logo

30 నుంచి కడపపైనే షర్మిల దృష్టి!

కడప ఎంపీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈ నెల 30వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

Published : 26 Apr 2024 05:34 IST

ఈనాడు, కడప: కడప ఎంపీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈ నెల 30వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆమె ఈ నెల 29 నాటికి పూర్తి చేసుకుని కడపకు రానున్నారు. అనంతరం పోలింగ్‌ పూర్తయ్యేవరకు కడప స్థానంపై దృష్టి పెట్టనున్నారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. కడప ఎంపీగా పోటీ చేయడంతోపాటు కుటుంబపరంగా నడుస్తున్న పోరుపై తలపడనున్నారు. వివేకా హత్యను వ్యతిరేకిస్తూ సోదరుడు జగన్‌, ఎంపీ అవినాష్‌రెడ్డి లక్ష్యంగా షర్మిలతో పాటు సునీత పోరాటం చేస్తున్నారు. సీబీఐ విచారణ నివేదిక ఆధారంగా చేసుకుని ప్రజాకోర్టులో తేల్చుకునే దిశగా పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసే దిశగా అడుగులు వేస్తూ రంగంలోకి దిగుతున్నారు. ఇద్దరు సోదరీ మణులు తాడోపేడో తేల్చుకునే దిశగా తలపడుతున్నారు. ప్రస్తుతం షర్మిలకు మద్దతుగా సునీత నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు