జగన్ ఓ విధ్వంసకారి!
‘జగన్ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం.
వివేకానందరెడ్డి హత్యపై చెల్లెళ్లకు సమాధానం చెప్పాలి
ఇంటి సమస్యను రాష్ట్ర సమస్యగా మార్చే ప్రయత్నం
రాజంపేట, రైల్వేకోడూరు అభివృద్ధికి చేసిందేమీ లేదు
తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్కల్యాణ్
బహిరంగ సభలకు అశేష జనవాహినితో నేతల ఆనందం
రాజంపేటలో జనాలనుద్దేశించి మాట్లాడుతున్న తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు, కడప, న్యూస్టుడే, రాజంపేట గ్రామీణ, రాజంపేట, రైల్వేకోడూరు, రైల్వేకోడూరు గ్రామీణ: ‘జగన్ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం. ఏ రోజైనా పరదాలు కట్టుకున్నామా?. సిద్దం అని జగన్ అంటున్నాడు. మేము చెబుతున్నాం.. ప్రజలంటున్నారు. మేమంతా నిన్ను గద్దె దించడానికి సిద్దమని చెబుతున్నాం. రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలకు వైకాపా ప్రభుత్వం ఏమైనా చేసిందా?. సొంత జిల్లాకు మేలు చేయని వ్యక్తి రాష్ట్రానికి అవసరమా?. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణం ఈ జగన్. ఇలాంటి వ్యక్తి మూడు రాజధానులు కడతాడంట. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పూయలేదు. ఇళ్లు కోల్పోయిన వారికి తిరిగి కట్టివ్వలేదు. రాష్ట్రానికి ఈ దుర్మార్గుడు రాజధాని లేకుండా చేశాడు’ అని తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. రాజంపేట, రైల్వేకోడూరు పట్టణాల్లో గురువారం జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్తో కలిసి నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. రెండు పట్టణాల్లో జరిగిన సభలకు అశేషంగా జనం తరలివచ్చి ఎన్డీఏ కూటమికి బ్రహ్మరథం పట్టారు. రెండు పార్టీల అగ్రనేతలు తరలిరావడంతో ఆయా పార్టీల శ్రేణుల్లో అభిమానం పొంగి పొర్లింది. భారీ ఎత్తున సభలకు తరలివచ్చి.. రాబోయేది... కూటమి ప్రభుత్వమని స్పష్టమైన సంకేతాలిచ్చారు. ‘రాజంపేట, రైల్వేకోడూరు జనసంద్రం సముద్రాన్ని మరిపించింది. ఈ జన సమూహాన్ని చూశాక జగన్రెడ్డికి ఓటుపడుతుందని నమ్ముతారా?. అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రైల్వేకోడూరులో అశేష జనవాహినికి జనసేనాని పవన్కల్యాణ్ అభివాదం
రాజంపేటకు వైద్యకళాశాలను తీసుకొస్తాం
రాజంపేటను మంచి పట్టణంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైద్యకళాశాల తీసుకురావడంతో పాటు జిల్లా కేంద్రం ఏర్పాటుకు ప్రజల అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు. అడ్డగోలుగా జిల్లాలను విభజించారని, ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తామని తెలిపారు. అన్నమయ్య, పింఛ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, మాచుపల్లి వంతెన, ఓబిలి- టంగుటూరు హైలెవల్ వంతెన నిర్మిస్తామని, ఝరికోన ప్రాజెక్టు ద్వారా సుండుపల్లె మండలానికి తాగునీరు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట క్షేత్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు.
రైల్వేకోడూరులో తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్కల్యాణ్, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి,
జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్ల విజయకేతనం
చెల్లెమ్మలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలి
నేరాలు, ఘోరాలు చేసే ఘరానా ముఠా నాయకుడు జగన్రెడ్డని చంద్రబాబు ఆరోపించారు. హంద్రీ- నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను గాలికొదిలేసిన సీమ ద్రోహి జగన్ అని విమర్శించారు. వివేకా హత్యపై చెల్లెమ్మలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. హంతకుడిని వెనకేసుకొస్తూ.. ఇంటి సమస్యను రాష్ట్ర సమస్యగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రైల్వేకోడూరు అడ్డాగా గనుల్ని, ఎర్రచందనాన్ని మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. ఇంట్లో ముగ్గురు పదవులు అనుభవిస్తూ ప్రజలను పీక్కుతింటున్నారని విమర్శించారు. రాయలసీమ సంస్కృతిని కించపర్చుతున్నట్లు జగన్ చేసిన విమర్శలను చంద్రబాబు తిప్పికొట్టారు. తాను రాయలసీమలోనే పుట్టానని కడప కల్చర్, పులివెందుల కల్చర్, రాయలసీమంటూ ఎగతాళి చేస్తున్నట్లు ప్రచారం చేయడంపై అభ్యంతరం తెలిపారు. రాజంపేట నుంచి రైల్వేకోడూరుకు ఒకే హెలికాప్టర్లో చంద్రబాబు, పవన్కల్యాణ్తోపాటు భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డిలు ప్రయాణించారు.
లక్ష్మీ ప్రసన్నకు నేతల అభయం
లక్ష్మీప్రసన్నతో మాట్లాడిస్తున్న తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్కల్యాణ్
ఇటీవల ఒంటిమిట్టలో చేనేత కార్మికుడు సుబ్బారావు, భార్య, కుమార్తె ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబంలో మిగిలిన లక్ష్మీ ప్రసన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ను రాజంపేట సభలో కలిసింది. తనకు అండగా నిలబడినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపింది. ఆయన స్పందిస్తూ అండగా ఉండడమే కాకుండా జీవితంలో స్థిరపడేవరకు తోడ్పాటునందిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ తరఫున రూ.5 లక్షలు సాయం అందించామని, వైకాపా భూదందాలు కారణంగా కుటుంబం ప్రాణాలు తీసుకుందని, ఇదేవిధంగా కోవూరి లక్ష్మి దిల్లీకి వెళ్లి ఇండియా గేటు వద్ద తన బొటన వేలు కోసుకుందని వివరించారు. మీ జీవితాలు బాగుపడాలంటే ఎంపీ మిథున్రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
ఎర్రచందనం మాఫియాతో మిథున్రెడ్డికి సంబంధాలు: పవన్
ఎర్రచందనం మాఫియాతో ఎంపీ మిథున్రెడ్డికి సంబంధాలున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. మాఫియా డాన్ గంగిరెడ్డితో కలిసి మిథున్రెడ్డి తిరుగుతున్నారని, ఈ మేరకు తమ వద్ద ఆధారాలున్నట్లు తెలిపారు. రాయలసీమ నీ అడ్డా అయితే.. పీఠాపురంలో నీకేం పనంటూ ప్రశ్నించారు. ఎర్రచందనం స్మగ్లింగ్కు అడ్డొస్తున్నారని 40 మందిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. అరాచకులను యువత అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ధైర్యంతోనే మార్పు వస్తుందని తెలిపారు. బహిరంగ సభల్లో తెదేపా రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, నేతలు విశ్వనాథనాయుడు, రూపానందరెడ్డి, వేమన సతీష్, బత్యాల చెంగల్రాయుడు, రైల్వేకోడూరు అభ్యర్థి అరవ శ్రీధర్, చప్పిడి మహేష్, కేకే చౌదరి, తాతంశెట్టి నాగేంద్ర, సుంకర శ్రీనివాస్, అతికారి దినేష్, శ్రీనివాసరాజు, తదితరులు పాల్గొన్నారు.
రైల్వేకోడూరులో యువత ఉత్సాహం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముస్లిం మైనారిటీలతో మాజీ ఎమ్మెల్యే ఆత్మీయ సమావేశం
[ 05-05-2024]
మండల కేంద్రంలో ఆదివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ముస్లిం మైనారిటీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.. -
తెదేపాలో చేరిన 40 కుటుంబాలు
[ 05-05-2024]
మండలంలోని పెండ్లిమర్రి, చెన్నారెడ్డిపల్లె గ్రామాల్లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సమక్షంలో 40 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలో చేరాయి. -
నేడు అంగళ్లుకు చంద్రబాబు రాక
[ 05-05-2024]
తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లుకు ఆదివారం రానున్నారు. ఇక్కడ జరిగే ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. -
ఆకేపాటి ఓ కబ్జాకోరు!
[ 05-05-2024]
‘అరాచక వైకాపా ప్రభుత్వం పోవాలంటే కూటమి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను గెలిపించండి. -
పులివెందులలో ప్రజాస్వామ్యం అపహాస్యం!
[ 05-05-2024]
సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికలు ఎన్నడూ ప్రజాస్వామ్యబద్ధంగా జరగడంలేదు. వైకాపా మినహా ఇతర పార్టీల ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లో కూర్చోనివ్వడంలేదు. -
కడపలో వైకాపా అరాచకం
[ 05-05-2024]
కడప నగరంలో వైకాపా అరాచకాలు ముదిరి పాకానపడుతున్నాయి. పోలీసులు పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నగరంలోని 41వ డివిజన్లో శనివారం తెదేపా ప్రచారాన్ని డిప్యూటీ మేయర్ భర్త జమాల్తో పాటు పలువురు నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. -
ఐదేళ్లు గాడిదలు కాశారా?
[ 05-05-2024]
‘కడప ఉక్కు ఊసే లేదు. తట్టెడు మట్టి ఎత్తలేదు, ఇటుక పేర్చలేదు.. పోలవరం ప్రస్తావన అసల్లేదు.. వేల ఉద్యోగాలు భర్తీ చేయలేదు.. తగుదనమ్మా అంటూ ఇప్పుడు దగా డీఎస్సీ ప్రకటించారు.. వైకాపా ప్రభుత్వం ఈ ఐదేళ్లు ఏం చేశారు. -
రెండు సార్లు వచ్చావ్... ఉక్కుకేమి చేశావ్?
[ 05-05-2024]
ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆ పెద్ద మనిషి (అప్పటి సీఎం చంద్రబాబు) టెంకాయ కొట్టాడు. ఒకసారి ఆలోచించమని చెబుతున్నా ప్రజలు ఐదేళ్ల పరిపాలనకు అధికారం ఇస్తారు. నాలుగున్నరేళ్లు ఏమీ చేయకుండా ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే మోసం అంటారు. -
కష్టాలు చూశాను... కన్నీళ్లు తుడుస్తాను...
[ 05-05-2024]
‘సీమ కష్టాలు చూశాను.. సీమ కన్నీళ్లు తుడుస్తాను. యువత నుంచి వచ్చిన పిలుపు మేరకు యువగళం మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టాను. జనవరి 27న కుప్పం నుంచి ప్రారంభించి కడప వరకు 119 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించాను. -
ఎన్డీఏ గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి
[ 05-05-2024]
రాష్ట్రాభివృద్ధి ఎన్డీఏతోనే సాధ్యమని జమ్మలమడుగు భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, కడప లోక్సభ తెదేపా అభ్యర్థి భూపేష్రెడ్డి అన్నారు. శనివారం కొండాపురం మండలం బుక్కపట్నం గ్రామానికి చెందిన రామాంజుల్రెడ్డి, హనుమంతరెడ్డి, నాగేశ్వరరెడ్డి, వెంకటయ్య, నాగయ్య, ఓబులరెడ్డి, సుబ్బరాయుడు, సీమాన్, అజరయ్య, వీరాంజనేయరెడ్డి ఎన్డీఏ కూటమిలో చేరారు. -
ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు!
[ 05-05-2024]
ఓటు విలువ అమూల్యం. ప్రజాస్వామ్యానికి అదే ప్రాణం. పౌరుడికే అదే వజ్రాయుధం. అలాంటి ఓటును రాజకీయ నాయకులు రకరకాల ప్రలోభాలు, డబ్బుతో కొనే ప్రయత్నం చేస్తున్నారు. -
షర్మిలకు ఓటేయాలని పిలుపు
[ 05-05-2024]
అజాతశత్రువుగా అందరి మన్ననలు పొందిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా నరికి చంపిన వారికి శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటానని ఆయన కుమార్తె డాక్టరు సునీత పేర్కొన్నారు. -
వాలంటీర్లతో వైకాపా నేతల రహస్య సమావేశం
[ 05-05-2024]
రాయచోటిలోని పురపాలక సభా భవనం వద్ద శనివారం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి సగీర్పై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. సభా భవనంలో ఛైర్మన్ ఎస్.ఫయాజ్బాషా మరికొంత మంది కౌన్సిలర్లు గత నెలలో రాజీనామాలు చేసిన వాలంటీర్లతో రహస్యంగా సమావేశమయ్యారు. -
ఏడాది అన్నావ్... ఎడారి చేశావ్...!
[ 05-05-2024]
‘అన్నమయ్య జలాశయం మట్టికట్ట వరదలకు తెగిపోవడం బాధాకరం. నష్టపోయిన ప్రతి బాధితుడికి న్యాయం చేస్తాం. రాజంపేట నియోజకవర్గానికి సాగు, తాగునీరందిస్తున్న జలాశయాన్ని ఏడాదిలోనే మరో ఏడు టీఎంసీˆలు నీరు నిల్వ ఉండే విధంగా పునర్నిర్మిస్తాం’ అని జలాశయం కట్ట తెగిన సమయంలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. -
మిథున్రెడ్డి జగత్ కంత్రీ... నల్లారి గెలిస్తే కేంద్ర మంత్రి
[ 05-05-2024]
రాజంపేట పార్లమెంటరీ స్థానం నుంచి ఎంపీగా నల్లారి కిరణ్కుమార్రెడ్డిని గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతారు... అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారు... అదే మిథున్రెడ్డిని గెలిపిస్తే జగత్కంత్రీగా మారి మళ్లీ అవే దౌర్జన్యాలు, దోపిడీలను కొనసాగిస్తారని భాజపా సీనియర్ నాయకుడు చల్లపల్లె నరసింహారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!