పులివెందులలో ప్రజాస్వామ్యం అపహాస్యం!
సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికలు ఎన్నడూ ప్రజాస్వామ్యబద్ధంగా జరగడంలేదు. వైకాపా మినహా ఇతర పార్టీల ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లో కూర్చోనివ్వడంలేదు.
తెదేపా ఏజెంట్లను లొంగదీసుకునే ఎత్తులు
లేదంటే ఆర్థికంగా దెబ్బతీసేందుకు కుట్రలు
దాడులు, ఎదురు కేసులు పెట్టేందుకు యత్నాలు
50 శాతం పోలింగ్ కేంద్రాల్లో ఇదే వ్యవహారం
పులివెందుల
ఈనాడు, కడప: సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికలు ఎన్నడూ ప్రజాస్వామ్యబద్ధంగా జరగడంలేదు. వైకాపా మినహా ఇతర పార్టీల ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లో కూర్చోనివ్వడంలేదు. దౌర్జన్యంగా ఏకపక్షంగా పోలింగ్ జరిపించుకునే కుతంత్రాలు సాగిస్తారు. ఓటరు తన అభిప్రాయం మేరకు ఓటుహక్కు వినియోగించుకునే వాతావరణం ఉండదు. వైకాపా నేతల గుప్పిట్లో పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ లింగాల గ్రామంలో తెదేపా ఏజెంట్లపై దాడి జరిగింది. గత అనుభవాలతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించడానికి ఎన్నికల సంఘం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
- పులివెందులలో వైకాపా మినహా ఇతర పార్టీలు స్వేచ్ఛగా ప్రచారం నిర్వహించుకునే పరిస్థితుల్లేవు. గతేడాది సెప్టెంబరు 8న తెదేపా అధినేత చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా గండికోట ప్రాజెక్టు సందర్శించి పులివెందుల నుంచి అనంతపురం వెళుతుండగా అంబకపల్లెలో తెదేపా కార్యకర్త నాగరాజు బాణసంచా కాల్చారనే కారణంగా అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు.
- ఇటీవల పీసీసీ అధ్యక్షురాలు షర్మిల లింగాల గ్రామానికి ఎన్నికల ప్రచానికి వెళ్లిన సమయంలో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వివేకా కుమార్తె సునీతకు అడ్డంకులు సృష్టించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు పలుసార్లు విజ్ఞప్తులు చేసినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.
- లింగాల మండలం లింగాల, తాతిరెడ్డిపల్లె, రామన్నూతనపల్లె, చిన్నకుండాల, అంబకంపల్లె, మురారిచింతల, కోమన్నుతుల, దిగువపల్లె, ఎగువపల్లెలో వైకాపా తప్ప ఇతర పార్టీల ఏజెంట్లను కూర్చోనివ్వడం లేదు. ఏజెంట్ ఫారాలు తీసుకొచ్చిన వ్యక్తిని ప్రలోభాలతో లోబర్చుకునే ప్రయత్నం చేస్తారు.
- పులివెందుల మండలపరిధిలో పెద్ద రంగాపురం, ఎర్రగుడిపల్లె, నగిరిగుట్ల పోలింగ్ కేంద్రాలను గతంలో వైకాపా తమ స్వాధీనం చేసుకుని గుండాగిరితో ఎన్నికలు జరిపించారు. నాలుగు రోజుల కిందట పెద్ద రంగాపురం గ్రామానికి సునీత ఎన్నికల ప్రచారానికి వెళ్లగా వైకాపా మూకలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి.
- సీఎం జగన్ స్వగ్రామం సింహాద్రిపురం మండలం బలపనూరులో ఏ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడంలేదు. వైకాపా తప్ప ఇతరులు ఏజెంట్గా కూర్చోవడానికి లేదు. 2019 ఎన్నికల్లో తెదేపా ఏజెంట్గా కూర్చున్న వ్యక్తి మోటారు పైపులు కత్తిరించి బోరులోకి పడిపోయేలా చేస్తామని హెచ్చరిస్తారు. దీంతో తెదేపా ఏజెంట్ ఉదయం 10 గంటల తర్వాత పోలింగ్ కేంద్రం నుంచి వెనక్కి వచ్చేశారు.
- నియోజకవర్గంలో 2,29,687 మంది ఓటుహక్కును వినియోగించుకోవడానికి 301 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో 124 పోలింగ్ కేంద్రాలు అత్యంత సమస్యాత్మక, 118 వరకు సమస్యాత్మకమైనవిగా గుర్తించినప్పటికీ ప్రజాస్వామ్యయుత ఎన్నికలకు చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో 14 నియోజక వర్గాల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్కు చర్యలు తీసుకోగా, ఇక్కడ లేకపోవడం గమనార్హం.
- నియోజకవర్గంలో దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం గొడవలు జరుగుతున్నాయి. పోల్కాని ఓట్లను దొంగ ఓట్లుగా వేయడానికి వైకాపా ప్రయత్నించడం, తెదేపా ఏజెంట్లు అడ్డుకోవడం, ప్రతిగా దాడులు చేయడం షరామామూలుగా మారాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి అల్లర్లు చెలరేగడం జరుగుతోంది.
- ప్రతిపక్షాల ఏజెంట్లను ముందుగానే గుర్తించి వారిని ప్రలోభాలకు గురిచేసేందుకు అన్ని రకాలు ఎత్తులు వేస్తారు. మొండిగా పోలింగ్ కేంద్రంలో కూర్చోవడానికి ప్రయత్నించే పక్షంలో వారి ఆస్తుల్ని ధ్వంసం చేయడం, కుటుంబ సభ్యుల్ని బెదిరించడం వంటి ఘటనలు గతంలో జరిగినా.. అడ్డుకునే దిశగా, ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిపిస్తామనే భరోసా ఇచ్చే ప్రయత్నాలు నియోజకవర్గంలో జరగలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కడప గౌస్నగర్ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం
[ 18-05-2024]
పోలింగ్ రోజున కడప గౌస్నగర్లో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడులు జరిగిన ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆ ముగ్గురిని జిల్లా దాటించారు!
[ 18-05-2024]
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలను కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జమ్మలమడుగు, కడప నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసుశాఖ డేగ కళ్లలో నిఘా పెట్టింది. -
కాలేటివాగులో కాలనాగులు
[ 18-05-2024]
ప్రతిష్ఠాత్మకమైన హంద్రీ-నీవా ప్రాజెక్టు ఉండగా, దీనికి సమాంతరంగా మరొక దానిని ప్రతిపాదించి రూ.వేల కోట్లతో పనులు చేపట్టారు. కాలేటివాగు ప్రాజెక్టు ప్రతిపాదనపై ఆది నుంచి విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాధనం కొల్లకొట్టడానికే ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారంటూ విపక్షాలు సైతం దుమ్మెత్తి పోస్తున్నాయి. -
పోలీసు విధుల్లో కొరవడిన ‘చైతన్య’ం!
[ 18-05-2024]
తాడిపత్రికి స్పెషల్ డ్యూటీ పేరిట అర్ధరాత్రి పూట వెళ్లి జేసీ ప్రభాకర్రెడ్డి ఇంట్లోని పనివాళ్లను విచక్షణారహితంగా కొట్టడం... ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం... దివ్యాంగుడైన కంప్యూటరు అపరేటర్ కిరణ్ తల పగలుకొట్టడం... ఉద్రిక్తతలను తగ్గించాల్సింది పోయి మరింతగా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం. -
పురజనుల కష్టాలు చూస్తేనే జలదరింపు!
[ 18-05-2024]
జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. వర్షాభావం, కరవు రక్కసితో జలవనరులు పూర్తిగా వట్టి పోయాయి. ప్రధానంగా పట్టణ వాసులు గొంతు తడుపుకొనేందుకు, వాడుకోవడానికి బిందెడు నీళ్లు దొరక్క నరకం చూస్తున్నారు. ప్రతిరోజూ రూ.600 నుంచి రూ.1,000 వరకు ఖర్చు పెట్టి ట్యాంకర్లతో తాగునీటిని కొనుగోలు చేసుకుని గొంతు తడుపుకొంటున్నారు. -
జయజయధ్వానాలతో మార్మోగిన బ్రహ్మంగారిమఠం
[ 18-05-2024]
భక్తులు జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై అనే నామస్మరణతో బ్రహ్మంగారి మఠ ఆవరణ మారుమోగింది. జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం, ఆరాధన గురు పూజా మహోత్సవంలో శుక్రవారం స్వామి వారు దీక్షా బంధన ఆలంకారోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
డబ్బులుంటేనే దప్పిక తీరేది!
[ 18-05-2024]
జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. వర్షాభావం, కరవు రక్కసితో జలవనరులు పూర్తిగా వట్టి పోయాయి. ప్రధానంగా పట్టణ వాసులు గొంతు తడుపుకొనేందుకు, వాడుకోవడానికి బిందెడు నీళ్లు దొరక్క నరకం చూస్తున్నారు. ప్రతిరోజూ రూ.600 నుంచి రూ.1,000 వరకు ఖర్చు పెట్టి ట్యాంకర్లతో తాగునీటిని కొనుగోలు చేసుకుని గొంతు తడుపుకొంటున్నారు. -
అగ్నిమాపక శాఖలో అసౌకర్యాల మంట
[ 18-05-2024]
అగ్ని ప్రమాదం చోటు చేసుసుకుంటే వెంటనే మంటలు ఆర్పేయాలి.. లేకుంటే ఆస్తి నష్టం జరుగుతుంది. ఒక్కో సారి ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో చిన్నపాటి మంటలు చెలరేగినా అధిక ఉష్ణోగ్రతలతో ఈదురు గాలుల తీవ్రతతో క్షణాల్లోనే మంటలు వ్యాపిస్తున్నాయి. -
ఇసుకాసురులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
[ 18-05-2024]
ఇసుకాసురులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివ డిమాండ్ చేశారు. శుక్రవారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న గుర్రంకొండ మండలంలోని తరిగొండ రామానాయుడు చెరువును పరిశీలించారు. -
తెదేపా కార్యకర్తపై వైకాపా నేతల దాడి
[ 18-05-2024]
ట్యాంకు నుంచి తమ ఇంటికి ఏర్పాటు చేసుకున్న తాగునీటి పైపును వైకాపా నేతలు అకారణంగా కోసేశారని... ఎందుకు ఇలా చేశారని అడిగిన పాపానికి మూకుమ్మడిగా దాడి చేశారని చిన్నమండెం మండలం మల్లూరు క్రాస్కు చెందిన తెదేపా కార్యకర్త కదిరి చిన్నప్ప ఆవేదన వ్యక్తం చేశారు. -
అనుమానాస్పద స్థితిలో హిజ్రా మృతి
[ 18-05-2024]
అనుమానాస్పద స్థితిలో హిజ్రా మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కేశాపురం గ్రామం గుట్టమోటు ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో ఓ చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. -
వడదెబ్బతో ఇద్దరు ఉపాధి కూలీల మృతి
[ 18-05-2024]
వడదెబ్బకు గురై ఇద్దరు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలు వేర్వేరు ప్రాంతాల్లో మృతి చెందారు. రైల్వేకోడూరు మండల పరిధిలోని బొజ్జవారిపల్లె పంచాయతీ బంగ్లామిట్టకు చెందిన పాలెంకోట వెంకటేషు (55) శుక్రవారం గ్రామ సమీపంలో చేపట్టిన ఉపాధి హామీ పని చేస్తుండగా ఎండ తీవ్రతకు తాళలేక కుప్పకూలిపోయారు. -
మదనపల్లెలో ఆర్ఎస్ఎస్ దక్షిణాది రాష్ట్రాల శిక్షణ శిబిరం
[ 18-05-2024]
మదనపల్లె మండలంలోని శ్రీ వేద పాఠశాలలో శనివారం నుంచి ఆర్ఎస్ఎస్ దక్షిణాది రాష్ట్రాల శిక్షణ శిబిరం జరగనున్నట్లు ఆర్ఎస్ఎస్ నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మదనపల్లెకు రానున్న నేపథ్యంలో మదనపల్లె డీఎస్పీ ప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాలలో తనిఖీలు చేపట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు