వాలంటీర్ల కోసం వెతుకులాట!
తాము రాజీనామా చేసేందుకు ససేమిరా అంటూ గ్రామ/ వార్డు వాలంటీర్లు వైకాపా నేతలకు కంట కనిపించకుండా తిరుగుతున్నారు.
ఇళ్లకెళ్లి వైకాపా నాయకుల బెదిరింపులు
ప్రచారానికి రావాల్సిందేనని తీవ్ర ఒత్తిళ్లు
ఈనాడు, కడప : తాము రాజీనామా చేసేందుకు ససేమిరా అంటూ గ్రామ/ వార్డు వాలంటీర్లు వైకాపా నేతలకు కంట కనిపించకుండా తిరుగుతున్నారు. దీంతో నాయకులు వెతుకులాటకు దిగారు. కడప నగరంలో వాలంటీర్ల కోసం కార్పొరేటర్లు, నేతలు కలిసి సోమవారం వెతకడం కనిపించింది. వాలంటీర్లందరూ రాజీనామా చేసి ఎన్నికల ప్రచారానికి రావాలంటూ ఒత్తిళ్లు పెరిగాయి. రాజీనామా చేసే పక్షంలో తిరిగి ఉద్యోగం సంపాదించుకోవడమెలా అనే సందేహం తలెత్తుతోంది. అందులోనూ తెదేపా అధినేత చంద్రబాబు సైతం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామనే హామీ ఇచ్చారు. నిబంధనలు మేరకు పని చేసేవారికి ఎలాంటి ఢోకా లేదని, వైకాపాకు అంటకాగేవారి భరతం పడతామనే హెచ్చరికలు చేశారు. ఈ భరోసాతో దాదాపు 60 శాతం మంది వరకు వాలంటీర్లు రాజీనామా చేయకుండా దాటవేశారు. రాజీనామా చేసిన వారు సైతం ప్రచారానికి హాజరుకావడంలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ చరవాణులు, సిమ్లు సైతం వెనక్కి ఇచ్చేశారు. దీంతో సొంత చరవాణులు వాడే నంబర్లు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో వాలంటీర్ల చిరునామాలు తెలుసుకుని ఇళ్లకు వెళ్లే పక్షంలోనూ కనిపించడంలేదు. చాలా మంది స్థానికంగా లేకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ పరిస్థితిని తెలుసుకున్న వైకాపా నేతలు కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారు. నేతల కంటే వాలంటీర్లకు ఓటర్లు ప్రాధాన్యమిస్తుండడంతో వారి కోసం వైకాపా అభ్యర్థులు దృష్టి సారించారు. వారి ద్వారానే తాయిలాలు పంపిణీ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. వాలంటీర్లు చాలా మంది అందుబాటులో లేకుండా పోవడంతో నేతలకు సమస్యగా మారింది. మాట వినకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే నేతల హెచ్చరికలకు వాలంటీర్లు భయపడడంలేదు. ¢ు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ వాలంటీర్లపై నేతలు దృష్టి పెట్టారు. ప్రొద్దుటూరులో సొంత పార్టీవారి కంటే వాలంటీర్లే నయమనేవిధంగా వైకాపా అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్రెడ్డి భావించారు. 500 మంది వాలంటీర్ల జట్టుతో ఎన్నికల తతంగం నడపడానికి ప్రయత్నాలు సాగించగా చాలా మంది జారుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ పర్యటనపై డేగ కన్నుతో నిఘా
[ 04-05-2024]
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కర్నూలు రేంజ్ డీఐజీ సీˆహెచ్ విజయరావు అధికారులను ఆదేశించారు. -
ఐదేళ్ల పాలనలో ఏం చేశావ్... కార్మికుల బతుకులు కూల్చేశావ్..!
[ 04-05-2024]
జిల్లాలో 55 వేల మంది భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కార్మిక శాఖ పరిగణనలోకి తీసుకోనివారు మరో 50 వేల మంది పైగా కార్మికులు ఉన్నారు. ఒకనాడు పల్లెసీమలు పాడి పంటలతో విలసిల్లాయి. -
పెద్దిరెడ్డికి రైతుల ఉసురు తగలక తప్పదు
[ 04-05-2024]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాడి, మామిడి రైతులను దోపిడీ చేసి వారిని తీవ్రంగా నష్టపరిచారని ఆ రైతుల ఉసురు తప్పక తగులుతుందని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
అయ్యో పాపం...!
[ 04-05-2024]
మండుటెండలు, వడగాలుల మధ్య పింఛను సొమ్ము కోసం రెండో రోజైన శుక్రవారం ఉదయం నుంచే పండుటాకులు బ్యాంకుల బాట పట్టారు. తమ వంతు కోసం అక్కడే గంటలతరబడి పడిగాపులు కాశారు. -
ఒట్టేసి చెబుతున్నాం.. ఓటేసి బుద్ధి చెబుతాం
[ 04-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత బి.కొత్తకోట పట్టణ శివారు ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి... కనీస వసతులు అందుబాటు లేకపోవడంతో నిరుపేదలు దుర్భర పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నారు. -
జగన్ పాపానికి ఇద్దరి బలి
[ 04-05-2024]
పింఛను కోసం బ్యాంకులు, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఎండథాటికి తట్టుకోలేక ఇద్దరు వృద్ధులు మృతిచెందిన ఘటన బద్వేలులో శుక్రవారం చోటుచేసుకుంది. -
వైకాపా కంచుకోటకు బీటలు
[ 04-05-2024]
వైకాపాకు కంచుకోట ఉన్న కోమన్నూతలలో దేవిరెడ్డి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నుంచి ఓబులరెడ్డి, బీష్మారెడ్డి, భార్గవ్, ప్రతాప్, మరో 30 కుటుంబాలు శుక్రవారం తెదేపాలో చేరాయి. -
రాజోలి ప్రాజెక్టును పట్టించుకోని వారికి ఎందుకేయాలి ఓట్లు
[ 04-05-2024]
మీఎమ్మెల్యే ఏరోజైనా పలకడా.. ఎప్పుడైనా మీకు కష్టం ఉందా అని అడిగాడా... ఎర్రచందనం స్మగ్లింగ్, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే మట్టి, ఇసుక మాఫియా ఇక చెప్పనవసరం లేదని -
షర్మిలకు ఓటేయాలని పిలుపు
[ 04-05-2024]
పోరుమామిళ్ల, న్యూస్టుడే: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి, మాజీ మంత్రి వివేకాల ఆత్మలు శాంతించాలంటే కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి షర్మిలకు ఓటేయాలని వివేకా కుమార్తె సునీత పిలుపునిచ్చారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు వైకాపా ఎర!
[ 04-05-2024]
రానున్న ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో వైకాపా నేతలు ఎత్తుగడలు వేస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల నాయకులు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు.