బోరుమంటున్న జగన్ హామీ!
వ్యవసాయ ఉత్పాదకత పెంపులో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు ఆసరాగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బోర్లు వేయడంతో పాటు, మోటారు, పైపులు, విద్యుత్తు నియంత్రికలు ఏర్పాటు చేయిస్తామని సీఎం జగన్ గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు.
జలకళ పథకం కింద 7,811
దరఖాస్తులు ఇప్పటివరకు తవ్వింది కేవలం 326 బోర్లే
ఎండిపోతున్న పంట పొలాలు, తోటలు
న్యూస్టుడే, రాజంపేట గ్రామీణ
రాజంపేట మండలంలో బోరునీరు లేక ఎండిపోయిన అరటి తోటలు
వ్యవసాయ ఉత్పాదకత పెంపులో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు ఆసరాగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బోర్లు వేయడంతో పాటు, మోటారు, పైపులు, విద్యుత్తు నియంత్రికలు ఏర్పాటు చేయిస్తామని సీఎం జగన్ గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక 2020, సెప్టెంబరు 28న ‘వైఎస్ఆర్ జలకళ’ పేరుతో పథకాన్ని ఆయనే స్వయంగా ప్రారంభించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కొంత కాలానికి నిబంధన కొర్రీలు వేసి పథకాన్ని నీరుగార్చింది. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప ఒరిగిందేమీ లేదని రైతులు పెదవి విరుస్తున్నారు.
వైయస్ఆర్ జలకళ పథకం ప్రారంభ దశలో బోరు తవ్వకంతోపాటు విద్యుత్తు కనెక్షన్, పంపుసెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఎక్కవ నిధులు విద్యుత్తు కనెక్షన్కే అవుతుండటంతో కొత్త మార్గదర్శకాలు రూపొందించారు. విద్యుత్తు సరఫరా, పంపుసెట్లు, వ్యయం పూర్తిగా రైతులే భరించాలని మెలిక పెట్టారు. దీంతో బోర్లు వేయడం వరకే పరిమితం చేశారు. విద్యుత్తు తీగలు, నియంత్రికలు అందుబాటులో ఉన్నాయని రైతులు చెబుతున్నా బోర్లు మాత్రం వేయడం లేదు. దీంతో ఈ పథకం ఉద్దేశం నీరుగారిపోయింది.
పథకం ప్రారంభ దశలో కొంత మంది రైతులకే అవకాశం ఇవ్వడంతో చాలా మంది కర్షకుల నుంచి వ్యతిరేకత రావడంతో దరఖాస్తు చేసుకునే వారందరికీ న్యాయం చేస్తామని చెప్పడంతో ఎక్కువ మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం కొంత మేర నిధులు మాత్రమే ఇస్తామని చెప్పడంతో వారంతా అయోమయంలో పడ్డారు. బోర్లు మాత్రమే వేయిస్తామని మోటారు, విద్యుత్తు కనెక్షన్ రైతులే ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆ తరువాత బోర్లు వేసినా గుత్తేదారులకు నిధులు అందకపోవడంతో బోర్లు వేయించడం నిలిపివేశారు. రాజంపేట నియోజకర్గంలో 337 మంది రైతులు జలకళ పథకానికి దరఖాస్తులు చేసుకోగా ఒక్క బోరు వేసిన పాపాన పోలేదు.
ఆకేపాడులో ఆరటి తోటలు ఎండిపోవడంతో బోర్లు వేయించుకుంటున్న రైతులు
ప్రభుత్వం రైతులను ఆదుకోలేదు
- రాంమోహన్రాజు, రైతు, హస్తివారిపల్లి
భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. రైతులు సాగు చేసిన పంటలను వదిలేసే స్థితికి వచ్చాం. చాలా బోర్లు వేసినా నీరు రావడంలేదు. ఒక బోరు వేయాలంటే రూ.లక్ష ఖర్చవుతోంది. జలకళ పథకం కింద దరఖాస్తు చేసుకున్నా ఉపయోగం లేకుండాపోయింది. కనీసం బోర్లు వేసే ఖర్చయినా ప్రభుత్వం చూసుకుంటే మేము విద్యుత్తు కనెక్షన్ తీసుకుంటామని చెప్పినా అధికారులు స్పందించ లేదు
ఒక్కరికీ¨ లబ్ధి చేకూరలేదు
- నరసింహులు, రైతు, గుండాలపల్లి, రాజంపేట మండలం
మా గ్రామంలో ఎవరికీ జలకళ పథకం తెలియదు. అధికారులను సంప్రదించగా పంచాయతీకి రాలేదని చెప్పారు. అయిదేళ్లవుతున్నా పథకంతో ఒక్కరూ లబ్ధి పొందలేదు. నేను ఆరు బోర్లు వేయించాను నాకు దాదాపు రూ.ఆరు లక్షలు ఖర్చయింది. అధికారులు జలకళ ద్వారా బోర్లు వేయించి ఉంటే మాకు చాలా వరకు ఖర్చులు తగ్గడంతోపాటు నీరున్న ప్రాంతాన్ని అధికారులు గుర్తించే అవకాశం ఉండేది.
జలకళ పథకం అమలు ఇలా...
రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులు : 7,811
తవ్వడానికి అనుమతులు ఇచ్చింది : 5,510
బోర్లు వేయడానికి ఏపీడీ అనుమతి : 931
బోర్లు వేసిన సంఖ్య : 326
ఖర్చు చేసిన నగదు : రూ.1.59 కోట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాయ్ రాజా కాయ్!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. వచ్చే నెల 4న అభ్యర్థుల భవితవ్యం వెల్లడి కానుంది. విజయం ఎవరిని వరిస్తుందనే చర్చ సర్వత్రా నడుస్తోంది. మరో వైపు గెలుపు ఓటములపై బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. -
బ్రహ్మరథంపై వీరబ్రహ్మేంద్రస్వామి దివ్యదర్శనం
[ 19-05-2024]
శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజా మహోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన మహాబ్రహ్మ రథోత్సవం శనివారం సాయంత్రం బ్రహ్మంగారిమఠంలోని మాడ వీధుల్లో నేత్రపర్వంగా సాగింది. -
వంగిపోయారా? లొంగిపోయారా?
[ 19-05-2024]
ఎన్నికల పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తున్న తరుణంలో ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తమ శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఎన్నికల సంఘం దృష్టి సారించక ముందే బాధ్యులపై చర్యలకు కసరత్తు ప్రారంభించారు. -
భూసార పరీక్షలపై శీతకన్ను!
[ 19-05-2024]
వేసవిలో భూసార పరీక్షలను యజ్ఞంలా చేయాలనే మాటను అపద్ధర్మ ప్రభుత్వం విస్మరించింది. పూర్తిగా శీతకన్ను వేసింది. గతేడాది మట్టి నమూనాలను సేకరించారు. యంత్ర సామగ్రి, రసాయనాల కొనుగోలు చేయడానికి నిధులివ్వకపోవడంతో విశ్లేషణ చేయకుండా పక్కన పెట్టేశారు. -
నిలిచిన ఇసుక తవ్వకాలు
[ 19-05-2024]
అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. ప్రొద్దుటూరు పరిసరాల్లో మాత్రం వైకాపా కీలక నేతలు తవ్వకాలు కొనసాగిస్తుండగా అధికారులు పట్టించుకోవడంలేదు. -
గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే బాధితులకు అందని పరిహారం
[ 19-05-2024]
తమకు పరిహారం అందకపోవడంతో బెంగళూరు-విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులను అడ్డుకుంటామని బాధిత రైతులు హెచ్చరించారు. -
సుప్రీంకోర్టు ఉత్తర్వులు హర్షనీయం
[ 19-05-2024]
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై మాట్లాడ వద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులివ్వడం హర్షనీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా సెల్ విభాగం ఛైర్మన్ తులసిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమి కబ్జా
[ 19-05-2024]
సిద్దవటం మండలం టక్కోలు గ్రామ సచివాలయం సమీపంలో రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమిని స్థానిక వైకాపా నేత కబ్జా చేసి రాత్రికిరాత్రే మామిడి మొక్కలు నాటారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ భూకబ్జా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
తెలంగాణ ఈఏపీసెట్లో మెరిసిన మదనపల్లె విద్యార్థిని
[ 19-05-2024]
లక్ష్యం, పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చునని నిరూపించింది మదనపల్లెకు చెందిన ప్రణీత. తెలంగాణ ఈఏపీసెట్లో అగ్రికల్చర్ ఫార్మశీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకుంటోంది. -
ఆగడంలేదు... ఆపడంలేదు!
[ 19-05-2024]
మదనపల్లెలో వైకాపా నేతల అండదండలతో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ఇసుక దందా సాగిస్తున్నారు. నదులు, వంకలు, చెరువుల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు, రవాణా కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్