వైకాపా అరాచకాలకు ముగింపు పలుకుదాం
‘వైకాపా అసమర్థతతో చింతలపూడి ఎత్తిపోతల పథకం నిలిచిపోయింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి చేసి నాగార్జున సాగర్ నీరు తీసుకొచ్చి మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా.
మెట్టను సస్యశ్యామలం చేస్తా
చింతలపూడి పూర్తి చేయడం నా కల
మల్లవల్లి పారిశ్రామిక పార్కును పునరుద్ధరిస్తాం
నూజివీడుకు అవుటర్ రింగ్రోడ్డు నిర్మిస్తాం
ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబు
వైకాపా పాలనలో భివృద్ధి జరిగిందా.. నిరుద్యోగ సమస్య తొలగిందా.. రైతులకు గిట్టుబాటు ధర అందిందా.. నిత్యావసరాల ధరలు అందుబాటులో ఉన్నాయా
అంటూ ప్రజలను చంద్రబాబు ప్రశ్నించారు... లేదంటూ ప్రజలు చెప్పిన సమాధానానికి నూజివీడు దద్దరిల్లింది. అయిదేళ్ల వైకాపా అరాచకాలకు ముగింపు పలికి ఓడించాలంటూ తెదేపా అధినేత పిలుపునిచ్చారు.
ఈనాడు, ఏలూరు, న్యూస్టుడే నూజివీడు రూరల్, పట్టణం, ముసునూరు: ‘వైకాపా అసమర్థతతో చింతలపూడి ఎత్తిపోతల పథకం నిలిచిపోయింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి చేసి నాగార్జున సాగర్ నీరు తీసుకొచ్చి మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా. మామిడికి, మొక్కజొన్న సాగుకు నీరు ఇస్తా. కమీషన్లు దండుకునేందుకు వైకాపా నాయకులు మల్లవల్లికి పారిశ్రామిక పార్కును పాడుపెట్టారు. తెదేపా అధికారంలోకి రాగానే పారిశ్రామిక ప్రగతిని పట్టాలెక్కిస్తా’ అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అమరావతిలో నూజివీడును భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. శనివారం నూజివీడు ప్రజాగళం సభలో జనసందోహాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
ఎమ్మెల్యే వల్ల ఒరిగిందేంటి.. ‘ఇక్కడ ఎమ్మెల్యే మూడుసార్లు గెలిచినా ఒక అభివృద్ధి పని చేసినట్లు మీకు గుర్తుందా. ఆయనకు తోడు కొడుకు తయారయ్యాడు తెదేపా కుటుంబ సభ్యులపై దాడులకు తెగబడుతున్నారు. వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నాది. ఇసుక, మట్టి, గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకున్నారు. చిన్న పనికి కూడా కమీషన్లు దండుకుంటున్నారు. ఆగిరిపల్లి మండలంలో క్వారీల్లో అక్రమాలు చేశారు. ముసునూరు మండలంలోని ఇసుక దోపిడీ చేసి రూ.కోట్లు దోచేశారు’ అంటూ చంద్రబాబు ఆరోపించారు.
అధినేతకు అపూర్వ స్వాగతం
తెదేపా అధినేత సాయంత్రం 4.30 గంటలకు నూజివీడు రోటరీ క్లబ్ దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకొని..నూజివీడు గాంధీబొమ్మ కూడలికి ర్యాలీగా వచ్చారు. దారి పొడవునా అధినేతకు తెదేపా, జనసేన, భాజపా నాయకులు స్వాగతం పలికారు. భారీగా చేరుకున్న ప్రజలు జై చంద్రబాబు అంటూ నినదించారు. మహిళలు హారతులు పట్టారు. ఆయన సభా ప్రాంగణానికి చేరుకునే సమయానికి ఆ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. దాదాపు 40 నిమిషాలు ఆయన ప్రసంగించారు. ఆయన కంటే ముందు నూజివీడు ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారథి, ఎంపీ అభ్యర్థి పుట్టా మహేశ్కుమార్ ప్రసంగించారు. తెదేపా నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నూజివీడును కృష్ణా జిల్లాలో కలుపుతాం
మాట్లాడుతున్న చంద్రబాబు, పక్కన మహేశ్ యాదవ్, పార్థసారథి
‘నూజివీడు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలన్న మీ కలను నెరవేరుస్తా. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా అవుటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తాం. గ్రామాల్లో డ్రెయిన్లు సమస్య పరిష్కరిస్తా. మల్లవల్లికి పరిశ్రమలు నేను తెచ్చా మీకు జ్ఞాపకం ఉందా తమ్ముళ్లు. నేనుంటే ఎన్ని పరిశ్రమలు ఇక్కడకు వచ్చేవి. ఎంత మంది యువతకు ఉపాధి లభించేది.. తన అవినీతి కోసం జగన్ రెడ్డి పెట్టుబడుదారులను తరిమేశారు. మీరంతా ఓటు వేసి ఎమ్మెల్యేగా పార్థసారథిని, ఎంపీˆగా మహేశ్యాదవ్ను గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు. అమరావతి రాజధాని అయి ఉంటే నూజివీడు నుంచి నేరుగా వెళ్లి ఉద్యోగం చేసి ఇంటికి వచ్చేవారు. అవుటర్ రింగ్ రోడ్ హనుమాన్జంక్షన్ వరకు ఉండేది. నేను వస్తూనే అమరావతికి పూర్వ వైభవం తీసుకుని వస్తా. నూజివీడు బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది అమరావతిలో ఒక భాగంగా ఉంటుంది. స్థానిక నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు సముచిత స్థానం కల్పిస్తాను’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
సభకు హాజరైన జనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటు తీసుకున్నోళ్లు బటన్ నొక్కలేదే!
[ 18-05-2024]
ఓటర్ల జాబితా చేతిలో ఉంది... వందశాతం ఓటుకు నోటు పంపిణీ చేశాం... ఇక గెలుపు మనదే అనుకున్నారు నాయకులందరూ. -
నాలుగు చినుకులు రాలితే నరకమే
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
పురం.. వానొస్తే కంపరం!
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
పల్లెదారులు.. పరమ ఛిద్రం
[ 18-05-2024]
రహదారులు ప్రగతికి చిహ్నాలు. కానీ అధికార యంత్రాంగం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. -
మేలు కంటే నష్టమే ఎక్కువ
[ 18-05-2024]
రిజిస్ట్రేషన్, ఈసీల ఛార్జీలు, సేవా రుసుములను ఇష్టానుసారంగా పెంచేసి ప్రజల నడ్డి విరిశారు. -
అకాల వర్షాలతో రైతులకు ఇబ్బందులు : నిమ్మల
[ 18-05-2024]
సంచులు లేక ధాన్యం రాశులు అకాల వర్షాలకు తడుస్తున్నాయని, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. -
కూలీల కష్టం మాయం
[ 18-05-2024]
జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులో ఉపాధి పనులు చేస్తున్న కూలీల చిత్రానికి బదులు ఆన్లైన్లో గేదెల చిత్రం ఇటీవల అప్లోడ్ చేశారు. ఈ శాఖలో ఉన్న నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనుల అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. -
పుస్తకాలు లేకుండా చదువులా?
[ 18-05-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు సమస్యలే చదువుతున్నారు. -
జలమే.. గరళం..!
[ 18-05-2024]
ఆ గిరిజన గ్రామాల్లో జలమే గరళమవుతోంది. దప్పిక తీర్చే నీరే అక్కడి ప్రజల ప్రాణాలు హరిస్తోంది. -
నేత్రపర్వంగా శాంతి కల్యాణం
[ 18-05-2024]
భీమవరం డీఎన్నార్ కళాశాల ప్రాంగణంలోని గన్నాబత్తుల క్రీడా మైదానంలో అతిరాత్ర మహాయాగం మూడో రోజైన శుక్రవారం వైభవంగా కొనసాగింది. -
సామాజిక సందేశం.. ఆకట్టుకునే కథాంశం!
[ 18-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటిక పోటీలు ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్నాయి. -
విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి
[ 18-05-2024]
పెదపాడు మండలం కొనికిలో చేపల చెరువు వద్ద పనిచేసే యువకుడు విద్యుదాఘాతంతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు పెదపాడు ఎస్సై కె.శుభశేఖర్ తెలిపారు. -
అతిసార బాధితులకు కొనసాగుతున్న చికిత్స
[ 18-05-2024]
మండలంలోని కురుములతోగు, కొత్తూరుదేశయ్యగుంపు గ్రామాలకు చెందిన తొమ్మిది మంది గిరిజనులకు భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం