ఈసురోమని... ఈ-శ్రమ్
దేశంలో అసంఘటిత రంగంలోని కార్మికుల వివరాల సేకరణ, వారి సంక్షేమానికి ఉద్దేశించిన ఈ-శ్రమ్ నమోదు జిల్లాలో మందకొడిగా సాగుతోంది. జిల్లాకు చెందిన లక్షల మంది కార్మికులు ఉపాధి పనుల కోసం వివిధ దేశాలు, రాష్ట్రాలకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు.
నమోదులో జాప్యం
చివరి స్థానంలో జిల్లా
ఈ నెలాఖరు వరకే గడువు
రాయచోటిలో ఓ కాలనీలో కార్మికుల పేర్ల నమోదు
అట్లూరు, బద్వేలు, న్యూస్టుడే : దేశంలో అసంఘటిత రంగంలోని కార్మికుల వివరాల సేకరణ, వారి సంక్షేమానికి ఉద్దేశించిన ఈ-శ్రమ్ నమోదు జిల్లాలో మందకొడిగా సాగుతోంది. జిల్లాకు చెందిన లక్షల మంది కార్మికులు ఉపాధి పనుల కోసం వివిధ దేశాలు, రాష్ట్రాలకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో రవాణా సౌకర్యాలు స్తంభించటంతో లక్షల మంది కార్మికులు కాలినడకన స్వస్థలాలకు తరలి వెళ్లారు. ఈ నేపథ్యంలో కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు సూచనలతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. అసంఘటిత కార్మికులను సంఘటితం చేయటానికి కసరత్తు ప్రారంభమైంది. దీనికి ఈ-శ్రమ్ పోర్టల్ తీసుకువచ్చింది. దీని ద్వారా ఉచితంగా పేర్లను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా కూడా స్వయంగా నమోదు చేసుకోవచ్ఛు సీఎస్సీ, గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ నమోదుకు అవకాశం ఉంది. ఈ విధానం కింద నమోదైన కార్మికులు ప్రమాదాల బారినపడితే రూ. 2 లక్షల వరకు బీమా పొందవచ్ఛు ఈ ప్రక్రియ జిల్లాలో నాలుగు నెలలుగా సాగుతోంది. అయినా నత్తనడకన సాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఈ-శ్రమ్ నమోదులో తూర్పు గోదావరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. చిట్టచివర (12) స్థానంలో కడప ఉండటం గమనార్హం.
లక్ష్యం 8.45 లక్షల మంది.. జిల్లాలో అసంఘటిత కార్మికులు 8.45 లక్షల మంది ఉన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 60,707 మంది మాత్రమే ఈ-శ్రమ్లో నమోదై ఉన్నారు. జిల్లావ్యాప్తంగా సీఎస్సీ కేంద్రాల ద్వారానే ఎక్కువగా కార్మికుల నమోదు సాగుతోంది. వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, కూరగాయల విక్రేతలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధి కూలీలు ఇలా సుమారు 75 రకాల రంగాల్లో పనులు చేసేవారందరూ అర్హులే. దీనికి ఆధార్, బ్యాంకు అకౌంటు, చరవాణి సంఖ్య ఆధారంగా నమోదు చేసుకోవచ్ఛు ఆధార్ను పోలిన ఈ-శ్రమ్ కార్డు వస్తుంది. జిల్లావ్యాప్తంగా ఈ పథకం నమోదు దశలో ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు అనర్హులు. సభ్యత్వం పొందటానికి 18-59 ఏళ్ల వయసున్న అందరూ అర్హులే. సీఎస్సీల ద్వారా చేపట్టిన నమోదులో ఎలాంటి రుసుంలు లేవు.l జిల్లాలో 8 లక్షల మందికి పైగా కార్మికులు ఉన్నా నమోదుకు మొగ్గుచూపడం లేదు. పొట్టచేతబట్టి పనుల కోసం జిల్లాలో గ్రామాల నుంచి బెంగళూరు, హైదరాబాదు, చెన్నై తదితర పట్టణాలకు సుమారు 2 లక్షల మంది పైగా వెళ్లి ఉన్నారు. వీరంతా ఈ-శ్రమ్లో నమోదైతే ఉచితంగానే ప్రమాద బీమా పొందే వెసులుబాటు ఉంది. గ్రామ వాలంటీర్లు ఈ-శ్రమ్ నమోదులో క్రియాశీలకంగా వ్యవహరించటంలేదన్న విమర్శలు వస్తున్నాయి.
స్వచ్ఛందంగా వస్తున్నారు... - ఆదూరి గణేష్ కార్మిక శాఖాధికారి, కడప
ఈ-శ్రమ్ నమోదుకు గ్రామాల నుంచి కూడా స్పందన కనిపిస్తోంది. నమోదుకు కార్మికులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. జిల్లాలో ఎన్నికలు, వర్షాల ప్రభావంతో ప్రక్రియలో కాసింత జాప్యం చోటుచేసుకుంటోంది. ప్రొద్దుటూరు, కడప, రాయచోటి ప్రాంతాల్లో నమోదు చురుగ్గా జరుగుతోంది. సీఎస్సీ నిర్వాహకుల ద్వారా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి నమోదు చేయిస్తున్నాం. కార్మికుల సంక్షేమంపై విధివిధానాలు తొందర్లో రూపొందిస్తారు. గతంలో సాంకేతిక కారణాలు వెంటాడినా ప్రస్తుతం అన్నీ అనుకూలంగా ఉన్నాయి. లక్ష్యాన్ని తప్పనిసరిగా నిర్ణీత సమయంలో చేరుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాయ్ రాజా కాయ్!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. వచ్చే నెల 4న అభ్యర్థుల భవితవ్యం వెల్లడి కానుంది. విజయం ఎవరిని వరిస్తుందనే చర్చ సర్వత్రా నడుస్తోంది. మరో వైపు గెలుపు ఓటములపై బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. -
బ్రహ్మరథంపై వీరబ్రహ్మేంద్రస్వామి దివ్యదర్శనం
[ 19-05-2024]
శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజా మహోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన మహాబ్రహ్మ రథోత్సవం శనివారం సాయంత్రం బ్రహ్మంగారిమఠంలోని మాడ వీధుల్లో నేత్రపర్వంగా సాగింది. -
వంగిపోయారా? లొంగిపోయారా?
[ 19-05-2024]
ఎన్నికల పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తున్న తరుణంలో ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తమ శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఎన్నికల సంఘం దృష్టి సారించక ముందే బాధ్యులపై చర్యలకు కసరత్తు ప్రారంభించారు. -
భూసార పరీక్షలపై శీతకన్ను!
[ 19-05-2024]
వేసవిలో భూసార పరీక్షలను యజ్ఞంలా చేయాలనే మాటను అపద్ధర్మ ప్రభుత్వం విస్మరించింది. పూర్తిగా శీతకన్ను వేసింది. గతేడాది మట్టి నమూనాలను సేకరించారు. యంత్ర సామగ్రి, రసాయనాల కొనుగోలు చేయడానికి నిధులివ్వకపోవడంతో విశ్లేషణ చేయకుండా పక్కన పెట్టేశారు. -
నిలిచిన ఇసుక తవ్వకాలు
[ 19-05-2024]
అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. ప్రొద్దుటూరు పరిసరాల్లో మాత్రం వైకాపా కీలక నేతలు తవ్వకాలు కొనసాగిస్తుండగా అధికారులు పట్టించుకోవడంలేదు. -
గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే బాధితులకు అందని పరిహారం
[ 19-05-2024]
తమకు పరిహారం అందకపోవడంతో బెంగళూరు-విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులను అడ్డుకుంటామని బాధిత రైతులు హెచ్చరించారు. -
సుప్రీంకోర్టు ఉత్తర్వులు హర్షనీయం
[ 19-05-2024]
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై మాట్లాడ వద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులివ్వడం హర్షనీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా సెల్ విభాగం ఛైర్మన్ తులసిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమి కబ్జా
[ 19-05-2024]
సిద్దవటం మండలం టక్కోలు గ్రామ సచివాలయం సమీపంలో రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమిని స్థానిక వైకాపా నేత కబ్జా చేసి రాత్రికిరాత్రే మామిడి మొక్కలు నాటారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ భూకబ్జా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
తెలంగాణ ఈఏపీసెట్లో మెరిసిన మదనపల్లె విద్యార్థిని
[ 19-05-2024]
లక్ష్యం, పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చునని నిరూపించింది మదనపల్లెకు చెందిన ప్రణీత. తెలంగాణ ఈఏపీసెట్లో అగ్రికల్చర్ ఫార్మశీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకుంటోంది. -
ఆగడంలేదు... ఆపడంలేదు!
[ 19-05-2024]
మదనపల్లెలో వైకాపా నేతల అండదండలతో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ఇసుక దందా సాగిస్తున్నారు. నదులు, వంకలు, చెరువుల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు, రవాణా కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానం!
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
-
చిరంజీవిని కలిసిన గంటా
-
భూమి రాసివ్వకపోతే చంపేస్తామన్నారు.. సినీఫక్కీలో ఆలయ పూజారి కిడ్నాప్
-
పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్!
-
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం