రెండు సార్లు వచ్చావ్... ఉక్కుకేమి చేశావ్?
ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆ పెద్ద మనిషి (అప్పటి సీఎం చంద్రబాబు) టెంకాయ కొట్టాడు. ఒకసారి ఆలోచించమని చెబుతున్నా ప్రజలు ఐదేళ్ల పరిపాలనకు అధికారం ఇస్తారు. నాలుగున్నరేళ్లు ఏమీ చేయకుండా ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే మోసం అంటారు.
పరిశ్రమ ఏర్పాటుకు సీఎం జగన్ భూమి పూజలు
నేటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడని వైనం
నిరుద్యోగ యువతకు వైకాపా సర్కారు నయవంచన
2023 ఫిబ్రవరి 15న రెండోసారి ఉక్కు పరిశ్రమ కోసం జేఎస్డబ్ల్యు ఛైర్మన్ సజ్జన్ జిందాల్తో కలసి భూమి పూజలో పాల్గొన్న సీఎం జగన్ (పాత చిత్రం)
ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆ పెద్ద మనిషి (అప్పటి సీఎం చంద్రబాబు) టెంకాయ కొట్టాడు. ఒకసారి ఆలోచించమని చెబుతున్నా ప్రజలు ఐదేళ్ల పరిపాలనకు అధికారం ఇస్తారు. నాలుగున్నరేళ్లు ఏమీ చేయకుండా ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే మోసం అంటారు. అదే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకు టెంకాయ కొడితే చిత్తశుద్ధి అంటారు. పాలనలో తేడా ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మూడేళ్లలో ఉక్కు పరిశ్రమ పూర్తి చేసి ప్రారంభిస్తాం.
జమ్మలమడుగు మండలం కన్యతీర్థం బహిరంగ సభలో 2019 డిసెంబరు 23న సీఎం జగన్ చెప్పిన మాటలు
30 నెలల్లో ఉక్కు పరిశ్రమ మొదటి దశ అనంతరం, ఐదేళ్లలో రెండో దశ నిర్మాణం పూర్తవుతుంది. దీని నిర్మాణానికి సజ్జన్ జిందాల్ ముందుకు రావడం అభినందనీయం. ఈ నిర్మాణం 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతోనే ఆగిపోదు. పరిశ్రమతో వైయస్సార్ జిల్లా ముఖ చిత్రమే మారిపోతుంది. రూ.8,800 కోట్లతో పరిశ్రమ నిర్మాణం జరుగుతుంది. ఉక్కు పరిశ్రమకు సహాయ సహకారాలు అందిస్తాం. మొత్తం 3,500 ఎకరాలు జిందాల్ కంపెనీకి ఇవ్వడమే కాకుండా రూ.700 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. తద్వారా అనుబంధ పరిశ్రమలు ఏర్పాటవుతాయి. ఇక్కడో స్టీల్ సిటీ వస్తుంది. ప్రొద్దు టూరు - ఎర్రగుంట్ల రైల్వేలైను కలుపుతూ మరో పది కిలోమీటర్లు కొత్త లైను నిర్మాణం చేపడతాం.
2023 ఫిబ్రవరి 15 జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో వైయస్సార్ స్టీల్ కార్పొరేషన్ రెండోసారి భూమి పూజలో సీఎం జగన్ చెప్పిన మాటలు
న్యూస్టుడే, జమ్మలమడుగు: జమ్మలమడుగు మండలం కన్యతీర్థం వద్ద 2019, డిసెంబరు 23న ఒకసారి, 2023, ఫిబ్రవరి 15న రెండోసారి సీఎం జగన్ ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ముందుగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు లిబర్టీ స్టీలు కంపెనీ ఆసక్తి చూపింది. ఆర్థిక వెసులుబాటు వంటి కారణాలతో ఒప్పందం రద్దయింది. అనంతరం ఎస్ఆర్ స్టీలు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అది కూడా తప్పుకోవడంతో జేఎస్డబ్ల్యూ కంపెనీ ముందుకొచ్చింది. పరిశ్రమ ఏర్పాటుకు రూ.8,800 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వంతో ఒప్పందం కుదురుర్చుకుంది. ‘మొదటి విడతలో రూ.3,300 కోట్లు వెచ్చించి త్వరలో పనులు ప్రారంభిస్తుంది. మొదటి దశలో ఏడాదికి మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేస్తుంది. రెండో విడతలో ఏడాదికి మరో 2 మిలియన్ టన్నులు తయారు చేస్తుంది. వెనుకబడ్డ రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చే ప్రక్రియలో ఇదొక గొప్ప ప్రయత్నం’ అని సీఎం జగన్ ఆ సమయంలో ప్రకటించడంతో జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె - పెద్ద దండ్లూరు గ్రామాల మధ్యలో 3,148.68 ఎకరాల్లో రూ.11,606 కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జేఎస్డబ్ల్యూ స్టీల్స్కు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తే... 25 వేల మంది యువతకు ప్రత్యక్షంగా, మరో లక్ష మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామన్నారు. 2023, ఏప్రిల్ ఆఖరు నుంచి పనులు పూర్తిస్థాయిలో మొదలవుతాయని సీఎం చెప్పినా కార్యరూపం దాల్చలేదు. ఇంత వరకు అక్కడ రెండు కిలోమీటర్ల మేర ప్రహరీ నిర్మాణ పనులు జరిగాయి. ఇంకా 22 కిలోమీటర్ల ప్రహరీ ఏర్పాటు చేయాల్సి ఉండగా, బిల్లుల చెల్లింపుల్లేక పనులు నిలిచిపోయాయి.
ఆగుతూ...సాగుతున్న రహదారి పనులు
జమ్మలమడుగు కొత్త రోడ్డు నుంచి స్టీల్ప్లాంటు వరకు నాలుగు వరుసల రహదారి పనులు జరుగుతున్నాయి. ఉక్కు పరిశ్రమ నిర్మిత ప్రాంతం వరకు ఆధునిక తరహాలో రహదారి ఏర్పాటుకు 2021, జూన్ 4వ తేదీన ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పనులను ప్రారంభించారు. కొంత వరకు మట్టి పనులు జరిగాయి. ఆ తర్వాత నిధులు విడుదల కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. కొద్ది రోజులుగా పనులు మొదలయ్యాయి. మొత్తం 7.5 కిలోమీటర్లకు రూ.22.50 కోట్లు కేటాయించారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి.
పరిహారం: వైయస్సార్ స్టీల్ కార్పొరేషన్ కోసం 3148.68 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించారు. జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరులో 1390.60 ఎకరాలు, సున్నపురాళ్లపల్లె గ్రామంలో 1758.08 ఎకరాలు సేకరించారు. వీటితోపాటు 409.48 ఎకరాల డీకేటీ భూమిని సేకరించారు. ఇందులో 379 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా 286 మందికి ఒక ఎకరా చొప్పున రూ.3.75 లక్షల వంతున నగదు జమ చేశారు. చిరునామా, పేరు మార్పులు వంటి కారణాలతో చాలామందికి పరిహారం అందలేదు.
పుట్టిన గడ్డకు మేలు చేస్తారనుకుంటే
మన ప్రాంతంలో ఉక్కు కర్మాగారం వస్తే చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. నిరుద్యోగ సమస్య తీరుతుంది. జిల్లా వాసి జగన్ సీఎం కాగానే పుట్టిన గడ్డను మేలు చేస్తారని యువత ఆశపడ్డారు. ఒకసారి కాదు రెండు సార్లు ఉక్కు పరిశ్రమ కోసం శంకుస్థాపన చేసినా కార్యరూపం దాల్చక పోవడం బాధాకరం
ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగు
జమ్మలమడుగు రూపురేఖలు మారుతాయనుకున్నాం
సీఎం జగన్ ఉక్కు పరిశ్రమ కోసం శంకుస్థాపన చేయగానే జమ్మలమడుగు రూపురేఖలు మారుతాయని అనుకున్నాం. ఉక్కు పరిశ్రమ వస్తే దాంతో పాటు అనుబంధ పరిశ్రమలు వస్తాయి. యువతకు ఉద్యోగాలు లభిస్తాయని, వలసలు తగ్గుతాయని అనుకుంటే సీఎం జగన్ మా ఆశలను సమాధి చేశారు.
సుబ్బరాయుడు, జమ్మలమడుగు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ముగ్గురిని జిల్లా దాటించారు!
[ 18-05-2024]
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలను కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జమ్మలమడుగు, కడప నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసుశాఖ డేగ కళ్లలో నిఘా పెట్టింది. -
కాలేటివాగులో కాలనాగులు
[ 18-05-2024]
ప్రతిష్ఠాత్మకమైన హంద్రీ-నీవా ప్రాజెక్టు ఉండగా, దీనికి సమాంతరంగా మరొక దానిని ప్రతిపాదించి రూ.వేల కోట్లతో పనులు చేపట్టారు. కాలేటివాగు ప్రాజెక్టు ప్రతిపాదనపై ఆది నుంచి విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాధనం కొల్లకొట్టడానికే ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారంటూ విపక్షాలు సైతం దుమ్మెత్తి పోస్తున్నాయి. -
పోలీసు విధుల్లో కొరవడిన ‘చైతన్య’ం!
[ 18-05-2024]
తాడిపత్రికి స్పెషల్ డ్యూటీ పేరిట అర్ధరాత్రి పూట వెళ్లి జేసీ ప్రభాకర్రెడ్డి ఇంట్లోని పనివాళ్లను విచక్షణారహితంగా కొట్టడం... ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం... దివ్యాంగుడైన కంప్యూటరు అపరేటర్ కిరణ్ తల పగలుకొట్టడం... ఉద్రిక్తతలను తగ్గించాల్సింది పోయి మరింతగా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం. -
పురజనుల కష్టాలు చూస్తేనే జలదరింపు!
[ 18-05-2024]
జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. వర్షాభావం, కరవు రక్కసితో జలవనరులు పూర్తిగా వట్టి పోయాయి. ప్రధానంగా పట్టణ వాసులు గొంతు తడుపుకొనేందుకు, వాడుకోవడానికి బిందెడు నీళ్లు దొరక్క నరకం చూస్తున్నారు. ప్రతిరోజూ రూ.600 నుంచి రూ.1,000 వరకు ఖర్చు పెట్టి ట్యాంకర్లతో తాగునీటిని కొనుగోలు చేసుకుని గొంతు తడుపుకొంటున్నారు. -
జయజయధ్వానాలతో మార్మోగిన బ్రహ్మంగారిమఠం
[ 18-05-2024]
భక్తులు జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై అనే నామస్మరణతో బ్రహ్మంగారి మఠ ఆవరణ మారుమోగింది. జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం, ఆరాధన గురు పూజా మహోత్సవంలో శుక్రవారం స్వామి వారు దీక్షా బంధన ఆలంకారోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
డబ్బులుంటేనే దప్పిక తీరేది!
[ 18-05-2024]
జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. వర్షాభావం, కరవు రక్కసితో జలవనరులు పూర్తిగా వట్టి పోయాయి. ప్రధానంగా పట్టణ వాసులు గొంతు తడుపుకొనేందుకు, వాడుకోవడానికి బిందెడు నీళ్లు దొరక్క నరకం చూస్తున్నారు. ప్రతిరోజూ రూ.600 నుంచి రూ.1,000 వరకు ఖర్చు పెట్టి ట్యాంకర్లతో తాగునీటిని కొనుగోలు చేసుకుని గొంతు తడుపుకొంటున్నారు. -
అగ్నిమాపక శాఖలో అసౌకర్యాల మంట
[ 18-05-2024]
అగ్ని ప్రమాదం చోటు చేసుసుకుంటే వెంటనే మంటలు ఆర్పేయాలి.. లేకుంటే ఆస్తి నష్టం జరుగుతుంది. ఒక్కో సారి ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో చిన్నపాటి మంటలు చెలరేగినా అధిక ఉష్ణోగ్రతలతో ఈదురు గాలుల తీవ్రతతో క్షణాల్లోనే మంటలు వ్యాపిస్తున్నాయి. -
ఇసుకాసురులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
[ 18-05-2024]
ఇసుకాసురులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివ డిమాండ్ చేశారు. శుక్రవారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న గుర్రంకొండ మండలంలోని తరిగొండ రామానాయుడు చెరువును పరిశీలించారు. -
తెదేపా కార్యకర్తపై వైకాపా నేతల దాడి
[ 18-05-2024]
ట్యాంకు నుంచి తమ ఇంటికి ఏర్పాటు చేసుకున్న తాగునీటి పైపును వైకాపా నేతలు అకారణంగా కోసేశారని... ఎందుకు ఇలా చేశారని అడిగిన పాపానికి మూకుమ్మడిగా దాడి చేశారని చిన్నమండెం మండలం మల్లూరు క్రాస్కు చెందిన తెదేపా కార్యకర్త కదిరి చిన్నప్ప ఆవేదన వ్యక్తం చేశారు. -
అనుమానాస్పద స్థితిలో హిజ్రా మృతి
[ 18-05-2024]
అనుమానాస్పద స్థితిలో హిజ్రా మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కేశాపురం గ్రామం గుట్టమోటు ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో ఓ చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. -
వడదెబ్బతో ఇద్దరు ఉపాధి కూలీల మృతి
[ 18-05-2024]
వడదెబ్బకు గురై ఇద్దరు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలు వేర్వేరు ప్రాంతాల్లో మృతి చెందారు. రైల్వేకోడూరు మండల పరిధిలోని బొజ్జవారిపల్లె పంచాయతీ బంగ్లామిట్టకు చెందిన పాలెంకోట వెంకటేషు (55) శుక్రవారం గ్రామ సమీపంలో చేపట్టిన ఉపాధి హామీ పని చేస్తుండగా ఎండ తీవ్రతకు తాళలేక కుప్పకూలిపోయారు. -
మదనపల్లెలో ఆర్ఎస్ఎస్ దక్షిణాది రాష్ట్రాల శిక్షణ శిబిరం
[ 18-05-2024]
మదనపల్లె మండలంలోని శ్రీ వేద పాఠశాలలో శనివారం నుంచి ఆర్ఎస్ఎస్ దక్షిణాది రాష్ట్రాల శిక్షణ శిబిరం జరగనున్నట్లు ఆర్ఎస్ఎస్ నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మదనపల్లెకు రానున్న నేపథ్యంలో మదనపల్లె డీఎస్పీ ప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాలలో తనిఖీలు చేపట్టారు.