జగన్ బటన్ నొక్కినా... జమకాని దీవెన డబ్బులు
దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా
మాయ మాటలతో యువత కష్టాల్లోకి
విద్యా, వసతి దీవెన సొమ్ము రాక విద్యార్థులకు అవస్థలు
న్యూస్టుడే, జమ్మలమడుగు గ్రామీణ: దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఇతర వృతి పరమైన కోర్సుల్లోని విద్యార్థులకు కళాశాలల్లో చెల్లించే రుసుం మేరకు సొమ్ము అందించాలి. గత ప్రభుత్వం అమలు చేసిన ఫీజు రీయంబర్స్మెంట్ను పక్కనెట్టి విద్య, వసతి దీవెన పథకాల కింద విద్యార్థులకు నేరుగా నగదు అందజేస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం వారిని అవస్థల కూపంలోకి నెట్టేసింది. తెదేపా హయాంలో నేరుగా నగదు యాజమాన్యాలకు చేరేది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు దూరమయ్యేవి. విద్యార్థులు సైతం ఫీజుల విషయాన్ని పట్టించుకునేవారు కాదు. వసతి దీవెన కింద రుసుంతో పాటు మెస్ ఛార్జీలు, పుస్తకాల కొనుగోలు, ఇతర వాటి కోసం నగదు ఇవ్వాలి. ఐటీఐ వారికి రూ.10 వేలు, డిప్లొమా వారికి రూ.15 వేలు, డిగ్రీ, పీజీ, ఇతర కోర్సులవారికి రూ.20 వేలు చెల్లించాలి. ఏడాదికి రెండుసార్లు ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. 2023-24 ఆర్థిక ఏడాదిలో ఒక్క రూపాయి కూడా రాలేదు. ఈ ఏడాది మార్చిలో సీఎం జగన్మోహన్రెడ్డి బటన్ సైతం నొక్కారు.. కానీ నేటికీ నగదు రాలేదని విద్యార్థులు చెబుతున్నారు. వారి మాటల్లోనే..
ఇంకా జమ కాలేదు
నేను డిగ్రీ ఫస్టియర్. విద్య, వసతిదీవెన కింద నగదు జమ కాలేదు. ఇంత వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. మా తల్లిదండ్రులు రోజు వారి కూలీ పనులకు వెళ్లేవాళ్లు కావడంతో చెల్లించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
టి.లక్ష్మీగాయత్రి, డిగ్రీ విద్యార్థిని.
నిరాశే మిగిలింది
మాది జమ్మలమడుగు మండల పరిధిలోని అంబవరం గ్రామం. మధ్య తరగతి కుటుంబం. వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. పట్టణంలోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాను. విద్యాదివెన కింద ఇప్పటికీ నగదు జమ కాలేదు. చేసేది లేక సొంతంగా చెల్లించి చదువు కొనసాగిస్తున్నాను.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి.
సి.దాసు, డిగ్రీ విద్యార్థి
సొమ్ము అందక అవస్థలు
పట్టణంలోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మూడో ఏడాది చదువుతున్నా. ఉన్నత విద్య కోసం జగనన్న ప్రభుత్వం విద్యాదీవెన కింద ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో అవస్థలు పడ్డాం. అప్పులు చేసి కళాశాల ఫీజు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. విద్యాదీవెన సొమ్ములు అందించి పేద విద్యార్థులను అదుకోవాలి.
పూజిత, డిగ్రీ విద్యార్థిని
ఈ ఏడాది అందనే లేదు
నేను ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాను. ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా వేయలేదు. తల్లిదండ్రులు కూలీ చేసి చదివిస్తున్నారు. ప్రభుత్వం ఏడాదిగా విద్యాదీవెన కింద చేసే డబ్బులు వేయకపోవడంతో నా చదువు తల్లిదండ్రులకు భారంగా మారింది.
కె.మునేశ్వరి, డిగ్రీ విద్యార్థిని
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు అంగళ్లుకు చంద్రబాబు రాక
[ 05-05-2024]
తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లుకు ఆదివారం రానున్నారు. ఇక్కడ జరిగే ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. -
ఆకేపాటి ఓ కబ్జాకోరు!
[ 05-05-2024]
‘అరాచక వైకాపా ప్రభుత్వం పోవాలంటే కూటమి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను గెలిపించండి. -
పులివెందులలో ప్రజాస్వామ్యం అపహాస్యం!
[ 05-05-2024]
సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికలు ఎన్నడూ ప్రజాస్వామ్యబద్ధంగా జరగడంలేదు. వైకాపా మినహా ఇతర పార్టీల ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లో కూర్చోనివ్వడంలేదు. -
కడపలో వైకాపా అరాచకం
[ 05-05-2024]
కడప నగరంలో వైకాపా అరాచకాలు ముదిరి పాకానపడుతున్నాయి. పోలీసులు పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నగరంలోని 41వ డివిజన్లో శనివారం తెదేపా ప్రచారాన్ని డిప్యూటీ మేయర్ భర్త జమాల్తో పాటు పలువురు నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. -
ఐదేళ్లు గాడిదలు కాశారా?
[ 05-05-2024]
‘కడప ఉక్కు ఊసే లేదు. తట్టెడు మట్టి ఎత్తలేదు, ఇటుక పేర్చలేదు.. పోలవరం ప్రస్తావన అసల్లేదు.. వేల ఉద్యోగాలు భర్తీ చేయలేదు.. తగుదనమ్మా అంటూ ఇప్పుడు దగా డీఎస్సీ ప్రకటించారు.. వైకాపా ప్రభుత్వం ఈ ఐదేళ్లు ఏం చేశారు. -
రెండు సార్లు వచ్చావ్... ఉక్కుకేమి చేశావ్?
[ 05-05-2024]
ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆ పెద్ద మనిషి (అప్పటి సీఎం చంద్రబాబు) టెంకాయ కొట్టాడు. ఒకసారి ఆలోచించమని చెబుతున్నా ప్రజలు ఐదేళ్ల పరిపాలనకు అధికారం ఇస్తారు. నాలుగున్నరేళ్లు ఏమీ చేయకుండా ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే మోసం అంటారు. -
కష్టాలు చూశాను... కన్నీళ్లు తుడుస్తాను...
[ 05-05-2024]
‘సీమ కష్టాలు చూశాను.. సీమ కన్నీళ్లు తుడుస్తాను. యువత నుంచి వచ్చిన పిలుపు మేరకు యువగళం మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టాను. జనవరి 27న కుప్పం నుంచి ప్రారంభించి కడప వరకు 119 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించాను. -
ఎన్డీఏ గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి
[ 05-05-2024]
రాష్ట్రాభివృద్ధి ఎన్డీఏతోనే సాధ్యమని జమ్మలమడుగు భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, కడప లోక్సభ తెదేపా అభ్యర్థి భూపేష్రెడ్డి అన్నారు. శనివారం కొండాపురం మండలం బుక్కపట్నం గ్రామానికి చెందిన రామాంజుల్రెడ్డి, హనుమంతరెడ్డి, నాగేశ్వరరెడ్డి, వెంకటయ్య, నాగయ్య, ఓబులరెడ్డి, సుబ్బరాయుడు, సీమాన్, అజరయ్య, వీరాంజనేయరెడ్డి ఎన్డీఏ కూటమిలో చేరారు. -
ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు!
[ 05-05-2024]
ఓటు విలువ అమూల్యం. ప్రజాస్వామ్యానికి అదే ప్రాణం. పౌరుడికే అదే వజ్రాయుధం. అలాంటి ఓటును రాజకీయ నాయకులు రకరకాల ప్రలోభాలు, డబ్బుతో కొనే ప్రయత్నం చేస్తున్నారు. -
షర్మిలకు ఓటేయాలని పిలుపు
[ 05-05-2024]
అజాతశత్రువుగా అందరి మన్ననలు పొందిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా నరికి చంపిన వారికి శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటానని ఆయన కుమార్తె డాక్టరు సునీత పేర్కొన్నారు. -
వాలంటీర్లతో వైకాపా నేతల రహస్య సమావేశం
[ 05-05-2024]
రాయచోటిలోని పురపాలక సభా భవనం వద్ద శనివారం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి సగీర్పై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. సభా భవనంలో ఛైర్మన్ ఎస్.ఫయాజ్బాషా మరికొంత మంది కౌన్సిలర్లు గత నెలలో రాజీనామాలు చేసిన వాలంటీర్లతో రహస్యంగా సమావేశమయ్యారు. -
ఏడాది అన్నావ్... ఎడారి చేశావ్...!
[ 05-05-2024]
‘అన్నమయ్య జలాశయం మట్టికట్ట వరదలకు తెగిపోవడం బాధాకరం. నష్టపోయిన ప్రతి బాధితుడికి న్యాయం చేస్తాం. రాజంపేట నియోజకవర్గానికి సాగు, తాగునీరందిస్తున్న జలాశయాన్ని ఏడాదిలోనే మరో ఏడు టీఎంసీˆలు నీరు నిల్వ ఉండే విధంగా పునర్నిర్మిస్తాం’ అని జలాశయం కట్ట తెగిన సమయంలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. -
మిథున్రెడ్డి జగత్ కంత్రీ... నల్లారి గెలిస్తే కేంద్ర మంత్రి
[ 05-05-2024]
రాజంపేట పార్లమెంటరీ స్థానం నుంచి ఎంపీగా నల్లారి కిరణ్కుమార్రెడ్డిని గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతారు... అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారు... అదే మిథున్రెడ్డిని గెలిపిస్తే జగత్కంత్రీగా మారి మళ్లీ అవే దౌర్జన్యాలు, దోపిడీలను కొనసాగిస్తారని భాజపా సీనియర్ నాయకుడు చల్లపల్లె నరసింహారెడ్డి అన్నారు.