లక్షణమైన నటన.. కోటి మంది వీక్షణ
ఒకప్పుడు సినిమాల్లో నటించే వారికే గుర్తింపు వచ్చేది. ఆ రంగంలోని దర్శకులు, నిర్మాతలే వెలుగొందే వారు. నటన, రచనా రంగంలో ఎంత ప్రతిభ ఉన్నా సామాన్యులకు, సాధారణ ప్రజానీకానికి అవకాశాలు అందని ద్రాక్షగానే మిగిలేది.
గొడిసిర్యాల చిన్నారుల ప్రతిభ
బాలనట బలగంతో విష్ణు
మామడ/దస్తురాబాద్, న్యూస్టుడే: ఒకప్పుడు సినిమాల్లో నటించే వారికే గుర్తింపు వచ్చేది. ఆ రంగంలోని దర్శకులు, నిర్మాతలే వెలుగొందే వారు. నటన, రచనా రంగంలో ఎంత ప్రతిభ ఉన్నా సామాన్యులకు, సాధారణ ప్రజానీకానికి అవకాశాలు అందని ద్రాక్షగానే మిగిలేది. సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్్ ఛానళ్లు అందుబాటులోకొచ్చాక ప్రతిభ ఉంటే ఎవరైనా, ఎక్కడి నుంచైనా .హీరోలుగా మారేందుకు, దర్శకత్వం వహించేందుకు దారులు దగ్గరయ్యాయి. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గొడిసిర్యాలకు చెందిన ఓ యువకుడి మార్గదర్శనంలో తెరమీద ఇరగదీస్తున్న చిన్నారుల సన్నివేశాలు ఇందుకు నిదర్శనం.
‘స్వాతి’ ఏ పాత్రలోనైనా జీవిస్తుంది..
తెర వెనక విష్ణు..
గొడిసిర్యాలకు చెందిన సౌధాని విష్ణు డిగ్రీ పూర్తి చేశారు. అంగవైకల్యంతో ఆయన చిన్నప్పటి నుంచి అనేక కష్టనష్టాలెదుర్కొన్నారు. ఉన్నత తరగతులకు పక్క ఊరి బడికెళ్లేందుకు సైకిల్ నడపలేని పరిస్థితి. అవిటితనం బాధపెట్టినా పని చేయకుంటే కుదరని పేదరికం. ఎన్ని అడ్డంకులెదురైనా పక్క గ్రామానికి వెళ్లి పదో తరగతి, ఆ తర్వాత జన్నారం, జగిత్యాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఇప్పుడు సొంతూరులో ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇంతకే పరిమితమై ఉంటే అతడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఓ యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి బాల నటులచే భళా అనిపిస్తూ తెర వెనక ఆయన చేస్తున్న కృషి అభినందనీయం.
మదిలో మెదిలిన ఆలోచనలతో..
ఆధునిక పోకడలతో అంతరించి పోతున్న పల్లె పదాలు, జానపదాలు, గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను బతికించాలన్న తపన విష్ణులో బలంగా ఉంది. ఇందుకు యూట్యూబ్ను వేదిక చేసుకున్నారు. ‘ఎస్వీవై ఎడిటింగ్స్’ అనే ఛానల్ను 2022లో ప్రారంభించారు. నటనలో ప్రతిభ కనబరిచే అదే గ్రామానికి చెందిన పది మంది పిల్లలతో అద్భుతమైన, సందేశాత్మక లఘుచిత్రాలను తీస్తున్నారు. వాస్తవానికి దగ్గరగా ఉండే గ్రామీణ కుటుంబ నేపథ్యమున్న ఆయన కథాంశాలు, చిన్నారుల మహానటన లక్షల మందిని ఆకట్టుకుంటోంది. ‘నాయి దొరో’ అనే పాటను 5 లక్షల మంది వీక్షించారంటే మాటలా మరి.
భళా బాల నటులు..
అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక ఏ మాత్రం ప్రతిభ ఉన్నా అది విశ్వవ్యాప్తమవుతోంది. తన రచనా శైలిలో విష్ణు, నటనా ప్రతిభతో గొడిసిర్యాల చిన్నారుల పాటలు, లఘుచిత్రాలను ఇప్పటి వరకు 1,43,33,771 మంది వీక్షించారంటే ఈ ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మార్చిందనడంలో అతిశయోక్తి లేనట్లే.. ఆ యువకుడి దర్శకత్వంలో చిన్నారులు స్వాతి, నాగరాజు, రాహిణి, వినీష, వినయ్, నిషాంత్, విశ్వంత్, అక్షిత్, లల్లి, అభిరామ్, క్రిష్ నటనలో ఇప్పటి వరకు చిత్రీకరించిన ‘నాతో పెట్టుకోకు మరి, దుబాయ్ షేక్, బతుకమ్మ ఆడనివ్వక పోతే, ఆకాశి పండగకు అవ్వగారింటికి పోత, యారాండ్ల కొట్లాట, అప్పుతోటి తిప్పలు, వదినోళ్ల బర్రె సచ్చిపాయే, బస్సులేక బడికి ఇబ్బంది’ వంటి వీడియోలు జనాదారణ పొందాయి. పిల్లల చదువుకు ఇబ్బంది కాకుండా ఆదివారాల్లో, సెలవు దినాల్లో తల్లిదండ్రుల అనుమతితో ఊరి చుట్టూనే చిత్రీకరిస్తుంటారు. తమ గ్రామ పిల్లలు ఇంత బాగా నటిస్తారా అని ఎక్కడెక్కడో ఉండే వారు ఆసక్తితో చూస్తుంటారు.
సంతృప్తిగా ఉంది: విష్ణు
ఉన్నచోటే ఉండి పోతే ఈ రోజుల్లో ఎవరూ పట్టించుకోరు. పనిచేస్తూనే అదనంగా ఆసక్తి ఉన్న రంగంలో రాణిస్తే గుర్తింపు వస్తుంది. ఒకప్పుడు వైకల్యంతో ఇంటి నుంచి బయటకు వెళ్లలేని నేను ఈ రోజు ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే లఘు చిత్రాలు తీస్తున్నాను. మా ఊరి పిల్లలు అద్భుతంగా నటిస్తుండడంతో యూట్యూబ్లో నా ఛానల్కు చక్కని పేరొచ్చింది. పెద్దగా ఖర్చు లేకుండా చరవాణిని చిన్న స్టాండ్కు బిగించి స్థానికంగా తీస్తున్న సన్నివేశాలను వీక్షకులు ఆదరించడం సంతృప్తినిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తప్పిపోయిన చిన్నారులను చైల్డ్ లైన్కు అప్పగింత
[ 20-05-2024]
జిల్లా కేంద్రమైన అదిలాబాదులోని పంజాబ్ కూడలిలో ధనలక్ష్మి లాడ్జీ వద్ద ఏడుస్తూ ఉన్న ఇద్దరు తప్పిపోయిన చిన్నారులను స్పెషల్ బ్రాంచ్ పోలీస్ కానిస్టేబుల్ చిందం దేవిదాస్ చైల్డ్ లైన్కు అప్పగించారు. -
ప్రశాంతంగా టెట్
[ 20-05-2024]
ఉపాధ్యయ అర్హత పరీక్ష (టెట్) సోమవారం మొదటిరోజు ప్రశాంతంగా ముగిసింది. -
ఏఎన్ఎంలకు పనిభారాన్ని తగ్గించాలి
[ 20-05-2024]
జనాభా ప్రాతిపదికన రెండో ఏఎన్ఎంలను నియమించి పని భారాన్ని తగ్గించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు
[ 20-05-2024]
ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. -
విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలి
[ 20-05-2024]
భాజపా నాయకులు విమర్శలు చేసేముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆ పార్టీ జిల్లా నాయకురాలు అన్నపూర్ణ సూచించారు. -
గంగపుత్ర శివాలయంలో మహా అన్నదానం
[ 20-05-2024]
జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
పిడుగుల కాలం.. అన్నదాతల అప్రమత్తం
[ 20-05-2024]
ఎవరైనా కలచివేసే వార్త చెబితే పిడుగులాంటి వార్త చెప్పావు అని అంటుంటారు. ఇంత తీవ్రమైన పదం వాడారంటే ఆ పిడుగుకున్న శక్తి అలాంటిది మరి. తన శక్తిని కోల్పోయేందుకు అది ఆకాశం నుంచి నేల పైకి దూసుకొస్తుంది. మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి. -
అర్హులు ఎందరో.. వినియోగించుకుంది కొందరే
[ 20-05-2024]
వందశాతం పోలింగ్ నమోదే లక్ష్యంగా ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఆ అవకాశం వినియోగించుకునేలా ఎన్నికల సంఘం హోం ఓటింగ్కు అవకాశం కల్పించినా.. కొద్ది మందే ఆ సదుపాయం వినియోగించుకున్నారు. -
ఫలరాజం.. ప్రాణాంతకం
[ 20-05-2024]
మనం నిత్య జీవితంలో తినే మామిడి, తదితర పండ్ల పరిస్థితి ‘మేడి పండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు’ అన్న చందంగా మారింది. అధికాదాయం కోసం కొందరు వ్యాపారులు విషపూరిత రసాయనాలు వాడి కాయలను మాగబెట్టి మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. -
పంట బీమాపై ఆశలు
[ 20-05-2024]
ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వచ్చే వానాకాలం సీజన్లో అమలు చేయనున్న పంటల బీమా పథకంపై వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
సమస్యలే విస్తరణ
[ 20-05-2024]
జిల్లాలో మరో జాతీయ రహదారిగా పేరొందిన బేల రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం ప్రజలకు శాపంగా మారింది. టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాకపోవడం.. రాబోయేది వర్షాకాలం కావడంతో మరింత ఆలస్యం కానుంది. -
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యే స్ఫూర్తి
[ 20-05-2024]
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన ఆశయాలను సాధిస్తేనే ఘన నివాళులు అర్పించినట్లవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఆదివారం స్థానిక సుందరయ్యభవన్లో నిర్వహించారు. -
వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం!
[ 20-05-2024]
వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో ఈసారి అన్నిరకాల పంటలు సుమారు 4.60 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. -
అవకాశం ‘దూరం’ అవుతోంది
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్).. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఇది తొలిమెట్టు. ఇందులో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారు సైతం పదోన్నతుల కోసం ఈ పరీక్ష రాయాల్సి ఉంది. -
ఓ వైపు పూల సోయగం.. మరో దిక్కు నిర్లక్ష్యం
[ 20-05-2024]
జిల్లా కేంద్రంలో నలుదిక్కుల శివారు వరకు రహదారి వెడల్పు చేసి మధ్యలో విభాగినిలు నిర్మించారు. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా, విభాగినుల మధ్య మొక్కలు నాటారు. -
నిధుల లేమితో సతమతం
[ 20-05-2024]
ప్రజల ఆరోగ్యంగా ఉండటానికి కాలువల్లో ఉన్న మురుగు ఎత్తిపారేస్తూ.. రోడ్లన్నీ శుభ్రం చేస్తూ.. ఇంటింటా చెత్తను సేకరిస్తూ.. మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతూ పచ్చదనం కోసం పరితపిస్తున్న కార్మికుల బతుకులు మారడం లేదు. -
ఖరీఫ్ సాగుకు సిద్ధం
[ 20-05-2024]
-
నిధుల లేమి.. అభివృద్ధి కునారిల్లి
[ 20-05-2024]
పల్లెలకు ప్రధాన వనరులుగా భావించే నిధులను ప్రభుత్వం గత ఆరునెలలుగా నిలిపివేసింది. ఆదాయం లేక పంచాయతీలు సిబ్బందికి జీతాలు, విద్యుత్తు బకాయిల చెల్లింపు, పారిశుద్ధ్య పనులు చేసేందుకు అవస్థలు పడుతున్నాయి. -
సింగరేణిలో ఎందుకీ వివక్ష?
[ 20-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం లోయలో పడి 17 మంది మృతి
-
ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. ఇజ్రాయెల్ ప్రమేయం ఉందా?
-
హెచ్డీఎఫ్సీ నుంచి పిక్సెల్ పే క్రెడిట్ కార్డు.. రివార్డులు మీకు నచ్చినట్టుగా..
-
ప్రపంచంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదాలివే..
-
కోహ్లీని మించిన స్ఫూర్తి ఎవరు.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
-
ఏపీలో 33 చోట్ల హింసాత్మక ఘటనలు.. డీజీపీకి సిట్ నివేదిక అందజేత!