మునక తప్పదని తెలుసు... అయినా!
దేశ రాజధాని దిల్లీ అతలాకుతలం.. ఇటు హైదరాబాద్ మునక... వరద బారిన కోస్తా జిల్లాలు.. ఇదీ ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో పరిస్థితి. వరుణుడు ఒక్కసారిగా విరుచుకుపడుతుండడంతో చిన్నా, పెద్దా తేడా లేకుండా ఊళ్లకు ఊళ్లు ఏర్లు ఒక్కటైపోతున్నాయి.
పాఠాలు నేర్వని పాలకులు
భారీవర్షం పడితే పరిస్థితి అస్తవ్యస్తం
కడప అప్సరా సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండు దారిలో నిలిచిన నీరు (పాత చిత్రం)
కడప నగరపాలక సంస్థ, న్యూస్టుడే : దేశ రాజధాని దిల్లీ అతలాకుతలం.. ఇటు హైదరాబాద్ మునక... వరద బారిన కోస్తా జిల్లాలు.. ఇదీ ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో పరిస్థితి. వరుణుడు ఒక్కసారిగా విరుచుకుపడుతుండడంతో చిన్నా, పెద్దా తేడా లేకుండా ఊళ్లకు ఊళ్లు ఏర్లు ఒక్కటైపోతున్నాయి. అదృష్టం కొద్దీ జిల్లాను ఈ ఏడు ఇప్పటి వరకు వరుణుడు గట్టిగా పలకరించలేదు. ఒకవేళ తుపాను ఏర్పడి భారీ వర్షాలు పడితే మన పరిస్థితి ఏమిటి? ఒక్కసారిగా వచ్చే వరదను నది వైపు మళ్లించే వ్యవస్థలు ఇక్కడ ఉన్నాయా? అర్బన్ ప్రాంతాల్లోని మురుగు కాల్వల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించారా? వరద ప్రవాహ మార్గాల్లో పిచ్చిమొక్కలను, వెలసిన ఆక్రమణలు కొట్టేశారా? ఈ ప్రశ్నలన్నింటికీ లేదు అనే సమాధానమే వస్తోంది. గతం నుంచి పాలకులు, అధికారులు ఇంకా పాఠాలు నేర్వలేదు. జిల్లాలోని నగర, పుర పాలికల్లో ఎక్కడ చూసినా వర్షం వస్తే మునక తప్పదని అందరికీ తెలుసు. మరి గట్టెక్కే మార్గమేదీ?
ఆక్రమణలతో అగచాట్లు : కడప నగరం చుట్టూ దాదాపు 10 గొలుసుకట్టు చెరువులున్నాయి. ఒకటి నిండిన తర్వాత మరో చెరువులోకి వరదనీరు ప్రవహించాలి. గత 20 సంవత్సరాలుగా వంకలు, వాగుల స్థలాలను యథేచ్ఛగా ఆక్రమించారు. వాటిని తొలగించడానికి అధికారులు చేపట్టిన చర్యలు పూర్తి కాలేదు. దీంతో చెరువుల రూపురేఖలు మారిపోయాయి. నగరంలో ఇప్పటి వరకు పటిష్టమైన వరద కాల్వల నిర్మాణం జరగలేదు.
రెండేళ్ల కిందట మునక : కడప నగర పరిధిలో వరదనీటి ప్రవాహానికి ప్రత్యేకించి కాలువలు లేవు. చెరువుల నుంచి దిగువకు పారే వంకలు, బుగ్గవంక, కేసీ కాలువ ద్వారా వరద నీరు పెన్నా నదిలో చేరుతోంది. ఈ మూడింటి మధ్య సమన్వయం లేదు. వంకలు ఆక్రమణల పాలయ్యాయి. బుగ్గవంక నిండా గుర్రపు డెక్క ఏపుగా పెరిగింది. కేసీ కాలువ పూడికతో నిండి దుర్గంధ భరింతంగా మారింది. దీంతో భారీ వర్షాలు కురిస్తే కడప నగరం నీటమునుగుతోంది. 2021లో కురిసిన వానలకు నగరంలోని ఎన్జీవో కాలనీ, భాగ్యనగర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, మద్రాసు రోడ్డు తదితర ప్రాంతాలు దాదాపు మూడు రోజుల పాటూ వరద నీటిలో చిక్కుకున్నాయి.
ఎన్జీవో కాలనీలో వరద బాధితుల పాట్లు (పాత చిత్రం)
ఇతర పట్టణాల్లోనూ అంతే...
జిల్లాలో రెండో ముఖ్య పట్టణమైన ప్రొద్దుటూరులో మురుగు కాలువల్లో పూడికతీత చేపట్టకపోవడంతో కొర్రపాడురోడ్డు, రాజీవ్సర్కిల్, ఓనేటి కాల్వ వీధి, శ్రీనివాసనగర్ తదితర ప్రాంతాల్లో వరద నీరు చేరుతోంది. జమ్మలమడుగులో కాల్వల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండడంతో వర్షాకాలంలో ప్రధాన రహదారులు జలమయమవుతున్నాయి.
- మైదుకూరు పట్టణానికి అన్నకుంట, శాకిరేని కుంట ఆక్రమణకు గురికావడం శాపంగా మారింది. దీని వల్ల బాలాజీ నగర్, శ్రీనివాసనగర్, ఎర్రచెరువు, కడప రోడ్డు నీటమునుగుతున్నాయి. జిల్లాలో ఈ సీజన్లో ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవలేదు. గత అయిదేళ్లుగా వర్షాల తీరును పరిశీలిస్తే ఒక్కసారిగా కుండపోత పడితే జనావాసాలు జలమయమైనట్టు స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో నగరపాలక, పురపాలక, రెవెన్యూ, నీటిపారుదల శాఖాధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేసి వరద నీరు సక్రమంగా పారేలా చర్యలు వెంటనే చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గొడవలకు దిగితే రౌడీషీట్
[ 17-05-2024]
మండలంలోని పోరుమామిళ్ల సర్కిల్ పరిధిలోని పోరుమామిళ్ల, కలసపాడు, కాశీనాయన పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గొడవలకు దిగితే రౌడీషీట్ తెరవడంతో పాటు జిల్లా, మండల బహిష్కరణ చేస్తామని ... -
నిబంధనలకు పాతర... ఇసుకాసురుల జాతర..!
[ 17-05-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, అక్రమాలు ఆపాలన్న ఆదేశాలను పక్కనబెట్టి యథేచ్ఛగా కొనసాగించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకోలేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ధర్మాసనం మండి పడింది. -
బద్వేలులో భూఆక్రమణ!
[ 17-05-2024]
నియోజకవర్గ కేంద్రమైన బద్వేలు పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ప్రజావసరాలకు కేటాయించిన రూ.కోట్ల విలువైన ఎకరా విస్తీర్ణంలోని ప్రభుత్వ స్థలంపై ఆక్రమార్కుల కన్ను పడింది. -
వేసవి శిక్షణ... తప్పని నిరీక్షణ!
[ 17-05-2024]
ఏడాదిపాటు చదువులతో అలిసిపోయిన విద్యార్థులకు కాస్తంత ఊరట, వినోదం కోసం నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం క్రీడాకారులను నిరాశ పరుస్తోంది. -
నిప్పులార్పగలరు... భవనాలూ నిర్మించగలరు
[ 17-05-2024]
దృఢ సంకల్పం, పవిత్ర ఆశయం తప్పక సత్ఫలితాలిస్తాయి. వీటిని ఆయుధాలుగా చేపట్టిన వారు విజయాలను సాధిస్తారనే స్వామి వివేకానందుడి సూక్తిని నిజం చేశారు ప్రొద్దుటూరు అగ్నిమాపక, విపత్తుల శాఖలో ఫైర్మెన్గా పని చేసే ఒ.నరేంద్రకుమార్. ఉద్యోగం రాకముందు బేల్దారి పని చేసి జీవించేవారు. -
సీఎం బటన్ నొక్కినా జమకాని నగదు
[ 17-05-2024]
సీఎం జగన్ వివిధ సంక్షేమ పథకాలకు బటన్ నొక్కినా నిధులు ఎక్కడున్నాయో తెలియడం లేదని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్రెడ్డి ప్రశ్నించారు. -
ఏడేళ్లనంతరం గండికోట జలాల తగ్గుముఖం
[ 17-05-2024]
ఏడేళ్లనంతరం గండికోట జలాశయంలో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయి 2.9 టీఎంసీలకు చేరింది. జలాశయానికి తొలిసారిగా 2013, సెప్టెంబరులో నంద్యాల జిల్లా అవుకు జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించి మూడు టీఎంసీల నీటిని నిల్వ చేశారు. -
మండిపల్లి గృహనిర్బంధం
[ 17-05-2024]
చిన్నమండెం మండలం బోడిరెడ్డిగారిపల్లెలో గురువారం తెదేపా రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డిని పోలీసులు ఆయన స్వగృహంలో గృహనిర్బంధం చేశారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనలో
[ 17-05-2024]
చిత్తూరు జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నానికి పాల్పడిన 13 మందిని 14 రోజుల రిమాండు నిమిత్తం కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే