అన్నా క్షమించు... ఈ లోకంలో బతకలేకున్నా
ఆ తల్లి ఎన్ని కష్టాలు అనుభవించిందో కొడుకు, కూతురితో కలిసి చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించింది. ‘అన్నా క్షమించు జీవితంలో తొలిసారి నీకు చెప్పకుండా తప్పు చేస్తున్నా.. నాతో పాటు నా బిడ్డల్ని తీసుకెళ్తున్నా.. తల్లికన్నా ఎక్కువగా చూసుకున్నావు, ఇన్నేళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూ నా జీవితాన్ని బాగు చేయాలని ఎంతో శ్రమించావు.
కూతురు, కుమారుడితో సహా తల్లి ఆత్మహత్య
కుమారుడు, కుమార్తెతో ఉమామహేశ్వరి (పాతచిత్రం)
వల్లూరు, న్యూస్టుడే: ఆ తల్లి ఎన్ని కష్టాలు అనుభవించిందో కొడుకు, కూతురితో కలిసి చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించింది. ‘అన్నా క్షమించు జీవితంలో తొలిసారి నీకు చెప్పకుండా తప్పు చేస్తున్నా.. నాతో పాటు నా బిడ్డల్ని తీసుకెళ్తున్నా.. తల్లికన్నా ఎక్కువగా చూసుకున్నావు, ఇన్నేళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూ నా జీవితాన్ని బాగు చేయాలని ఎంతో శ్రమించావు. ఇక చాలు, నీకు భారం కాదలుచుకోలేదు. మా ఆత్మహత్యలకు భర్త శ్రీహరి, అత్త సరస్వతి, ఆడపడుచు శశికళతో పాటు లక్ష్మీపతి కారణమంటూ’ అన్నకు చివరిసారిగా చరవాణి ద్వారా వాయిస్ మెసేజ్ పంపి బిడ్డలతో సహా తనువు చాలించిన విషాదకర సంఘటన వల్లూరులో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చెన్నూరు మండలం గొర్లపుల్లయ్య వీధికి చెందిన ఉమామహేశ్వరి (45)కి కడప నగరానికి చెందిన శ్రీహరితో 2005లో వివాహమైంది. వీరికి కుమారుడు ఫణికుమార్ (17) కుమార్తె ధనలక్ష్మి (16) ఉన్నారు. కాపురం సజావుగా సాగుతున్న క్రమంలో శ్రీహరి జీవనోపాధికి కువైట్ వెళ్లాడు. ఈ క్రమంలో కుటుంబంలో మనస్పర్థలు రావడంతో గొడవలు తీవ్రమై ఉమామహేశ్వరి తనకు వద్దంటూ భర్త వాదనకు దిగాడు. దీంతో ఉమామహేశ్వరి తన పిల్లలతో కలిసి 12 ఏళ్లుగా చెన్నూరులోని తన అన్న రాజేంద్రప్రసాద్ ఇంట్లోనే ఉంటున్నారు. ఫణికుమార్ మోటారు మెకానిక్గా పనిచేస్తున్నాడు. ధనలక్ష్మి ఇంటర్ పూర్తి చేసింది. చెల్లెలి కాపురాన్ని నిలబెట్టేందుకు రాజేంద్రప్రసాద్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భర్త కువైట్ నుంచి వచ్చాక ఉమామహేశ్వరిని కాపురానికి తీసుకెళ్లకపోవడంతో గొడవలు తీవ్రమై కోర్టుకు వెళ్లారు. ఉమామహేశ్వరి తన భర్త నుంచి చట్ట ప్రకారం రావాల్సిన డబ్బు కోసం కోర్టును ఆశ్రయించారు. రూ.10 లక్షల నగదు ఇవ్వాలంటూ కోర్టు శ్రీహరిని ఆదేశించింది. అంత నగదు చెల్లించలేనంటూ నెలరోజుల పాటు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. ఉమామహేశ్వరి భరణం కోసం మరోమారు కోర్టు మెట్లెక్కింది. కొంత మొత్తం భరణం చెల్లించాలని కోర్టు శ్రీహరిని ఆదేశించింది. ఈ క్రమంలో ఉమామహేశ్వరి కోర్టుల చుట్టూ తిరిగి జీవితంపై విరక్తి చెంది తనువు చాలించాలని నిర్ణయించుకుంది. ఈ నెల 27న సాయంత్రం గుడికి వెళ్లి వస్తానంటూ పిల్లలతో సహా ఇంటి నుంచి వచ్చేసింది. అదే రోజు రాత్రి 10 గంటలకు రాజేంద్రప్రసాద్కు చరవాణి ద్వారా మెసేజ్ పంపించి కుమారుడు, కూతురుతో సహా చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం పశువులకాపరులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాలను పరీక్షల నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. వీరి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
[ 20-05-2024]
ఓటు.. సామాన్యుడి చేతిలో వజ్రాయుధం.. దానిని అంకుశంలా వినియోగించే వారే నిజమైన ఓటరు.. మన చేతిలోనే భవిష్యత్తు దాగి ఉందని చాటి చెబుతున్నారు వారు. -
ఎవరికో నవ వసంతం
[ 20-05-2024]
యువత... జ్వలించే కాంక్ష, అవినీతిని ఎదురించే తత్వం, అక్రమాలను అంగీకరించని స్వభావం, ఉపాధి లేమిని సహించని నైజం, సమాజ సంక్షేమాన్ని కోరుకునే మనస్తత్వం అలాంటి వారు ఓటెత్తితే తప్పనిసరిగా అది మార్పుకు శ్రీకారం చుట్టినట్లే. -
వివాదాస్పద భూమిలో కంచె ఏర్పాటును అడ్డుకున్న గ్రామస్థులు
[ 20-05-2024]
సిద్దవటం మండలంలోని కడపాయపల్లెలో భూవివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ విషయమై ఆదివారం అధికారులను గ్రామంలోకి రాకుండా స్థానిక దళితులు అడ్డుకున్నారు. -
ఎన్నికల అలవెన్సుల మంజూరుకు డిమాండు
[ 20-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించిన ఆశా కార్యకర్తలకు ఎన్నికల అలవెన్సును తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ -
అందాల కొండ... నష్టాలే నిండా!
[ 20-05-2024]
రాష్ట్రంలో వేసవి విడిది కేంద్రంగా గుర్తింపు పొందిన హార్సిలీహిల్స్కు పర్యాటకుల తాకిడి తగ్గింది. గత ఏడాది వేసవి సీజన్తో పోల్చిచూస్తే పర్యాటకుల సంఖ్యతో పాటు వ్యాపారాలు పడిపోయాయి. -
ఎండుతున్న చీనీతోటలు.. అన్నదాతలకు కన్నీళ్లు
[ 20-05-2024]
చీనీపంట అంటేనే ఒకప్పుడు కాసులు కురిపించే పంట. కానీ ప్రస్తుతం చీడపీడలతో ఎండిపోతున్నాయి. -
సౌరభం.. సులభంగా శుభ్రం
[ 20-05-2024]
దేశంలో ఎక్కడ చూసినా సోలార్ వినియోగం ఘననీయంగా పెరుగుతోంది. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడం వరకు బాగానే ఉన్నా... దానిపై పడి దుమ్ము, ధూళీ కారణంగా ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గి నష్టం వచ్చే అవకాశం ఉంది. -
వేసవి వినోదం... విజ్ఞాన సంబరం
[ 20-05-2024]
ఒకనాడు వేసవి సెలవులంటే పిల్లలంతా బంధువుల ఇంటికి.. విహార యాత్రలకు వెళ్లేవారు. -
ఇసుక తోడేళ్ల పాపం... తలా పిడికెడు
[ 20-05-2024]
మండలంలోని దర్జిపల్లి శివారులో (గొల్లపల్లి రేవు పేరిట) అధికారులు రెండు నెలల కిందట అనుమతిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
-
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!