పత్తి కొనుగోళ్లపై తొలగని ప్రతిష్టంభన
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నాలుగు రోజుల నుంచి పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. జీఎస్టీ చెల్లింపుల విషయంలో అధికారులకు, వ్యాపారులకు మధ్య ఏర్పడిన సమస్య పరిష్కారం కోసం వ్యాపారులు నవంబరు 28న కొనుగోళ్లు నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఛైర్పర్సన్ లక్ష్మీప్రసన్నకు కర్షకుల ఇబ్బందులు వివరిస్తున్న రైతుకూలీ సంఘం నాయకులు గుర్రం అచ్చయ్య తదితరులు
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నాలుగు రోజుల నుంచి పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. జీఎస్టీ చెల్లింపుల విషయంలో అధికారులకు, వ్యాపారులకు మధ్య ఏర్పడిన సమస్య పరిష్కారం కోసం వ్యాపారులు నవంబరు 28న కొనుగోళ్లు నిలిపివేసిన విషయం తెలిసిందే. ·రైతు సంఘాలు సైతం కొనుగోళ్లు చేపట్టాలని ఆందోళన నిర్వహిస్తున్నాయి. గురువారం ఉదయం వ్యవసాయ మార్కెట్లో పత్తి వ్యాపారులతో సమావేశమయ్యాయి. వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, ఉపాధ్యక్షుడు జీవై నరేశ్, దిగుమతిశాఖ అధ్యక్ష, కార్యదర్శులు దిరిశాల చిన వెంకటేశ్వర్లు, ముత్యం ఉప్పల్రావు, ఎగుమతిశాఖ అధ్యక్ష, కార్యదర్శులు నల్లమల ఆనంద్, చెరుకూరి సంతోష్కుమార్, ఛాంబర్ ఈసీ సభ్యులు, పలువురు కార్యదర్శులు, ప్రజాపంథా జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు గుర్రం అచ్చయ్య, జిల్లా కార్యదర్శి ఆవుల వెంకటేశ్వర్లు చర్చించారు. కొనుగోళ్లు జరపాలని మార్కెట్ పాలకవర్గం, అధికారులు, దిగుమతిశాఖ విజ్ఞప్తి చేసినా సమ్మెకే సిద్ధపడ్డారు. అధికారులు పత్తి మార్కెట్కు శుక్రవారమూ బంద్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఏఎంసీ ఛైర్పర్సన్ డౌలె లక్ష్మీప్రసన్న, వైస్ఛైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఆర్.మల్లేశం దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ మధుసూదన్ను కలిసి ఇక్కడి పరిస్థితిని వివరించారు. మరోవైపు వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి వ్యాపారులు కొనుగోళ్ల నిలిపివేతకు గురువారం అక్కడి అధికారులకు నోటీసులు ఇచ్చారు.
నేడు హైదరాబాద్లో చర్చలు:
పత్తి వ్యాపారుల సమస్య మంత్రులు నిరంజన్రెడ్డి, హరీశ్రావు దృష్టికి వెళ్లింది. ఖమ్మం, వరంగల్ మార్కెట్ల పరిధిలోని పత్తి వ్యాపారులను చర్చల కోసం హైదరాబాద్కు శుక్రవారం ఆహ్వానించారు. కాటన్ ట్రేడర్స్ అండ్ జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొడవర్తి శ్రీనివాసరావు, ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగుమతిశాఖ అధ్యక్షుడు నల్లమల ఆనంద్, కార్యదర్శి చెరుకూరి సంతోష్కుమార్ చర్చలకు హాజరుకానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోపిడీ, సామాజిక వివక్షపై ఉద్యమించాలి: తమ్మినేని
[ 20-05-2024]
సుందరయ్య స్ఫూర్తితో సామాజిక వివక్ష, దోపిడీ నిర్మూలనపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సుజాతనగర్ సీపీఎం పార్టీ కార్యాలయం సత్యం భవన్లో సుందరయ్య వర్ధంతి సభ నిర్వహించారు. -
ఒక ఉపకేంద్రం 20 నియంత్రికల ధ్వంసం
[ 20-05-2024]
కొందరు దొంగలు సొత్తు కోసం వ్యవసాయ పొలాల్లోని విద్యుత్తు నియంత్రికలనూ వదలడం లదు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 20-05-2024]
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటనపై రఘునాథపాలెం పోలీసు స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. -
లాభాల లహరి
[ 20-05-2024]
టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందిస్తూనే సంస్థ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ప్రైవేటుతో పోటీపడుతూ అధునాతన సదుపాయాలను తీసుకొస్తోంది. -
భూసార పరీక్షలు కొందరికే
[ 20-05-2024]
ఇష్టారీతి రసాయనిక ఎరువుల వినియోగంతో సాగు భూమి సారం కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. పంట భూమిలో నత్రజని, భాస్వరం, సేంద్రియ కర్బనాల్లాంటి పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో భూసార పరీక్షల ద్వారా తెలుసుకుని -
ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల పెంపుపై దృష్టి
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రవేశాల సంఖ్య పెంపుపై జిల్లా అధికారులు దృష్టిపెట్టారు. -
బతుకుజీవుడా..
[ 20-05-2024]
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా: మంత్రి పొంగులేటి
[ 20-05-2024]
ప్రతి పేదింటి కష్టసుఖాలను పంచుకుంటానని, అభివృద్ధిని చేతల్లో చూపుతానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం: శైలజ టీచర్
[ 20-05-2024]
దేశంలో కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం సాధ్యమైందని కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే శైలజ టీచర్ అన్నారు. -
మెలికలు తిరుగుతూ.. మెరికలుగా మారుతూ..
[ 20-05-2024]
జిమ్నాస్టిక్స్లో ప్రావీణ్యం సాధించాలంటే ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియానికి రావాల్సిందే. సాధన చేసే క్రీడాకారులపై ఆర్థిక భారం ఉండదు. సాధన కేంద్రమైన జిమ్నాజియం ఏర్పాటు రూ.కోట్ల ఖర్చుతో కూడుకున్నది. -
రాములోరికి పసిడి పుష్పార్చన
[ 20-05-2024]
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. -
‘భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం’
[ 20-05-2024]
భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదమని సీపీఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. సీపీఐఎంఎల్ మాస్లైన్ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం వైరాలోని అమరవీరుల నగర్లో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం