ఆ రెండు పోస్టులకు పోటాపోటీ!
ప్రొద్దుటూరు జిల్లా కేంద్రానికి ఏ మాత్రం తీసిపోని పట్టణం. బంగారం, వస్త్ర వ్యాపారాలకు ప్రసిద్ధి. అన్ని విధాలా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో విధులు నిర్వహించేందుకు అధికారులు ఆసక్తి చూపుతున్నారు.
ప్రొద్దుటూరు గ్రామీణ పోలీసుస్టేషన్లో ఖాళీలు
రాజకీయ నేతల ద్వారాముమ్మర ప్రయత్నాలు
గతంలో పనిచేసిన ఓ ఎస్.ఐ. తిరిగొచ్చేందుకు సన్నాహాలు
ప్రొద్దుటూరు గ్రామీణ పోలీసుస్టేషన్
ఈనాడు డిజిటల్, కడప: ప్రొద్దుటూరు జిల్లా కేంద్రానికి ఏ మాత్రం తీసిపోని పట్టణం. బంగారం, వస్త్ర వ్యాపారాలకు ప్రసిద్ధి. అన్ని విధాలా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో విధులు నిర్వహించేందుకు అధికారులు ఆసక్తి చూపుతున్నారు. వైయస్ఆర్ జిల్లాతో పాటు పొరుగు జిల్లాల అధికారులు సైతం ఇక్కడ పనిచేసేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఏ పోస్టు ఖాళీగా ఉన్నా పోటీ పడి మరీ బదిలీపై ఇక్కడికి వచ్చేందుకు ఇష్టపడుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న నాయకుల వద్దకు వెళ్లి ఉన్నతాధికారులకు సిఫార్సు చేయించుంటున్నారు. తాజాగా ప్రొద్దుటూరు గ్రామీణ పోలీసుస్టేషన్ సీఐ, ఎస్.ఐ. పోస్టులకు జిల్లాలోని పలువురు అధికారులు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాజకీయ నాయకుల జోక్యంతో ప్రొద్దుటూరు గ్రామీణ ఠాణా సీఐ, ఎస్.ఐ. పోస్టింగ్ల వ్యవహారం చర్చనీయాంశమైంది.
గతం ప్రశాంతం.. ప్రస్తుతం వివాదం
గతంలో ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన ప్రొద్దుటూరు గ్రామీణ ఠాణా గత కొన్నేళ్లుగా వివాదాలకు అడ్డాగా మారిపోయింది. దీంతో ఇక్కడి పోలీసు అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన కొందరు సీఐలు, ఎస్.ఐ.లు పలు ఆరోపణలు ఎదుర్కొంటూ బదిలీ వేటుకు గురయ్యారు. మరికొందరు అధికారులను వీఆర్కు పంపుతూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల కర్ణాటక నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న డీజిల్ వ్యహారంపై చర్యలు తీసుకోలేదన్న వ్యవహారంలో సీఐ మధుసూదన్ గౌడ్, ఏఎస్ఐ బాషాలను ఎస్పీ అన్బురాజన్ వీఆర్కు పంపుతూ ఉత్తుర్వులు జారీ చేశారు. తాజాగా మంగళవారం అదే ఠాణాకు చెందిన ఎస్.ఐ. సంజీవరెడ్డి బదిలీ కావడం చర్చనీయాంశమైంది. దీంతో గ్రామీణ ఠాణాలో సీఐ, ఎస్.ఐ. కుర్చీలు ఖాళీ అయ్యాయి. వాటి కోసం జిల్లాలోని పలువురు అధికారులు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ నాయకుల ద్వారా ఉన్నతాధికారులతో మంతనాలు జరిపినట్లు సమాచారం.
ఆరోపణలతో వెళ్లి... మళ్లీ వచ్చేందుకు ప్రయత్నం
గ్రామీణ ఠాణా సీఐ పీఠం ఎక్కేందుకు కడపకు చెందిన ఇద్దరు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరికి ఆ సీటు వరిస్తుందో వేచి చూడాలి. ఎస్.ఐ. స్థానంలో జిల్లాలో పనిచేసే అధికారి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయన గతంలో అదే ఠాణాలో పనిచేసి అసాంఘిక కార్యకలాపాలు, మద్యం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటూ బదిలీపై వెళ్లారు. మళ్లీ అదే అధికారి స్థానికంగా ఉన్న కొందరు నేతల ద్వారా ప్రొద్దుటూరు వచ్చేందుకు యత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఈ విషయం ప్రొద్దుటూరులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఠాణా పరిధిలో జరుగుతున్న వ్యవహారాలన్నింటింకీ చెక్ పెట్టాలంటే ఆరోపణలు ఎదుర్కొంట్ను వారిని కాకుండా సమర్థంగా పనిచేసే సీఐ, ఎస్.ఐ.లను నియమిస్తే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చేలా కనిపించడం లేదని ప్రజలు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
[ 26-04-2024]
పులివెందులలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సొంత చెల్లెళ్లపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం మండిపడుతున్నారు. -
జగన్ ఓ విధ్వంసకారి!
[ 26-04-2024]
‘జగన్ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం. -
30 నుంచి కడపపైనే షర్మిల దృష్టి!
[ 26-04-2024]
కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 30వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు. -
శ్మశానంపై హామీ ఇస్తేనే ఓట్లు అడగండి!
[ 26-04-2024]
తమ గ్రామానికి శ్మశానం, రహదారి ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీనిస్తేనే నాయకులు వచ్చి ఓట్లు అడగాలని సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ వాసులు ఫెక్సీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. -
నేతలకు చంద్రబాబు ఎన్నికల బాధ్యతల అప్పగింత
[ 26-04-2024]
రాజంపేటకు చెందిన కీలక నేతలతో గురువారం తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజంపేట నియోజవర్గంపై సమీక్షిస్తూ విజయానికి ఢోకా లేదని.. -
జగన్ బటన్ నొక్కినా... జమకాని దీవెన డబ్బులు
[ 26-04-2024]
దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా -
కేసులు తప్పించుకోవాలని ఒకరు... ఆస్తి పంచివ్వలేదని మరొకరు
[ 26-04-2024]
కడప పార్లమెంట్ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను. -
ఉపాధికి వెళ్లి... విగత జీవులుగా మారి!
[ 26-04-2024]
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో జిల్లాలోని రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. -
వాహన ‘మిత్ర ద్రోహం’... వైకాపా వారికే స్థానం
[ 26-04-2024]
తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం