాలు
దుకాణాల్లో మద్యాన్ని సిబ్బందే గుట్టుగా తరలించి వేరే వ్యక్తుల ద్వారా విక్రయాలు చేస్తున్నారు. వారంతా వైకాపా నాయకుల అనుచరులే కావటంతో అధికారులు పట్టించుకోవటం లేదు. రెండేళ్ల క్రితం ఏలూరులోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి సిబ్బంది భారీగా మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బెల్టు దుకాణాలు లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. కిళ్లీ, చిల్లర దుకాణాలు, పాల డెయిరీలు, బడ్డీ కొట్లు ఇలా అన్ని చోట్ల మద్యం వైకాపా నాయకుల అనుచరుల ద్వారానే అమ్మకాలు జరుగుతున్నాయి. దెందులూరు మండలం కొవ్వలిలో పాఠశాల ముందు, ఆలయం పక్కన, సచివాలయానికి ఆనుకుని చిన్న దుకాణాల్లో రేయింబవళ్లు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి.
ఇల్లు ఒల్లు గుల్ల
ఉమ్మడి పశ్చిమలో ప్రభుత్వ మద్యం దుకాణాలు 334
ప్రస్తుతం రోజుకు జీర్ణకోశ వ్యాధులతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య 700
వారిలో మద్యపానంతో ఆసుపత్రిపాలవుతున్న వారు 300
అనాథలయ్యాం
‘నా భర్త కోరుకొండ వెంకన్నబాబు ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్గా పనిచేసేవారు. మద్యానికి బానిసయ్యారు. అనారోగ్య సమస్యలు తలెత్తి రెండేళ్ల కిందట ప్రాణాలు కోల్పోయారు. వైద్య నిమిత్తం ఎంతో సొమ్ము ఖర్చు చేశాం. కుటుంబానికి ఆధారం లేక, నేను ఇద్దరు పిల్లలు అనాథలమయ్యాం’ అని బొర్రంపాలేనికి చెందిన నాగేశ్వరమ్మ వాపోయింది.
పెద్ద దిక్కు కోల్పోయాం
‘మాది చిన్నపాటి రైతు కుటుంబం. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడికి వివాహాలు చేశాం. సాఫీగా సాగే మాకుటుంబంలో మూడేళ్ల క్రితం భార్య, ఇద్దరు పిల్లలతో ఉన్న నా కుమారుడు అకస్మాత్తుగా మృతి చెందాడు. ఆ తర్వాత నా భర్త మద్యానికి బానిసయ్యారు. కాలేయం, కిడ్నీలు దెబ్బతిన్నాయి. వైద్యం నిమిత్తం రూ.లక్షలు వెచ్చించినా బతకలేదు’ అని వెలగపాడుకు చెందిన నరదల పుష్పరాజ్యం ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యసనమే ప్రాణాలు తీసింది
‘నేను, నా భర్త కూలిపనులు చేస్తూ ఇద్దరు పిల్లల్ని పెంచి వారికి పెళ్లిళ్లు కూడా చేశాం. నా భర్త సిద్ధియ్యను తాగొద్దని ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోలేదు. ఆయన సంపాదించినదంతా తాగుడుకే సరిపోయేది. చివరికి అనారోగ్యంతో మృతి చెందారు’ అని వెలగపాడుకు చెందిన పేరుబోయిన గంగమ్మ కన్నీటి పర్యంతమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటు తీసుకున్నోళ్లు బటన్ నొక్కలేదే!
[ 18-05-2024]
ఓటర్ల జాబితా చేతిలో ఉంది... వందశాతం ఓటుకు నోటు పంపిణీ చేశాం... ఇక గెలుపు మనదే అనుకున్నారు నాయకులందరూ. -
నాలుగు చినుకులు రాలితే నరకమే
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
పురం.. వానొస్తే కంపరం!
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
పల్లెదారులు.. పరమ ఛిద్రం
[ 18-05-2024]
రహదారులు ప్రగతికి చిహ్నాలు. కానీ అధికార యంత్రాంగం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. -
మేలు కంటే నష్టమే ఎక్కువ
[ 18-05-2024]
రిజిస్ట్రేషన్, ఈసీల ఛార్జీలు, సేవా రుసుములను ఇష్టానుసారంగా పెంచేసి ప్రజల నడ్డి విరిశారు. -
అకాల వర్షాలతో రైతులకు ఇబ్బందులు : నిమ్మల
[ 18-05-2024]
సంచులు లేక ధాన్యం రాశులు అకాల వర్షాలకు తడుస్తున్నాయని, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. -
కూలీల కష్టం మాయం
[ 18-05-2024]
జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులో ఉపాధి పనులు చేస్తున్న కూలీల చిత్రానికి బదులు ఆన్లైన్లో గేదెల చిత్రం ఇటీవల అప్లోడ్ చేశారు. ఈ శాఖలో ఉన్న నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనుల అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. -
పుస్తకాలు లేకుండా చదువులా?
[ 18-05-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు సమస్యలే చదువుతున్నారు. -
జలమే.. గరళం..!
[ 18-05-2024]
ఆ గిరిజన గ్రామాల్లో జలమే గరళమవుతోంది. దప్పిక తీర్చే నీరే అక్కడి ప్రజల ప్రాణాలు హరిస్తోంది. -
నేత్రపర్వంగా శాంతి కల్యాణం
[ 18-05-2024]
భీమవరం డీఎన్నార్ కళాశాల ప్రాంగణంలోని గన్నాబత్తుల క్రీడా మైదానంలో అతిరాత్ర మహాయాగం మూడో రోజైన శుక్రవారం వైభవంగా కొనసాగింది. -
సామాజిక సందేశం.. ఆకట్టుకునే కథాంశం!
[ 18-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటిక పోటీలు ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్నాయి. -
విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి
[ 18-05-2024]
పెదపాడు మండలం కొనికిలో చేపల చెరువు వద్ద పనిచేసే యువకుడు విద్యుదాఘాతంతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు పెదపాడు ఎస్సై కె.శుభశేఖర్ తెలిపారు. -
అతిసార బాధితులకు కొనసాగుతున్న చికిత్స
[ 18-05-2024]
మండలంలోని కురుములతోగు, కొత్తూరుదేశయ్యగుంపు గ్రామాలకు చెందిన తొమ్మిది మంది గిరిజనులకు భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..