సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం
అపరిష్కృతంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించకుంటే ప్రభుత్వంపై మహా ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లక్ష్మీదేవి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ నేతృత్వంలోని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు
కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన
కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు
జిల్లా సచివాలయం, న్యూస్టుడే : అపరిష్కృతంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించకుంటే ప్రభుత్వంపై మహా ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లక్ష్మీదేవి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ నేతృత్వంలోని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్దేశించిన సమయంలో సమస్యలు పరిష్కరించకపోతే చలో విజయవాడ తలపెడతామన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తుంటే పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ముఖ ఆధారిత హాజరు అడుగుతున్నారని, దీన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచి ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని, సుప్రీంకోర్టు సూచన మేరకు సమాన పనికి సమాన వేతనంగా రూ.26 వేలు చెల్లించాలని డిమాండు చేశారు. విచారణ పేరుతో ఎంపీడీవోలు, మహిళా పోలీసులు, రాజకీయ నాయకులు వేధిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని, అదే సమయంలో అంగన్వాడీలకు బడ్జెట్లో కోత విధిస్తే మనుగడ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న టీఏ, డీఏలు తక్షణమే చెల్లించాలని, ప్రతి కార్యకర్త, ఆయాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని, సర్వీసులో ఉంటూ చనిపోయిన కార్యకర్త కుటుంబానికి ఉద్యోగంతో పాటు బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రం అందించారు. సీఐటీయూ నాయకులు మనోహర్, కామనూరు శ్రీనివాసులరెడ్డి, సుబ్బయ్య, రవి, ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం డివిజన్ కార్యదర్శి రఘునాథరెడ్డి తదితరులు సంఘీభావం తెలిపి ఆందోళనలో బైఠాయించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సంఘ నాయకురాళ్లు లక్ష్మీదేవి, భాగ్య, సుభాషిణి, వసుంధర, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడి రాజ్యం.. ఆరోగ్యశ్రీకి అనారోగ్యం...!
[ 27-04-2024]
కడప నగరానికి చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. -
మరుపురానిది ‘జగనాసుర రక్తచరిత్ర’!
[ 27-04-2024]
‘జగనాసుర రక్తచరిత్ర’ మరుపురానిదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో జరిగిన అరాచకాలు చరిత్రకెక్కుతాయని వివరించారు. -
జగన్ హామీకి తొండి... పరిహారానికి గండి..!
[ 27-04-2024]
కొండాపురం మండలంలో పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట 26.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గండికోట జలాశయం నిర్మించడంతో కొండాపురం, ముద్దనూరు మండలాల పరిధిలోని 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. -
న్యాయం చేస్తానన్నావ్...సాయం చేయకున్నావ్...!
[ 27-04-2024]
సోమశిల వెనుక జలాలతో ముంపు గ్రామాల ప్రజలు అధైర్యపడొద్దు. మీకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరంతా సంతృప్తి చెందేలా పునరావాస ప్యాకేజీ వర్తింపజేస్తాం. -
నేత్రపర్వంగా పురుషోత్తముడికి పుష్పాభిషేకం
[ 27-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం పురుషోత్తముడి పుష్పాభిషేకం నేత్రపర్వంగా సాగింది. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. కడప పార్లమెంట నియోజకవర్గానికి సంబంధించి 32 నామపత్రాలు దాఖలు కాగా 14 ఆమోదించారు. -
30న పీలేరు, మైదుకూరులలో సీఎం జగన్ బహిరంగ సభలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు, పీలేరులో ఈ నెల 30న నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. -
పెద్దిరెడ్డి కుటుంబాన్ని సాగనంపండి
[ 27-04-2024]
రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని, ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
ఆపు నీ డప్పు... ఇవ్వు మా డబ్బు!
[ 27-04-2024]
జిల్లాలో గతేడాది మిగ్జాం తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందే అవకాశాలు కనిపించట్లేదు. -
క్షణం క్షణం... భయం భయం
[ 27-04-2024]
ఇళ్లలో ఉంటే విద్యుత్తు తీగలు ఎప్పుడు కింద పడుతాయోననే భయం.. ఆరుబయటికి వస్తే పిల్లలు తెలియక తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తాకి ప్రమాదాల బారిన పడుతారేమోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.