అమ్మా స్కూలు వద్దకెళుతున్నాం...ఇదే ఆ చిన్నారుల చివరి మాట
అమ్మా స్కూలు వద్దకెళుతున్నాం.. అంటూ ఆ చిన్నారులు తమ తల్లులకు చెప్పారు. అవే.. ఆ మాతృమూర్తులకు వినిపించిన చివరి పలుకులయ్యాయి. పిల్లలిద్దరూ పెన్నా నదిలో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. సిద్దవటం ఎస్సై మధుసూదన్రెడ్డి తెలిపిన
సిద్దవటం, న్యూస్టుడే : అమ్మా స్కూలు వద్దకెళుతున్నాం.. అంటూ ఆ చిన్నారులు తమ తల్లులకు చెప్పారు. అవే.. ఆ మాతృమూర్తులకు వినిపించిన చివరి పలుకులయ్యాయి. పిల్లలిద్దరూ పెన్నా నదిలో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. కడప జిల్లా సిద్దవటం ఎస్సై మధుసూదన్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. సిద్దవటంలోని రత్నసభాపతి నగర్కు చెందిన నంద్యాల శ్రీరాములు, భార్య జ్యోతి అనే దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. శ్రీరాములు జీవనోపాధి నిమిత్తం మూడు నెలల కిందట గల్ఫ్ దేశానికి వెళ్లారు. వీరి బంధువైన శేఖర్, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. ఈయన స్థానికంగా కూలీచేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు.
శ్రీరాములు మొదటి కుమారుడు సతీష్(10), శేఖర్ రెండో కుమారుడు బాలాజీ (7) బుధవారం సాయంత్రం పాఠశాల వద్దకు వెళ్లి వస్తామని తల్లులకు చెప్పి చిన్న సైకిల్పై పెన్నా లోలెవెల్ కాజ్వే వద్దకు వెళ్లారు. రాత్రయినా వారు ఇళ్లకు చేరకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు అంతటా గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. సతీష్ ఎగువపేటలోని ప్రభుత్వ పాఠశాలలో అయిదో తరగతి, బాలాజీ రెండో తరగతి చదువేవారు.పెన్నానది లోలెవెల్ కాజ్వేపై ఆ చిన్నారుల సైకిల్ ఉండడంతో నదిలో ఈతకు వెళ్లి గల్లంతై ఉంటారనే అనుమానంతో ఒంటిమిట్ట సీఐ రాజాప్రభాకర్, సిద్దవటం ఎస్సై మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో ఈతగాళ్లు రాత్రి గాలింపు చేపట్టారు. నీటి మడుగులో చిక్కుకుని ఉన్న ఇద్దరు చిన్నారుల మృతదేహాలను ఈతగాళ్లు వల ద్వారా గురువారం వెలికితీశారు. మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీళ్లపర్యంతమయ్యారు. పంచనామా నిమిత్తం మృతదేహాలను కడప సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. విద్యార్థుల మృతికి సిద్దవటం బాధ్య ఎంఈవో వెంకటరామిరెడ్డి, కడప ఎంఈవో నారాయణ సంతాపం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడి రాజ్యం.. ఆరోగ్యశ్రీకి అనారోగ్యం...!
[ 27-04-2024]
కడప నగరానికి చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. -
మరుపురానిది ‘జగనాసుర రక్తచరిత్ర’!
[ 27-04-2024]
‘జగనాసుర రక్తచరిత్ర’ మరుపురానిదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో జరిగిన అరాచకాలు చరిత్రకెక్కుతాయని వివరించారు. -
జగన్ హామీకి తొండి... పరిహారానికి గండి..!
[ 27-04-2024]
కొండాపురం మండలంలో పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట 26.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గండికోట జలాశయం నిర్మించడంతో కొండాపురం, ముద్దనూరు మండలాల పరిధిలోని 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. -
న్యాయం చేస్తానన్నావ్...సాయం చేయకున్నావ్...!
[ 27-04-2024]
సోమశిల వెనుక జలాలతో ముంపు గ్రామాల ప్రజలు అధైర్యపడొద్దు. మీకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరంతా సంతృప్తి చెందేలా పునరావాస ప్యాకేజీ వర్తింపజేస్తాం. -
నేత్రపర్వంగా పురుషోత్తముడికి పుష్పాభిషేకం
[ 27-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం పురుషోత్తముడి పుష్పాభిషేకం నేత్రపర్వంగా సాగింది. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. కడప పార్లమెంట నియోజకవర్గానికి సంబంధించి 32 నామపత్రాలు దాఖలు కాగా 14 ఆమోదించారు. -
30న పీలేరు, మైదుకూరులలో సీఎం జగన్ బహిరంగ సభలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు, పీలేరులో ఈ నెల 30న నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. -
పెద్దిరెడ్డి కుటుంబాన్ని సాగనంపండి
[ 27-04-2024]
రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని, ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
ఆపు నీ డప్పు... ఇవ్వు మా డబ్బు!
[ 27-04-2024]
జిల్లాలో గతేడాది మిగ్జాం తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందే అవకాశాలు కనిపించట్లేదు. -
క్షణం క్షణం... భయం భయం
[ 27-04-2024]
ఇళ్లలో ఉంటే విద్యుత్తు తీగలు ఎప్పుడు కింద పడుతాయోననే భయం.. ఆరుబయటికి వస్తే పిల్లలు తెలియక తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తాకి ప్రమాదాల బారిన పడుతారేమోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.