‘పురపాలకాల్లో అభివృద్ధి పనులు వేగిరం’
మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ నుంచి మున్సిపల్ ఛైర్మన్లు, కమిషనర్లు, డీఈలు, ప్రజారోగ్య శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్టుడే: మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ నుంచి మున్సిపల్ ఛైర్మన్లు, కమిషనర్లు, డీఈలు, ప్రజారోగ్య శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఫిబ్రవరి 1 నాటికి ఇంటింటి చెత్త సేకరణ వందశాతం జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం కొత్తగూడెంలో 67, ఇల్లెందులో 95, పాల్వంచలో 76, మణుగూరులో 40 శాతం ఇళ్ల నుంచి మాత్రమే నేరుగా చేత్త సేకరణ చేపడుతున్నారన్నారు. తడి చెత్త నుంచి వర్మీ కంపోస్టు తయారు చేయాలని, టెట్రా వర్మీ బెడ్ల ఏర్పాటులో వేగం పెరగాలని అన్నారు. కొత్తగూడెం రాజీవ్ పార్క్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సమీకృత మార్కెట్ సముదాయాల పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. వైకుంఠధామాల్లో నీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీల్లో క్రీడా ప్రోత్సాహంలో భాగంగా ఇండోర్ షటిల్ కోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందజేయాలన్నారు. పాల్వంచ సెంట్రల్ లైటింగ్ పనుల్లో జాప్యానికి కారణమైన గుత్తేదారుతో కాంట్రాక్టు రద్దు చేయాలని కమిషనర్ని ఆదేశించారు. గ్రంథాలయ నిర్మాణ డిజైన్ పూర్తిచేసి నివేదిక అందించాలన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, సకాలంలో వేతనాలు చెల్లించాలని సూచించారు. ‘ఈ-శ్రమ’ పోర్టల్లో వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. ఇల్లెందు పురపాలక ఛైర్మన్ డి.వెంకటేశ్వర్లు, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు కమిషనర్లు సంపత్కుమార్, శ్రీకాంత్, అంజన్కుమార్, నాగప్రసాద్, డీఈలు నవీన్, మురళి, ప్రజారోగ్య శాఖ డీఈ నవీన్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
[ 20-05-2024]
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
దోపిడీ, సామాజిక వివక్షపై ఉద్యమించాలి: తమ్మినేని
[ 20-05-2024]
సుందరయ్య స్ఫూర్తితో సామాజిక వివక్ష, దోపిడీ నిర్మూలనపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సుజాతనగర్ సీపీఎం పార్టీ కార్యాలయం సత్యం భవన్లో సుందరయ్య వర్ధంతి సభ నిర్వహించారు. -
ఒక ఉపకేంద్రం 20 నియంత్రికల ధ్వంసం
[ 20-05-2024]
కొందరు దొంగలు సొత్తు కోసం వ్యవసాయ పొలాల్లోని విద్యుత్తు నియంత్రికలనూ వదలడం లదు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 20-05-2024]
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటనపై రఘునాథపాలెం పోలీసు స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. -
లాభాల లహరి
[ 20-05-2024]
టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందిస్తూనే సంస్థ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ప్రైవేటుతో పోటీపడుతూ అధునాతన సదుపాయాలను తీసుకొస్తోంది. -
భూసార పరీక్షలు కొందరికే
[ 20-05-2024]
ఇష్టారీతి రసాయనిక ఎరువుల వినియోగంతో సాగు భూమి సారం కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. పంట భూమిలో నత్రజని, భాస్వరం, సేంద్రియ కర్బనాల్లాంటి పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో భూసార పరీక్షల ద్వారా తెలుసుకుని -
ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల పెంపుపై దృష్టి
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రవేశాల సంఖ్య పెంపుపై జిల్లా అధికారులు దృష్టిపెట్టారు. -
బతుకుజీవుడా..
[ 20-05-2024]
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా: మంత్రి పొంగులేటి
[ 20-05-2024]
ప్రతి పేదింటి కష్టసుఖాలను పంచుకుంటానని, అభివృద్ధిని చేతల్లో చూపుతానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం: శైలజ టీచర్
[ 20-05-2024]
దేశంలో కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం సాధ్యమైందని కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే శైలజ టీచర్ అన్నారు. -
మెలికలు తిరుగుతూ.. మెరికలుగా మారుతూ..
[ 20-05-2024]
జిమ్నాస్టిక్స్లో ప్రావీణ్యం సాధించాలంటే ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియానికి రావాల్సిందే. సాధన చేసే క్రీడాకారులపై ఆర్థిక భారం ఉండదు. సాధన కేంద్రమైన జిమ్నాజియం ఏర్పాటు రూ.కోట్ల ఖర్చుతో కూడుకున్నది. -
రాములోరికి పసిడి పుష్పార్చన
[ 20-05-2024]
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. -
‘భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం’
[ 20-05-2024]
భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదమని సీపీఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. సీపీఐఎంఎల్ మాస్లైన్ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం వైరాలోని అమరవీరుల నగర్లో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా