Andhra News: ప్రియుడిని రెచ్చగొట్టి భర్తను చంపించిన భార్య
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించింది భార్య. అనంతరం దర్యాప్తు ఆపేయాలని ఆమె పదే పదే కోరడంతో అనుమానం వచ్చి పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెతో పాటు పలువురిని విచారించగా భర్తను చంపింది తామేనని వారు అంగీకరించారు.
వివరాలు వెల్లడిస్తున్న అదనపు ఎస్పీ అనిల్కుమార్, ముసుగు ధరించి నిల్చున్న నిందితులు
విజయనగరం నేరవార్తా విభాగం, పూసపాటిరేగ, న్యూస్టుడే: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించింది భార్య. అనంతరం దర్యాప్తు ఆపేయాలని ఆమె పదే పదే కోరడంతో అనుమానం వచ్చి పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెతో పాటు పలువురిని విచారించగా భర్తను చంపింది తామేనని వారు అంగీకరించారు. విజయనగరం జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి అదనపు ఎస్పీ అనిల్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. డెంకాడ మండలం డి.బాడువకు చెందిన డి.రామకృష్ణ (51) ఆటో నడుపుతూ వచ్చిన సొమ్మును మద్యం తాగేందుకు ఖర్చు చేసేవాడు. డబ్బులు లేకపోతే భార్య లక్ష్మిని అడిగేవాడు. ఆమె పైడిభీమవరంలోని ఫార్మా కంపెనీ క్యాంటీన్లో హెల్పర్గా పని చేస్తోంది. అదే కంపెనీలో సూపర్వైజర్గా చేస్తున్న పెద్ద తాడివాడకు చెందిన బి.దశకంఠేశ్వరరావుతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నారు. లక్ష్మి అవసరాలకు ఆయనే డబ్బులు సమకూర్చేవారు. ఏడాది కిందట ఈ విషయం రామకృష్ణకు తెలియడంతో ఇంట్లో ఘర్షణ జరిగింది. ఆయన అడ్డు తొలగించుకునేందుకు పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. నిరాశ చెందిన లక్ష్మి బి.దశకంఠేశ్వరరావుతో వాగ్వాదానికి దిగింది. ఓ తాగుబోతుని చంపలేని నువ్వు దేనికి పనికొస్తావంటూ రెచ్చగొట్టింది. దీంతో ఆయన అదే కంపెనీలో పనిచేస్తున్న పూసపాటిరేగ మండలానికి చెందిన జి.శంకరరావు సహాయంతో ప్రణాళిక రచించారు.
వంతెన పైనుంచి తోసేయాలని.. గత నెల 2న పేరాపురం సమీపంలో ఆటో నడుపుతున్న రామకృష్ణకు ఫోన్ చేసి మద్యం తాగేందుకు దశకంఠేశ్వరరావు పిలిచారు. రాత్రి 8 గంటల సమయంలో పిట్టపేట వైపు ఆటోలో వెళ్లి మద్యం తాగి తిరిగి పయనమయ్యారు. అనంతరం రామకృష్ణతో జి.శంకరరావు గొడవకు దిగి ఆటోలో నుంచి తోసేశాడు. రోడ్డుపై పడిన రామకృష్ణ తలకు తీవ్రగాయమవ్వడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందాడు. మృతదేహాన్ని సీహెచ్ అగ్రహారం వద్ద పొలాల్లో పూడ్చాలనుకొని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆటోలో మృతదేహాన్ని పెట్టుకుని నాతవలస వంతెన పైనుంచి కిందకు తోసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ద్విచక్రవాహనం రావడంతో రోడ్డుపైనే ఆటోను తిరగేసి పరారయ్యారు. అనంతరం రామకృష్ణ కుమార్తె ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రక్రియను ఆపేయాలని లక్ష్మి పదేపదే పోలీసులను ఆశ్రయించడంతో అనుమానం వచ్చిన ఎస్ఐ జయంతి వారిని విచారించడంతో చంపింది తామేనని అంగీకరించారు. కేసును ఛేదించిన ఎస్ఐ ఆర్.జయంతి, కానిస్టేబుల్ దామోదరరావు, సిబ్బందిని అదనపు ఎస్పీ పి.అనిల్కుమార్ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చీపురుపల్లిలో విజయం సాధించి తీరాలి
[ 26-04-2024]
‘చీపురుపల్లిలో విజయమే లక్ష్యంగా కిమిడి కుటుంబం అంతా కలిసి పనిచేయండి.. పరస్పరం సహకరించుకోండి’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. -
చూస్తుంటే.. మరో రుషికొండలా ఉందే
[ 26-04-2024]
దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామ సమీపంలోని పచ్చగా ఉన్న కొండ మరో రుషికొండను తలపిస్తోంది. అక్రమార్కులు దీనిని ఇలా తయారు చేశారు. కన్నాం, చినకాద, గడసాం గ్రామాల రైతులు, గొర్రెలకాపరులు ఈ కొండపైనే మూగజీవాల్ని మేపుతుంటారు. -
‘రెస్కోకు’.. బొత్స విలీన ‘మస్కా’
[ 26-04-2024]
ఓ చరిత్ర: చీపురుపల్లి గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థది (ఆర్ఈసీఎస్- రెస్కో) నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర. వెనుకబడిన ప్రాంతంలో వెలుగులు నింపిన ఒక ఐకాన్. సహకార రంగంలో వినియోగదారుల మన్ననలు అందుకుంది. -
ముగిసిన నామినేషన్ల స్వీకరణ
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణ గురువారం ముగిసింది. ఈనెల 16న ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఏడు శాసనససభ స్థానాలకు 105 మంది 184, విజయనగరం పార్లమెంటుకు 18 మంది 30 సెట్లు సమర్పించారు. -
నా అంటూనే.. ఉద్యోగులపై ఉక్కుపాదం
[ 26-04-2024]
సీపీఎస్ను రద్దు చేస్తాం.. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని అయిదేళ్ల క్రితం జగన్ హామీ ఇచ్చారు. అది నిజమనుకుని అందరూ నమ్మి ఓటేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిపై కక్ష పెంచుకున్నారు. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం