ప్రైవేట్లో పేద విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు
విద్యాహక్కు చట్టం ప్రకారం జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరంలో ఒకటో తరగతిలో 25 శాతం మందికి ఉచిత ప్రవేశాలు కల్పించనున్నామని డీఈవో రాఘవరెడ్డి తెలిపారు.
మాట్లాడుతున్న డీఈవో రాఘవరెడ్డి
కడప విద్య, న్యూస్టుడే : విద్యాహక్కు చట్టం ప్రకారం జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరంలో ఒకటో తరగతిలో 25 శాతం మందికి ఉచిత ప్రవేశాలు కల్పించనున్నామని డీఈవో రాఘవరెడ్డి తెలిపారు. ఏప్రిల్ 10వ తేదీ లోగా సీఎస్ఈ వెబ్సైట్లో విద్యార్థుల వివరాలు నమోదు చేయాలన్నారు. ఆదివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 488 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని, 4 వేల మందికి పైగా పేద విద్యార్థులు ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు పొందే అవకాశం ఉందన్నారు. అర్హులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి వెల్ఫేర్, ఎడ్యుకేషన్ సెక్రటరీ సహాయంతో వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించాలన్నారు. నేరుగా సీఎస్ఈ వెబ్సైట్లోనూ నమోదు చేయవచ్చని సూచించారు.
29వ తేదీలోగా ధ్రువపత్రాలు సమర్పించాలి : నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు హాజరైన విద్యార్థుల ధ్రువపత్రాల తనిఖీ కోసం విద్యార్థుల జాబితా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్ వెబ్సైట్లో ఉంచినట్లు డీఈవో రాఘవరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జాబితాలో పేరున్న విద్యార్థులు ఈ నెల 29వ తేదీలోగా కుల, ఆదాయ, వైకల్య ధ్రువపత్రాలు, 7వ తరగతి మార్కుల పత్రం, ఆధార్కార్డు నకలు తదితరాలు హాల్టికెట్ జిరాక్స్ కాపీతో జతపరిచి సంబంధిత పాఠశాల ద్వారా డీఈవో కార్యాలయంలో సమర్పించాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేతలకు చంద్రబాబు ఎన్నికల బాధ్యతల అప్పగింత
[ 26-04-2024]
రాజంపేటకు చెందిన కీలక నేతలతో గురువారం తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజంపేట నియోజవర్గంపై సమీక్షిస్తూ విజయానికి ఢోకా లేదని.. -
జగన్ బటన్ నొక్కినా... జమకాని దీవెన డబ్బులు
[ 26-04-2024]
దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా -
కేసులు తప్పించుకోవాలని ఒకరు... ఆస్తి పంచివ్వలేదని మరొకరు
[ 26-04-2024]
కడప పార్లమెంట్ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను. -
ఉపాధికి వెళ్లి... విగత జీవులుగా మారి!
[ 26-04-2024]
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో జిల్లాలోని రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. -
వాహన ‘మిత్ర ద్రోహం’... వైకాపా వారికే స్థానం
[ 26-04-2024]
తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు.