హెచ్ఎండీఏలో.. అమ్మో.. అక్రమార్కులు!
మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని పట్టణ ప్రణాళిక విభాగాల్లో అక్రమార్కుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న కూల్చివేతల్లో ఈ అక్రమాల పుట్ట కదులుతోంది. పలు మున్సిపాలిటీల్లో అనుమతులు లేకుండా భవనాలు నిర్మించడం, వాటిని చట్టబద్ధం చేసేందుకు సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. అనుమతులు తీసుకొని నిర్మించిన భవనాన్ని పట్టణ ప్రణాళిక అధికారులు
అనుమతి లేని ఇళ్ల నుంచి పన్నుల వసూలు
భవనాల కూల్చివేతల్లో వెలుగులోకి వాస్తవాలు
4 జోన్ల పరిధిలో 40 మందిపై చర్యలకు సిద్ధం
దూలపల్లిలో అక్రమ నిర్మాణాలను కూలుస్తున్న సిబ్బంది
ఈనాడు, హైదరాబాద్: మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని పట్టణ ప్రణాళిక విభాగాల్లో అక్రమార్కుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న కూల్చివేతల్లో ఈ అక్రమాల పుట్ట కదులుతోంది. పలు మున్సిపాలిటీల్లో అనుమతులు లేకుండా భవనాలు నిర్మించడం, వాటిని చట్టబద్ధం చేసేందుకు సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. అనుమతులు తీసుకొని నిర్మించిన భవనాన్ని పట్టణ ప్రణాళిక అధికారులు తనిఖీలు చేసి, అతిక్రమణలు లేకుంటే నివాసయోగ్య పత్రం జారీ చేస్తారు. అప్పుడే ఎంత పన్ను అనేది నిర్ణయిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇందుకు భిన్నంగా జరుగుతున్నట్లు తేలింది. అనుమతులు లేకుండానే భవనాలు నిర్మించగా, వాటికే పన్ను వసూలు చేయడం విస్తు గొలుపుతోంది. తాజాగా మేడ్చల్ జోన్లో చేపట్టిన కూల్చివేతల్లో ఈ తరహా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ జోన్లోని నాలుగు మున్సిపాలిటీల్లో వందల సంఖ్యలో ఇలాంటి భవనాలున్నట్లు తెలుస్తోంది. ఇతర జోన్లలో ఇదే పరిస్థితి నెలకొంది. నగరానికి పక్కనే ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 7 కార్పొరేషన్లు, 22 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో పెద్ద ఎత్తున అక్రమ భవనాలు వెలిశాయి. కొన్ని రోజులుగా హెచ్ఎండీఏ స్థానిక రెవెన్యూ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ సిబ్బందితో కలిపి వీటిని గుర్తించే పనిలో పడింది. ఇప్పటివరకు 600 చదరపు గజాలు ఆపై ఉన్న భవనాలను 200వరకు గుర్తించారు. ఇందులో 60కి పైగా భవనాలను సిబ్బంది పాక్షికంగా కూల్చివేశారు. జీప్లస్ 2 నిర్మాణాలకు సంబంధిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అనుమతులు ఇస్తాయి. అంతకు మించితే హెచ్ఎండీఏలో దరఖాస్తు చేసుకోవాలి. చాలామంది జీప్లస్2కే అనుమతి తీసుకొని అయిదు, ఆరు అంతస్తులు నిర్మిస్తున్నారు. 600 గజాలు ఆపైన స్థలాల్లో అనుమతులు లేకుండా భారీ షెడ్లు ఇతర నిర్మాణాలు చేపడుతున్నారు. భారీ అపార్ట్మెంట్లు నిర్మించి వాటిని విక్రయించి ప్రజలను మోసగిస్తున్నారు.
ఇంటి దొంగల హస్తంపై ఆరా
* హెచ్ఎండీఏ పరిధిలో మేడ్చల్, ఘట్కేసర్, శంకర్పల్లి, శంషాబాద్ జోన్లు ఉన్నాయి. ఇక్కడి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పట్టణ ప్రణాళి విభాగాలు అవినీతి నిలయాలుగా మారాయనటానికి పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలే నిరద్శనంగా నిలుస్తున్నాయి.
* ఈ నాలుగు జోన్ల పరిధిలో తొలి విడతలో 600 గజాలు ఆపైన అక్రమ నిర్మాణాలను 200 వరకు హెచ్ఎండీఏ గుర్తించింది. మరో 600 వరకు ఈ తరహా భవనాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
* నగరాన్ని ఆనుకుని ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉండటంతో స్థలాలకు భారీగా డిమాండ్ పెరిగింది. హెచ్ఎండీఏ నుంచి అనుమతులు తీసుకొని వెంచర్లు, నిర్మాణాలు చేపట్టాలంటే లేఅవుట్ రుసుంలు, అభివృద్ధి ఛార్జీల పేరుతో పెద్ద మొత్తంలో చెల్లించాలి. నిర్మాణాలు పూర్తయ్యే వరకు హెచ్ఎండీఏ వద్ద స్థలాలు, లేదా ఫ్లాట్లు తనఖా పెట్టాలి. కొందరు ఈ నిబంధనలు పాటించక కుండా అక్రమ పద్ధతులను ఎంచుకుంటున్నారు.
* నాలుగు జోన్లలో భారీగా అక్రమ భవనాలు రావడంలో స్థానిక పట్టణ ప్రణాళిక విభాగం హస్తం ఉందనేది బహిరంగ రహస్యమే. స్తిరాస్థి వ్యాపారులతో కొందరు సిబ్బంది కుమ్మక్కై వాటాలు తీసుకొని అక్రమ భవనాలను ప్రోత్సహిస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారుల వద్ద పక్కా సమాచారం ఉంది.
* మేడ్చల్లో తాజాగా పలు భవనాలకు అక్రమంగా ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య(పీటీఐఎన్)నెంబర్లు కేటాయించి ఆస్తి పన్నులు సైతం వసూలు చేస్తున్న వైనం ఓ ఉన్నతాధికారి దృష్టికి వచ్చింది. సంబంధిత ఉద్యోగిని పిలిచి ప్రశ్నించారు. ఆ భవనాలను ఉన్నతాధికారి సీజ్ చేయించారు.
* ఇలా నాలుగు జోన్ల పరిధిలో దాదాపు 40-50 పట్టణ ప్రణాళిక సిబ్బంది హస్తంతోనే ఈ అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో భవనం నుంచి లక్షల్లోనే వసూలు చేసి పంచుకున్నారు. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు.
* క్షేత్రస్థాయి సిబ్బందికి మెమోలు జారీ చేయాలని నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది గంటలకే పార్కులకు తాళం
[ 20-05-2024]
విశ్రాంతి లేని నగరం హైదరాబాద్. ఎప్పుడు రోడ్డుపైకి వెళ్లినా వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. రాత్రి వేళల్లోనూ ఐటీకారిడార్, కొన్ని ప్రధాన రహదారులపై కార్యాలయాలు పనిచేస్తుంటాయి. -
కిలోమీటరున్నర పనులు.. నాలుగు నెలలు
[ 20-05-2024]
నగరంలో వానాకాలం ప్రారంభం నాటికే రహదారులు, భూగర్భ తవ్వకాల పనులు పూర్తి చేయాలి. లేదంటే వరదలతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. -
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?
[ 20-05-2024]
హైదరాబాద్ మెట్రోలో సగటున ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వారి నుంచి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థకు టికెట్ల ద్వారా రూ.కోటిన్నర ఆదాయం సమకూరుతోంది. -
కంటికి రెప్పలా.. కదిలారు
[ 20-05-2024]
పిల్లల్లో ఏర్పడే కంటి క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం ‘వైటథాన్ రన్’ పేరిట పరుగు నిర్వహించారు.హెచ్సీయూలో జరిగిన ఈ పరుగును మాదాపూర్ డీసీపీ డా.జి.వినీత్ ప్రారంభించారు. -
అసెంబ్లీకి ఓటెత్తి..లోక్ సభకు అనాసక్తి
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో..ప్రధాన పార్టీల అభ్యర్థులు అసెంబ్లీ సెగ్మెంట్లలో నమోదైన పోలింగ్ శాతాన్ని పోల్చుకుంటున్నారు. -
ఉద్యానాలు.. ఆక్రమించేశారు
[ 20-05-2024]
హైదరాబాద్ శివారులోని దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన రూ.వంద కోట్ల విలువైన మూడెకరాల స్థలాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించేశారు. -
భూనిర్వాసితులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశ చూపెట్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసంచేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని -
ప్రపంచంలోనే అరుదు.. బాంబే బ్లడ్ గ్రూపు
[ 20-05-2024]
బాంబే బ్లడ్ గ్రూప్ ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ అని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
స్పందనలో వేగం.. నష్టానికి కళ్లెం
[ 20-05-2024]
అగ్నిప్రమాదాల సమయంలో ‘తక్షణ ప్రతిస్పందన సమయం’ పెరగడంతో ఆస్తి నష్టం తగ్గుతోంది. ఫైరింజన్ వెళ్లడం కాస్త ఆలస్యమైనా కోట్లాది రూపాయల ఆస్తి కాలిబూడిదయ్యే ప్రమాదం ఉంది. -
బెట్టింగ్లతో అప్పులపాలై.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
[ 20-05-2024]
ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడ్డ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఎంఎస్ఎంఈ యూనిట్ల అద్దె కష్టాలకు చెక్
[ 20-05-2024]
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అద్దె కష్టాలు, యూనిట్ విస్తరణ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు యూనిట్ల తరలింపునకు తొలి అడుగు పడింది. -
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
[ 20-05-2024]
పీర్జాదిగూడ నగరంలో అవిశ్వాస తీర్మానంపై ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, భారాసలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పాటు బల నిరూపణకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా సమన్వయకర్తగా అంబర్పేట జైస్వాల్ గార్డెన్కు చెందిన మధుసత్యం గౌడ్ నియమితులయ్యారు. -
ఎరువు.. కావాలి ఆదరువు
[ 20-05-2024]
పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
పల్లె పోరుకు కసరత్తు
[ 20-05-2024]
స్థానిక సమరానికి కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘నేలబిడ్డల’పై.. నిప్పులు చిమ్మిన నింగి
[ 20-05-2024]
ప్రకృతితో మమేకమయ్యే హలధారి.. వానకు తడిసి.. ఎండకు ఎండి పంటే ప్రాణంగా ముందుకు ‘సాగు’తాడు. ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. -
కలుద్దామని పిలిచి.. గొలుసు చోరీ
[ 20-05-2024]
సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తులు.. ఓ ఐటీ ఉద్యోగిని హింసించి బంగారు గొలుసు అపహరించిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..