నామపత్రాల ఉప సంహరణలు
ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి దాఖలు చేసిన 21 మంది అభ్యర్థుల్లో ఆరుగురు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలోని ఆర్వో కౌసర్ బాను వద్దకు వెళ్లి ఆరుగురు పోటీ నుంచి వైదొలుగుతున్నామని సంతకాలు చేశారు.
మాట్లాడుతున్న ప్రత్యేక పరిశీలకులు భానుదాసు పలావె, రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్
ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్టుడే: ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి దాఖలు చేసిన 21 మంది అభ్యర్థుల్లో ఆరుగురు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలోని ఆర్వో కౌసర్ బాను వద్దకు వెళ్లి ఆరుగురు పోటీ నుంచి వైదొలుగుతున్నామని సంతకాలు చేశారు. చివరకు 15 మంది మిగిలారు. దీంతో అభ్యర్థులకు ఎన్నికల చిహ్నాలను ఆర్వో ఖరారు చేశారు. ప్రధాన అభ్యర్థులైన నంద్యాల వరదరాజులురెడ్డి (తెదేపా-సైకిల్), రాచమల్లు శివప్రసాదురెడ్డి (వైకాపా-ఫ్యాను), పీఎండీ నజీర్ (కాంగ్రెస్పార్టీ-హస్తం) పోటీలో ఉన్నారు.
ఎన్నికల బరిలో మున్సిపల్ వైస్ఛైర్మన్ బంగారురెడ్డి : ప్రొద్దుటూరు శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఆర్వో కౌసర్ బాను సోమవారం ఆమోదం తెలిపిన 15 మంది అభ్యర్థుల్లో మున్సిపల్ వైస్ ఛైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి పోటీలో ఉన్నారు. కానీ నామినేషన్ పత్రంలో అతని పేరులో గందరగోళం, స్పష్టత లేని ఫొటో, ఇంటి పేరు గుర్తించని విధంగా వివరాలు ఉన్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఖరారు చేసిన అభ్యర్థుల తుది జాబితాలో 10వ వరుస సంఖ్యలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పేరు మీదుగా సింహం గుర్తుపై పి.మునిరెడ్డి బంగారు అనే అక్షరాలతోపాటు ఫొటో నిశితంగా గమనిస్తేకానీ గుర్తుపట్టని విధంగా గుండు ఉన్న ముఖం ఉండటం గమనార్హం.
బద్వేలులో.. : బద్వేలు : బద్వేలు ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రధాన పార్టీలైన వైకాపా అభ్యర్థి సుధ, ఉమ్మడి కూటమి అభ్యర్థి రోశన్న, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయజ్యోతితోపాటు స్వతంత్ర, వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
జమ్మలమడుగులో : జమ్మలమడుగు: జమ్మలమడుగు అసెంబ్లీ బరిలో 15 మంది ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 24 మందిలో చివరి రోజు 9 మంది నామినేషన్లను ఉప సంహరించుకున్నట్లు తెలిపారు. పోటీలో ఆదినారాయణరెడ్డి, భాజపా (కమలం), ఓబయ్య, బహుజన సమాజ్ పార్టీ (ఏనుగు), పాముల బ్రహ్మానందరెడ్డి, కాంగ్రెస్ (హస్తం), మూలె సుధీర్రెడ్డి, వైకాపా (ఫ్యాను) ఉన్నారు.
మైదుకూరులో.. మైదుకూరు: నియోజకవర్గంలో 15మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. బహుజన సమాజ్ పార్టీ నుంచి డి.ఎస్.కల్యాణ్, కాంగ్రెస్ పార్టీ నుంచి గుండ్లకుంట శ్రీరాములు, తెదేపా నుంచి పుట్టా సుధాకర్యాదవ్, వైకాపా నుంచి శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గొడవలకు దిగితే రౌడీషీట్
[ 17-05-2024]
మండలంలోని పోరుమామిళ్ల సర్కిల్ పరిధిలోని పోరుమామిళ్ల, కలసపాడు, కాశీనాయన పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గొడవలకు దిగితే రౌడీషీట్ తెరవడంతో పాటు జిల్లా, మండల బహిష్కరణ చేస్తామని ... -
నిబంధనలకు పాతర... ఇసుకాసురుల జాతర..!
[ 17-05-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, అక్రమాలు ఆపాలన్న ఆదేశాలను పక్కనబెట్టి యథేచ్ఛగా కొనసాగించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకోలేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ధర్మాసనం మండి పడింది. -
బద్వేలులో భూఆక్రమణ!
[ 17-05-2024]
నియోజకవర్గ కేంద్రమైన బద్వేలు పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ప్రజావసరాలకు కేటాయించిన రూ.కోట్ల విలువైన ఎకరా విస్తీర్ణంలోని ప్రభుత్వ స్థలంపై ఆక్రమార్కుల కన్ను పడింది. -
వేసవి శిక్షణ... తప్పని నిరీక్షణ!
[ 17-05-2024]
ఏడాదిపాటు చదువులతో అలిసిపోయిన విద్యార్థులకు కాస్తంత ఊరట, వినోదం కోసం నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం క్రీడాకారులను నిరాశ పరుస్తోంది. -
నిప్పులార్పగలరు... భవనాలూ నిర్మించగలరు
[ 17-05-2024]
దృఢ సంకల్పం, పవిత్ర ఆశయం తప్పక సత్ఫలితాలిస్తాయి. వీటిని ఆయుధాలుగా చేపట్టిన వారు విజయాలను సాధిస్తారనే స్వామి వివేకానందుడి సూక్తిని నిజం చేశారు ప్రొద్దుటూరు అగ్నిమాపక, విపత్తుల శాఖలో ఫైర్మెన్గా పని చేసే ఒ.నరేంద్రకుమార్. ఉద్యోగం రాకముందు బేల్దారి పని చేసి జీవించేవారు. -
సీఎం బటన్ నొక్కినా జమకాని నగదు
[ 17-05-2024]
సీఎం జగన్ వివిధ సంక్షేమ పథకాలకు బటన్ నొక్కినా నిధులు ఎక్కడున్నాయో తెలియడం లేదని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్రెడ్డి ప్రశ్నించారు. -
ఏడేళ్లనంతరం గండికోట జలాల తగ్గుముఖం
[ 17-05-2024]
ఏడేళ్లనంతరం గండికోట జలాశయంలో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయి 2.9 టీఎంసీలకు చేరింది. జలాశయానికి తొలిసారిగా 2013, సెప్టెంబరులో నంద్యాల జిల్లా అవుకు జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించి మూడు టీఎంసీల నీటిని నిల్వ చేశారు. -
మండిపల్లి గృహనిర్బంధం
[ 17-05-2024]
చిన్నమండెం మండలం బోడిరెడ్డిగారిపల్లెలో గురువారం తెదేపా రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డిని పోలీసులు ఆయన స్వగృహంలో గృహనిర్బంధం చేశారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనలో
[ 17-05-2024]
చిత్తూరు జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నానికి పాల్పడిన 13 మందిని 14 రోజుల రిమాండు నిమిత్తం కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
ఏపీలో ఎన్నికల ముందు తర్వాత హింసపై సిట్ ..ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విజయవాడ డివిజన్ పరిధిలో 14 రైళ్లు రద్దు
-
గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. త్వరలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్!
-
మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు.. రూ. 60లక్షలు చెల్లించండి!