పనితీరు మారకుంటే చర్యలు తప్పవు : సీఎండీ
విద్యుత్తు యంత్రాంగం తమ పనితీరును మార్చుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు హెచ్చరించారు.
మాట్లాడుతున్న ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు, వేదికపై
సీజీఎం ధర్మజ్ఞాని, ఓఎస్డీ శ్రీనివాసులు, ఎస్ఈ మునిశంకరయ్య
కడప గ్రామీణ, న్యూస్టుడే : విద్యుత్తు యంత్రాంగం తమ పనితీరును మార్చుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు హెచ్చరించారు. జిల్లాకు వచ్చిన ఆయన గురువారం జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పలుచోట్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, ఇదివరకే అనేక అవకాశాలు ఇచ్చామని, ఇప్పటికైనా మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. వినియోగదారుల సేవల కోసమే మనందరం ఉన్నామన్న విషయం గుర్తుంచుకుని జాగ్రత్తగా పనిచేయాలని సూచించారు. ప్రమాణాల ప్రకారం సేవలు సకాలంలో పూర్తి చేయలేని పక్షంలో సంబంధిత అధికారులు వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సి వస్తుందన్నారు. వాలిన స్తంభాలను, లూజు తీగలను సరిచేయాలని ఆదేశించారు. విద్యుత్తు నియంత్రికల వైఫల్యాలను నియంత్రించాలన్నారు. సంస్థ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు బకాయిలు వసూలు చేయాలని ఆదేశించారు. రైతులకు పగటి పూటే విద్యుత్తు ఇవ్వాలని స్పష్టం చేశారు. జగనన్న కాలనీల్లో విద్యుత్తు మీటర్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం విద్యుత్తు ఉద్యోగుల సామాజిక సేవాసంఘం దశమ వార్షికోత్సం సందర్భంగా కాలమానిని ఆవిష్కరించారు. అంతకు ముందు అనాథాశ్రమంలో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. సమావేశంలో సీజీఎం ధర్మజ్ఞాని, ఓఎస్డీ శ్రీనివాసులు, ఎస్ఈ మునిశంకరయ్య, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల సీనియర్ అకౌంట్ అధికారులు, ఈఈలు, డీఈలు, ఏఈలు, విద్యుత్తు ఉద్యోగుల సామాజిక సేవాసంఘం సంఘ అధ్యక్షుడు నాగరాజు, ప్రధానకార్యదర్శి చలపతి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఫయాజ్, కోశాధికారి రఘు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడి రాజ్యం.. ఆరోగ్యశ్రీకి అనారోగ్యం...!
[ 27-04-2024]
కడప నగరానికి చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. -
మరుపురానిది ‘జగనాసుర రక్తచరిత్ర’!
[ 27-04-2024]
‘జగనాసుర రక్తచరిత్ర’ మరుపురానిదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో జరిగిన అరాచకాలు చరిత్రకెక్కుతాయని వివరించారు. -
జగన్ హామీకి తొండి... పరిహారానికి గండి..!
[ 27-04-2024]
కొండాపురం మండలంలో పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట 26.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గండికోట జలాశయం నిర్మించడంతో కొండాపురం, ముద్దనూరు మండలాల పరిధిలోని 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. -
న్యాయం చేస్తానన్నావ్...సాయం చేయకున్నావ్...!
[ 27-04-2024]
సోమశిల వెనుక జలాలతో ముంపు గ్రామాల ప్రజలు అధైర్యపడొద్దు. మీకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరంతా సంతృప్తి చెందేలా పునరావాస ప్యాకేజీ వర్తింపజేస్తాం. -
నేత్రపర్వంగా పురుషోత్తముడికి పుష్పాభిషేకం
[ 27-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం పురుషోత్తముడి పుష్పాభిషేకం నేత్రపర్వంగా సాగింది. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. కడప పార్లమెంట నియోజకవర్గానికి సంబంధించి 32 నామపత్రాలు దాఖలు కాగా 14 ఆమోదించారు. -
30న పీలేరు, మైదుకూరులలో సీఎం జగన్ బహిరంగ సభలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు, పీలేరులో ఈ నెల 30న నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. -
పెద్దిరెడ్డి కుటుంబాన్ని సాగనంపండి
[ 27-04-2024]
రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని, ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
ఆపు నీ డప్పు... ఇవ్వు మా డబ్బు!
[ 27-04-2024]
జిల్లాలో గతేడాది మిగ్జాం తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందే అవకాశాలు కనిపించట్లేదు. -
క్షణం క్షణం... భయం భయం
[ 27-04-2024]
ఇళ్లలో ఉంటే విద్యుత్తు తీగలు ఎప్పుడు కింద పడుతాయోననే భయం.. ఆరుబయటికి వస్తే పిల్లలు తెలియక తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తాకి ప్రమాదాల బారిన పడుతారేమోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే