రంగులు మారలే... ప్రలోభాలు తగ్గలే!
నరసాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు పట్టణంలోని ఎండీయూ ఆపరేటర్. ఆయన నిత్యం ప్రజాప్రతినిధులతో సన్నిహితంగా ఉంటారు. ఎన్నికల ప్రచారంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు.
వాహనాలపై జగన్ ఫొటో, నవరత్నాల లోగో
వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు ఎండీయూ ఆపరేటర్లు
ఎండీయూ వాహనం ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న ఓ ఆపరేటర్
నరసాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు పట్టణంలోని ఎండీయూ ఆపరేటర్. ఆయన నిత్యం ప్రజాప్రతినిధులతో సన్నిహితంగా ఉంటారు. ఎన్నికల ప్రచారంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎండీయూ ఆపరేటర్గా ఆయన ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందని ప్రతిపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు.
నరసాపురం మండలానికే చెందిన మరో వైకాపా నాయకుడు ఓ గ్రామంలో ఎండీయూ ఆపరేటర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన సైతం క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఆయన సైతం ప్రజలకు నిత్యావసర సరకులు పంపిణీ చేస్తుండటంతో... ఓటర్లను మభ్యపెట్టే అవకాశం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నరసాపురం (తూర్పుతాళ్లు), న్యూస్టుడే: వైకాపా అధికారంలోకి వచ్చాక... ఇంటింటి వద్దకే రేషన్ అంటూ ఎండీయూ వాహన వ్యవస్థను తీసుకొచ్చింది. ఇంటికే నిత్యావసర సరకులొస్తే... అంతకంటే కావాల్సింది ఏముంటుందని ప్రజలూ సంబరపడ్డారు. వైకాపా ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన వారినే వాహనాల నిర్వాహకులుగా నియమించారు. వీరు ఇంటి వద్దే లబ్ధిదారులకు సరకులు అందించాల్సి ఉండగా... వీధి చివరనో... గ్రామ కూడలిలోనో వాహనాలు నిలిపి.. ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేసేవారు. పశ్చిమగోదావరి జిల్లాలో 5.62 లక్షల మంది రేషన్కార్డుదారులుండగా, 356 ఎండీయూ వాహనాలను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఒకటో తేదీ నుంచి కార్డుదారులకు సరకులు పంపిణీ చేస్తున్నారు. ఎండీయూ వాహనాల ఆపరేటర్లంతా అధికార పార్టీ విధేయులు కావడంతో... వారంతా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.
ప్రభావాన్ని అడ్డుకునేదెవరు?
ప్రస్తుతం ఎండీయూ ఆపరేటర్లకు ప్రభుత్వం ప్రతినెలా గౌరవ వేతనంతోపాటు వాహనాల అద్దె చెల్లిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 17 వరకూ ఎండీయూ ఆపరేటర్లు నిత్యావసరాలు పంపిణీ చేయనున్నారు. వీరిలో కొందరు రేషన్ తీసుకునే ప్రజలను ప్రభావితం చేసి... వైకాపాకు అనుకూలంగా ఓట్లు వేయించుకునేలా కుట్ర చేస్తున్నారని ప్రతిపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు.
వాహనాలకూ వైకాపా రంగులే
నిత్యావసరాలు అందజేస్తున్న ఎండీయూ వాహనాలపైనా సీఎం జగన్ చిత్రంతోపాటు నవరత్నాల లోగో ఉంటోంది. దీనికితోడు వాహనానికి పార్టీ రంగులున్నాయని కూటమి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినా... సీఎం చిత్రం, నవరత్నాల లోగో, పార్టీ రంగులు కనిపించకుండా అధికారులు చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటు తీసుకున్నోళ్లు బటన్ నొక్కలేదే!
[ 18-05-2024]
ఓటర్ల జాబితా చేతిలో ఉంది... వందశాతం ఓటుకు నోటు పంపిణీ చేశాం... ఇక గెలుపు మనదే అనుకున్నారు నాయకులందరూ. -
నాలుగు చినుకులు రాలితే నరకమే
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
పురం.. వానొస్తే కంపరం!
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
పల్లెదారులు.. పరమ ఛిద్రం
[ 18-05-2024]
రహదారులు ప్రగతికి చిహ్నాలు. కానీ అధికార యంత్రాంగం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. -
మేలు కంటే నష్టమే ఎక్కువ
[ 18-05-2024]
రిజిస్ట్రేషన్, ఈసీల ఛార్జీలు, సేవా రుసుములను ఇష్టానుసారంగా పెంచేసి ప్రజల నడ్డి విరిశారు. -
అకాల వర్షాలతో రైతులకు ఇబ్బందులు : నిమ్మల
[ 18-05-2024]
సంచులు లేక ధాన్యం రాశులు అకాల వర్షాలకు తడుస్తున్నాయని, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. -
కూలీల కష్టం మాయం
[ 18-05-2024]
జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులో ఉపాధి పనులు చేస్తున్న కూలీల చిత్రానికి బదులు ఆన్లైన్లో గేదెల చిత్రం ఇటీవల అప్లోడ్ చేశారు. ఈ శాఖలో ఉన్న నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనుల అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. -
పుస్తకాలు లేకుండా చదువులా?
[ 18-05-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు సమస్యలే చదువుతున్నారు. -
జలమే.. గరళం..!
[ 18-05-2024]
ఆ గిరిజన గ్రామాల్లో జలమే గరళమవుతోంది. దప్పిక తీర్చే నీరే అక్కడి ప్రజల ప్రాణాలు హరిస్తోంది. -
నేత్రపర్వంగా శాంతి కల్యాణం
[ 18-05-2024]
భీమవరం డీఎన్నార్ కళాశాల ప్రాంగణంలోని గన్నాబత్తుల క్రీడా మైదానంలో అతిరాత్ర మహాయాగం మూడో రోజైన శుక్రవారం వైభవంగా కొనసాగింది. -
సామాజిక సందేశం.. ఆకట్టుకునే కథాంశం!
[ 18-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటిక పోటీలు ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్నాయి. -
విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి
[ 18-05-2024]
పెదపాడు మండలం కొనికిలో చేపల చెరువు వద్ద పనిచేసే యువకుడు విద్యుదాఘాతంతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు పెదపాడు ఎస్సై కె.శుభశేఖర్ తెలిపారు. -
అతిసార బాధితులకు కొనసాగుతున్న చికిత్స
[ 18-05-2024]
మండలంలోని కురుములతోగు, కొత్తూరుదేశయ్యగుంపు గ్రామాలకు చెందిన తొమ్మిది మంది గిరిజనులకు భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా