‘పులివెందుల నియోజకవర్గం బీసీలకు కేటాయిస్తారా’
పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయించి తర్వాత చంద్రబాబునాయుడిను విమర్శించాలని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు హరిప్రసాద్, గోవర్ధన్రెడ్డి, సీనియర్ నాయకుడు లక్ష్మీరెడ్డి తదితరులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి
మాట్లాడుతున్న నేతలు గోవర్ధన్రెడ్డి, హరిప్రసాద్, మూర్తి తదితరులు
అరవిందనగర్ (కడప), న్యూస్టుడే : పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయించి తర్వాత చంద్రబాబునాయుడిను విమర్శించాలని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు హరిప్రసాద్, గోవర్ధన్రెడ్డి, సీనియర్ నాయకుడు లక్ష్మీరెడ్డి తదితరులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి సూచించారు. తెదేపా జిల్లా కార్యాలయంలో శనివారం లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీఎస్మూర్తితో కలిసి విలేకరులతో మాట్లాడారు. వైకాపాలో ఉమ్మడి జిల్లా నుంచి ఒకే సామాజిక వర్గానికి తప్ప మరెవ్వరికీ సీట్లు ఇవ్వలేదన్న విషయాన్ని మరిచినట్లున్నారన్నారు. బద్వేలు, రైల్వేకోడూరు రెండూ ఎస్సీలకు కేటాయించినందన వారికి అవకాశం కల్పించారే తప్ప మరెక్కడా ఏ కులానికి కేటాయించలేదని విమర్శించారు. వైకాపాలో సామాజిక న్యాయం ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు. మైదుకూరు, రాజంపేట, కడప, రాయచోటి నియోజకవర్గాలను తెదేపా బలిజలు, బీసీలకు కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మరిచినట్లున్నారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. సమావేశంలో తెదేపా నాయకులు గుర్రప్ప, శివశంకర్రెడ్డి, జనార్దన్, సుబ్బారెడ్డి, కొమ్మలపాటి సురేష్, శ్రీనివాసులు, ఆదినారాయణరావు, ఓబులేసు, అమీర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడి రాజ్యం.. ఆరోగ్యశ్రీకి అనారోగ్యం...!
[ 27-04-2024]
కడప నగరానికి చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. -
మరుపురానిది ‘జగనాసుర రక్తచరిత్ర’!
[ 27-04-2024]
‘జగనాసుర రక్తచరిత్ర’ మరుపురానిదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో జరిగిన అరాచకాలు చరిత్రకెక్కుతాయని వివరించారు. -
జగన్ హామీకి తొండి... పరిహారానికి గండి..!
[ 27-04-2024]
కొండాపురం మండలంలో పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట 26.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గండికోట జలాశయం నిర్మించడంతో కొండాపురం, ముద్దనూరు మండలాల పరిధిలోని 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. -
న్యాయం చేస్తానన్నావ్...సాయం చేయకున్నావ్...!
[ 27-04-2024]
సోమశిల వెనుక జలాలతో ముంపు గ్రామాల ప్రజలు అధైర్యపడొద్దు. మీకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరంతా సంతృప్తి చెందేలా పునరావాస ప్యాకేజీ వర్తింపజేస్తాం. -
నేత్రపర్వంగా పురుషోత్తముడికి పుష్పాభిషేకం
[ 27-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం పురుషోత్తముడి పుష్పాభిషేకం నేత్రపర్వంగా సాగింది. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. కడప పార్లమెంట నియోజకవర్గానికి సంబంధించి 32 నామపత్రాలు దాఖలు కాగా 14 ఆమోదించారు. -
30న పీలేరు, మైదుకూరులలో సీఎం జగన్ బహిరంగ సభలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు, పీలేరులో ఈ నెల 30న నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. -
పెద్దిరెడ్డి కుటుంబాన్ని సాగనంపండి
[ 27-04-2024]
రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని, ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
ఆపు నీ డప్పు... ఇవ్వు మా డబ్బు!
[ 27-04-2024]
జిల్లాలో గతేడాది మిగ్జాం తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందే అవకాశాలు కనిపించట్లేదు. -
క్షణం క్షణం... భయం భయం
[ 27-04-2024]
ఇళ్లలో ఉంటే విద్యుత్తు తీగలు ఎప్పుడు కింద పడుతాయోననే భయం.. ఆరుబయటికి వస్తే పిల్లలు తెలియక తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తాకి ప్రమాదాల బారిన పడుతారేమోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.