అంతుచిక్కని అల్లోల అంతరంగం
రెండు, మూడు రోజులు ఆగండి.. సార్, కాంగ్రెస్ పెద్దోళ్లతో మాట్లాడుతున్నారు.. ఆయనతోనేే కలిసి ఆ పార్టీలో చేరుదాం.. తొందరపడి ఎటూ వెళ్లకండి అంటూ భారాసకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు పక్షం రోజులుగా ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులకు బుజ్జగిస్తూ వస్తున్నారు.
ఊగిసలాటలో అనుచరులు
నిర్మల్, న్యూస్టుడే: రెండు, మూడు రోజులు ఆగండి.. సార్, కాంగ్రెస్ పెద్దోళ్లతో మాట్లాడుతున్నారు.. ఆయనతోనేే కలిసి ఆ పార్టీలో చేరుదాం.. తొందరపడి ఎటూ వెళ్లకండి అంటూ భారాసకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు పక్షం రోజులుగా ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులకు బుజ్జగిస్తూ వస్తున్నారు. ఆ మాటలు నమ్మిన కొందరు వేచి చూస్తుండగా.. మరికొందరు ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. భారాస ప్రజాప్రతినిధులు, వివిధ పదవులు చేపట్టిన నేతలు ఒక్కొక్కరు కారు దిగిపోతున్నా.. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మాత్రం తన అంతరంగాన్ని బయటపెట్టడం లేదు. అసలు హస్తం గూటిలో చేరుతారా.. ఆగుతారా అనేది తేలకపోవడంతో ఇన్నాళ్లూ ఆయనతో పనిచేసిన నేతలు, అనుచరులు ఊగిసలాటలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మాజీ మంత్రిని కాదని కాంగ్రెస్లో చేరిన తర్వాత కొద్ది రోజులకే ఆయన అదే పార్టీలోకి వస్తే తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది.
ఇప్పటికే ఆలస్యం అవుతుందని...
మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం దాదాపు 20 రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఇన్నాళ్లూ ఆయనతోనే హస్తం గూటిలో చేరుదామని ఎంపీపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ మాజీ ఛైర్మన్లు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, భారాస వివిధ విభాగాల బాధ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భావించినా.. ఆయనను పార్టీలో చేర్చుకోవద్దని స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వెల్లడైన విషయం తెలిసిందే. దీంతో ఆయన హస్తం పార్టీలో చేరిక వ్యవహారం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదని భావించిన వారంతా భారాసను వీడి ‘చే’యందుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో భారాస జిల్లా అధ్యక్షుడు, ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరగా.. మామడ మండల ఉపాధ్యక్షుడు లింగారెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ గంగారెడ్డి, ఆరెపల్లి మాజీ సర్పంచి అరవిందరావు, పొన్కల్ మాజీ ఉప సర్పంచి నరేశ్రెడ్డితోపాటు మరికొందరు నేతలు హస్తం పార్టీలో చేరారు. నాలుగు రోజుల క్రితం నిర్మల్లో డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు ఆధ్వర్యంలో మంత్రి సీతక్క సమక్షంలో నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ అప్పాల గణేశ్చక్రవర్తి, 12 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
భవిష్యత్తు కోసమంటూ...
అధికార బలం ఉన్న వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా కలిసొస్తుందనేది తెలిసిందే. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. వచ్చే ఏడాది జనవరి నెలాఖరుతో మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగిసిపోతుంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం భారాస ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడానికి ఆసక్తి చూపిస్తున్న ఆశావహులు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోనూ భారాస ఎమ్మెల్యేలు ఓడిపోవడంతో రాజకీయంగా రానున్న రోజుల్లో తమకు అవకాశం లేకనే ఆ పార్టీని వీడుతున్నామని భారాస ప్రజాప్రతినిధులు, నాయకులు చెబుతుండటం గమనార్హం. పార్లమెంటు ఎన్నికల సమయంలో చేరికలతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తప్పిపోయిన చిన్నారులను చైల్డ్ లైన్కు అప్పగింత
[ 20-05-2024]
జిల్లా కేంద్రమైన అదిలాబాదులోని పంజాబ్ కూడలిలో ధనలక్ష్మి లాడ్జీ వద్ద ఏడుస్తూ ఉన్న ఇద్దరు తప్పిపోయిన చిన్నారులను స్పెషల్ బ్రాంచ్ పోలీస్ కానిస్టేబుల్ చిందం దేవిదాస్ చైల్డ్ లైన్కు అప్పగించారు. -
ప్రశాంతంగా టెట్
[ 20-05-2024]
ఉపాధ్యయ అర్హత పరీక్ష (టెట్) సోమవారం మొదటిరోజు ప్రశాంతంగా ముగిసింది. -
ఏఎన్ఎంలకు పనిభారాన్ని తగ్గించాలి
[ 20-05-2024]
జనాభా ప్రాతిపదికన రెండో ఏఎన్ఎంలను నియమించి పని భారాన్ని తగ్గించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు
[ 20-05-2024]
ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. -
విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలి
[ 20-05-2024]
భాజపా నాయకులు విమర్శలు చేసేముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆ పార్టీ జిల్లా నాయకురాలు అన్నపూర్ణ సూచించారు. -
గంగపుత్ర శివాలయంలో మహా అన్నదానం
[ 20-05-2024]
జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
పిడుగుల కాలం.. అన్నదాతల అప్రమత్తం
[ 20-05-2024]
ఎవరైనా కలచివేసే వార్త చెబితే పిడుగులాంటి వార్త చెప్పావు అని అంటుంటారు. ఇంత తీవ్రమైన పదం వాడారంటే ఆ పిడుగుకున్న శక్తి అలాంటిది మరి. తన శక్తిని కోల్పోయేందుకు అది ఆకాశం నుంచి నేల పైకి దూసుకొస్తుంది. మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి. -
అర్హులు ఎందరో.. వినియోగించుకుంది కొందరే
[ 20-05-2024]
వందశాతం పోలింగ్ నమోదే లక్ష్యంగా ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఆ అవకాశం వినియోగించుకునేలా ఎన్నికల సంఘం హోం ఓటింగ్కు అవకాశం కల్పించినా.. కొద్ది మందే ఆ సదుపాయం వినియోగించుకున్నారు. -
ఫలరాజం.. ప్రాణాంతకం
[ 20-05-2024]
మనం నిత్య జీవితంలో తినే మామిడి, తదితర పండ్ల పరిస్థితి ‘మేడి పండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు’ అన్న చందంగా మారింది. అధికాదాయం కోసం కొందరు వ్యాపారులు విషపూరిత రసాయనాలు వాడి కాయలను మాగబెట్టి మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. -
పంట బీమాపై ఆశలు
[ 20-05-2024]
ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వచ్చే వానాకాలం సీజన్లో అమలు చేయనున్న పంటల బీమా పథకంపై వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
సమస్యలే విస్తరణ
[ 20-05-2024]
జిల్లాలో మరో జాతీయ రహదారిగా పేరొందిన బేల రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం ప్రజలకు శాపంగా మారింది. టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాకపోవడం.. రాబోయేది వర్షాకాలం కావడంతో మరింత ఆలస్యం కానుంది. -
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యే స్ఫూర్తి
[ 20-05-2024]
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన ఆశయాలను సాధిస్తేనే ఘన నివాళులు అర్పించినట్లవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఆదివారం స్థానిక సుందరయ్యభవన్లో నిర్వహించారు. -
వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం!
[ 20-05-2024]
వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో ఈసారి అన్నిరకాల పంటలు సుమారు 4.60 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. -
అవకాశం ‘దూరం’ అవుతోంది
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్).. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఇది తొలిమెట్టు. ఇందులో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారు సైతం పదోన్నతుల కోసం ఈ పరీక్ష రాయాల్సి ఉంది. -
ఓ వైపు పూల సోయగం.. మరో దిక్కు నిర్లక్ష్యం
[ 20-05-2024]
జిల్లా కేంద్రంలో నలుదిక్కుల శివారు వరకు రహదారి వెడల్పు చేసి మధ్యలో విభాగినిలు నిర్మించారు. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా, విభాగినుల మధ్య మొక్కలు నాటారు. -
నిధుల లేమితో సతమతం
[ 20-05-2024]
ప్రజల ఆరోగ్యంగా ఉండటానికి కాలువల్లో ఉన్న మురుగు ఎత్తిపారేస్తూ.. రోడ్లన్నీ శుభ్రం చేస్తూ.. ఇంటింటా చెత్తను సేకరిస్తూ.. మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతూ పచ్చదనం కోసం పరితపిస్తున్న కార్మికుల బతుకులు మారడం లేదు. -
ఖరీఫ్ సాగుకు సిద్ధం
[ 20-05-2024]
-
నిధుల లేమి.. అభివృద్ధి కునారిల్లి
[ 20-05-2024]
పల్లెలకు ప్రధాన వనరులుగా భావించే నిధులను ప్రభుత్వం గత ఆరునెలలుగా నిలిపివేసింది. ఆదాయం లేక పంచాయతీలు సిబ్బందికి జీతాలు, విద్యుత్తు బకాయిల చెల్లింపు, పారిశుద్ధ్య పనులు చేసేందుకు అవస్థలు పడుతున్నాయి. -
సింగరేణిలో ఎందుకీ వివక్ష?
[ 20-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం లోయలో పడి 17 మంది మృతి
-
ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. ఇజ్రాయెల్ ప్రమేయం ఉందా?
-
హెచ్డీఎఫ్సీ నుంచి పిక్సెల్ పే క్రెడిట్ కార్డు.. రివార్డులు మీకు నచ్చినట్టుగా..
-
ప్రపంచంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదాలివే..
-
కోహ్లీని మించిన స్ఫూర్తి ఎవరు.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
-
ఏపీలో 33 చోట్ల హింసాత్మక ఘటనలు.. డీజీపీకి సిట్ నివేదిక అందజేత!