అనుమానాస్పదస్థితిలో యువకుడు...
మండల పరిధి ఊటుకూరు సమీపంలో మైదుకూరు మండలం గంజిగుంట గ్రామానికి చెందిన యువకుడు చిన్ననూరు నాగరాజు (30) అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు బాధ్య ఎస్సై రాజరాజేశ్వర్రెడ్డి తెలిపారు.
చింతకొమ్మదిన్నె, న్యూస్టుడే : మండల పరిధి ఊటుకూరు సమీపంలో మైదుకూరు మండలం గంజిగుంట గ్రామానికి చెందిన యువకుడు చిన్ననూరు నాగరాజు (30) అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు బాధ్య ఎస్సై రాజరాజేశ్వర్రెడ్డి తెలిపారు. నాగరాజు టిప్పర్ డ్రైవర్గా పనిచేసేవారు. ఇతనికి వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. శుక్రవారం టిప్పర్ను తీసుకొచ్చి ఊటుకూరు సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో పెట్టారు. సమీపంలోని ఖాళీ స్థలంలో శనివారం శవమై కనిపించారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని ఎస్సై రాజరాజేశ్వర్రెడ్డి పరిశీలించారు. అతని వద్ద పురుగుల మందు కొనుగోలు చేసిన చీటి ఉందని, విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
అంబులెన్స్ బోల్తా ... మహిళ మృతి
కడప నేరవార్తలు, న్యూస్టుడే : అత్యవసర వైద్యం కోసం ఓ మహిళను కడపకు తీసుకొస్తుండగా అదుపుతప్పి అంబులెన్స్ బోల్తాపడింది. మహిళకు తీవ్రగాయాలై మృతిచెందారు. ఈ ఘటన కడప తాలూకా పరిధిలో శనివారం చోటుచేసుకుంది. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి (59) అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెను జమ్మలమడుగులోని క్యాంబెల్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి సంబంధించిన అంబులెన్స్లో కడపకు తీసుకొస్తుండగా ఆలంఖాన్పల్లె సమీపంలోని దండు వద్దకు రాగానే ముందు వెళ్తున్న వాహనం దారివ్వకపోవడంతో డ్రైవరు ఉన్నఫలంగా బ్రేకులు వేశారు. దీంతో అంబులెన్సు అదుపు తప్పి బోల్తా పడింది. తీవ్రంగ గాయపడిన లక్ష్మీదేవిని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆమె భర్త సుబ్బరాయుడు, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడి రాజ్యం.. ఆరోగ్యశ్రీకి అనారోగ్యం...!
[ 27-04-2024]
కడప నగరానికి చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. -
మరుపురానిది ‘జగనాసుర రక్తచరిత్ర’!
[ 27-04-2024]
‘జగనాసుర రక్తచరిత్ర’ మరుపురానిదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో జరిగిన అరాచకాలు చరిత్రకెక్కుతాయని వివరించారు. -
జగన్ హామీకి తొండి... పరిహారానికి గండి..!
[ 27-04-2024]
కొండాపురం మండలంలో పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట 26.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గండికోట జలాశయం నిర్మించడంతో కొండాపురం, ముద్దనూరు మండలాల పరిధిలోని 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. -
న్యాయం చేస్తానన్నావ్...సాయం చేయకున్నావ్...!
[ 27-04-2024]
సోమశిల వెనుక జలాలతో ముంపు గ్రామాల ప్రజలు అధైర్యపడొద్దు. మీకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరంతా సంతృప్తి చెందేలా పునరావాస ప్యాకేజీ వర్తింపజేస్తాం. -
నేత్రపర్వంగా పురుషోత్తముడికి పుష్పాభిషేకం
[ 27-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం పురుషోత్తముడి పుష్పాభిషేకం నేత్రపర్వంగా సాగింది. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. కడప పార్లమెంట నియోజకవర్గానికి సంబంధించి 32 నామపత్రాలు దాఖలు కాగా 14 ఆమోదించారు. -
30న పీలేరు, మైదుకూరులలో సీఎం జగన్ బహిరంగ సభలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు, పీలేరులో ఈ నెల 30న నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. -
పెద్దిరెడ్డి కుటుంబాన్ని సాగనంపండి
[ 27-04-2024]
రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని, ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
ఆపు నీ డప్పు... ఇవ్వు మా డబ్బు!
[ 27-04-2024]
జిల్లాలో గతేడాది మిగ్జాం తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందే అవకాశాలు కనిపించట్లేదు. -
క్షణం క్షణం... భయం భయం
[ 27-04-2024]
ఇళ్లలో ఉంటే విద్యుత్తు తీగలు ఎప్పుడు కింద పడుతాయోననే భయం.. ఆరుబయటికి వస్తే పిల్లలు తెలియక తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తాకి ప్రమాదాల బారిన పడుతారేమోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.